Thursday 31 October 2013

నరక చతుర్దశి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి ఇంకా రెండు రోజులు ఉంటుంది అనగా ( నరక చతుర్దశి) దీపావళి కొలాహలం మొదలు అవుతుంది. నరక చతుర్దశి నాడే దీపావళి అని అందరికి తెలిసిన విషియమే! అయితే ఈ పండగల గురించి కొన్ని తెలియని రహస్యాలు ప్రాచీన గ్రంధాలలో దాగున్నాయి.

చతుర్దశ్వాంతుయే దీపాన్నరకాయ దదంతిచ
తేషాం పితృ గణః సర్వే నరకాత్ స్వర్గమాప్నురయః

అంటే చతుర్దశి తిధి నాడు నరకలోకంలో ఉన్న పితృదేవతల కోసం దీపాలు వెలిగించితే, వారు స్వర్గలోక వాసాన్ని పొందుతారని అర్ధం.

ఆశ్వయుజ కృష్ణపక్షస్య చతుర్దాశ్యాం విధూదయే
తిల తైలేన కర్తవ్యం స్నానం నరక భీరుణా

ఆశ్వియుజ కృష్ణ చతుర్దశి నాడు చంద్రోదయానికి ముందు గానే నువ్వులు నూనేతో అభ్యంగన స్నానం చెయ్యాలి.(తలంటి స్నానం)

స్నానాంతరం తప్పనిసరిగా యమ తర్పణం విడవాలి.

ఇక్కడ చంద్రోదయ కాలానికి ప్రాముఖ్యత ఉంది. బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది ఘడియలకు అవుతుంది . అప్పటికి ఒక గంట లోపు మాత్రమే , రాత్రి సమయం ఉంటుంది.సరిగ్గా ఆ సమయంలోనే చతుర్దశి అభ్యంగన స్నానం చెయ్యాలి. సూర్యోదయం తరువాత చేసే అభ్యంగన స్నానానికి విలువ లేనందున, దాన్ని " గౌణం"అని అన్నారు (గౌణం అంటే ప్రాముఖ్యం లేనిది అని అర్ధం)

దీపావళి సమయంలో నువ్వుల నూనేతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనేను లక్ష్మి దేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి.ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది.

సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః
మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః

ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.
నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తల పై పెటుకుని, పదునాలుగు నామాలతో, తిల్లలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి.

యమాయ నమః
మృత్యువేనమః
వైవస్వతాయనమః
సర్వభూతక్షయాచ నమః
ధ్ధ్నాయనమః
పరమేష్టినే నమః
చిత్రాయ నమః
ధర్మరాజాయ నమః
అంతకాయ నమః
కాలాయ నమః
ఔదుంబరాయ నమః
నీలాయ నమః
వృకోదరాయ నమః
చిత్రగుప్తాయతే నమః

అంటు పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను.

కాబట్టి నరక చతుర్దశి నరకలోకవాసులకు పుణ్య గతులను కలిగించే పండుగ అని, అందుకే ఈ రోజున, తల్లి తండ్రులు లేని వారు తప్పకుండా దక్షిణ దిక్కున దీపం వెలిగించాలి.
చతుర్దశి నాటొ సాయంకాలం ప్రదోషకాలములో దీపదానం చెయ్యాలి.
దేవాలయాలలో దీప పంక్తులు ఏర్పాటు చెయ్యాలి. లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందటానికి దీపావళి చతుర్దశి నాడు, కార్తిక సుద్ధ పాడ్యమి నాడు తప్పకుండా దీపదానం చెయ్యాలి.

దీపావళి

దీపమాలికలతో ఆశ్వియుజ కృష్ణ అమావాశ్య నాడు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిదేవికి నీరాజనాలు అర్పించే రోజు ఈ దీపావళి అని చెప్పబడుతోంది. రాక్షస రాజు అయిన బలి పాతాళానికి అణగద్రొక్కబడినది, శ్రీ రాముడు పట్టాభిషిక్తుడుదైనది, విక్రమార్క చక్రవర్తికి పట్టాభిషేకం అయినది ఈ దీపావళి రోజునే కావడం విసేషం.

ఈ రోజున లక్ష్మి దేవి భూలోకానికి దిగి వచ్చి, ప్రతి ఇంటా తిరుగుతు ఉంటుంది, కాబట్టి ఇళ్ళను శుబ్ర పరుచుకుని, శుచిగా ఉంచుకొవలన్నది ఈ పండుగ ప్రథమ నియమం.
బలిని పాతాళానికి పంపిన వామనమూర్తి , అథడి చెరలోనున్న దేవతలను విడిపించి, తనతో పాటుగా క్షీరాబ్ది కి తీస్కునివెళ్ళింది అన్న రోజు ఈ రోజు కావడం వల్ల లక్ష్మిదేవికి ఈ రోజు అత్యంత ప్రీతికరమైన రోజు.

బాణ సంచా

దీపావళి నాడు పేల్చే టపాకాయలుకు (బాణసంచా) ఒక పురాణ కధనమే ఉంది. ప్రప్రధమముగా బాణసంచాను రూపొందించింది శ్రీ కృష్ణుని పత్ని సత్యభామ !

ఈమే తండ్రి సత్రాజిత్తుకు ఈ బాణసంచ చేసే విద్యను సూర్యుడు బోధించినట్లుగా "భాగవతం" పేరుకుంతొంది.

ఈ విద్యను సత్రాజిత్తు తన కుమార్తేకు ధారపోసాడని పురాణ కధనం.

నేటి ఆధునిక బాణ సంచాకు ముందు తాటి గిలకల పూలమట్టాలను,, జనపకట్టెల జుంజుం కట్టలను, పెద్ద నేపాళ విత్తనాలను పుల్లలకు గుచ్చి, వెలిగించి ఆనందించేవారు.

అవి నేటి కాకరపువ్వొత్తులు,మతాబులు,చిచ్చుబుడ్డ్లుకు సమానం. సబ్దాలు చేసే, వెలుగును ఇచ్చే బాణ సంచ వెనుక ఒక పురాణమైన, శాస్త్రపరమైన మరో సత్యం దాగి ఉంది. మహాలయ పక్షంలో పైలోకాల నుండి భూమికి దిగివచ్చిన పితృదేవతలు దీపావళి రాత్రి తిరిగి పయనమై ఊర్ధ్వలోకాలకు వెల్లే సమయము. ఈ వెలుగు
వారికి కాంతి బాటగా ఉండాలనే సద్ద్యుద్దేసముతో


Bramhasri Samavedam Shanmukha Sarma