Friday 25 October 2013

దాంపత్య కలహాలు తొలగిపోవాలంటే జామపండును..?

భక్తి సమాచారం
దాంపత్య కలహాలు తొలగిపోవాలంటే జామపండును..?

దాంపత్య కలహాలు తొలగిపోవాలంటే.. జామపండ్లను శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి నైవేద్యంగా పెట్టి దంపతులకు తినేందుకు ఇస్తే దాంపత్యంలోని కలహాలు తొలగిపోతాయి.

సంకష్ట హర గణపతికి జామపండ్లను నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి దానం చేస్తే ఆరోగ్య భాగ్యం దేహంలోని నీరసం తొలగిపోతుంది. 

రుద్రాభిషేకం సమయంలో జామపండ్ల రసాన్ని కమలా పండు రసాలతో దేవునికి అభిషేకం చేసి ఇతరులకు పండును తినేందుకు ఇస్తే నిదానంగా జరుగుతున్న పనులు మీ మనసుకు ఇష్టమైన రీతిలో త్వరగా జరుగుతాయి.

తాంబూలంతో పాటు జామపండ్లను సంకల్ప సమేతంగా పూజ చేసి దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృత అభిషేకం జరిపి ప్రార్థన చేసి దేవునికి కుడివైపు ఉంటి ప్రార్థిస్తే వ్యాపారంలో అధిక లాభం కలుగుతుంది.