Tuesday 15 October 2013

శాస్త్రీయంగా నిరూపితమైనభారతీయ కాలగణ

శాస్త్రీయంగా నిరూపితమైనభారతీయ కాలగణన: చెరుకు రామ మోహన రావు 

మన దేశమునకు వేదశాస్త్రేతిహాస పురాణములు ప్రమాణములు. ఇందులో పురాణములు సృష్ట్యాది మొదలు ఎన్నో విషయములు, వివరణలు, ఎంతో మంది రాజులు, మహాపురుషుల చరిత్రలు కలిగి వుంటాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలం చెప్పేవాళ్ళు అక్కడక్కడున్నా వినేవాళ్ళు తగ్గిపోయినారు. మన సంస్కారమే మన సంస్కృతి. ఈ సంస్కృతే మన దేశపు ఆకృతి.

అసలు విషయానికొస్తే పురాణం పంచ లక్షణమన్నారు ఆర్యులు. ఆర్యులంటే అప్రాచ్యులు చెప్పినట్లుగా సుమేరియ నుండి దిగబడినవారు కారు. (అప్రాచ్యులు అంటే న + ప్రాచ్యులు ~ తూర్పు దేశస్తులు కానివారు. అంటే పడమటి దేశస్తులు లేక పాశ్చాత్యులు).

ఈశ్వర పుత్రాః ఆర్యాః అని యాస్కాచార్యులవారు 5000 సంవత్సరముల క్రితం తన ఋగ్వేద భాష్యంలోనూ; 600 సంవత్సరముల క్రితం విద్యారణ్యులవారు తమ వేదభాశ్యంలోనూ వ్రాసి యున్నారు.

పురాణము యొక్క 5 లక్షణాలు ఏమిటి వంటే 1.సర్గ 2.ప్రతిసర్గ 3.మన్వంతర 4.రాజవంశ 5.అనువంశములు. మన చర్చలు మొదటి మూడు అవసరము .

1. సర్గ: సర్గయనగా సృష్టికి ఆది పునాది. పునాది అటులనే వున్నా ఆది కల్గినది అంతము కావలసినదే. పునాది ఆ నిరంజన నిరాకారుడే.
2. ప్రతిసర్గ: ప్రళయము వచ్చి ఈ సృష్టి అంతమైన తరువాత జరిగే పునఃసృష్టి మనకు తెలిసిన మత్సావతార కథ ప్రతిసర్గకు సంబంధించిందే. ఈ ఉదంతాన్ని బైబిల్ లో కుడా చూస్తాము. నోవా అనే నాయకుడు పడవలో జీవరాశిని మచ్చుకొకటి తీసుకొని క్రొత్త తీరమునకు వెళ్ళినట్లున్నది. మన పురాణ నిర్వచనము ప్రకారము ఇది ప్రతిసర్గయే. కాని వారందులో దీనిని నిర్వచించలేదు. ఇటువంటి ఉదంతములను గూడా మననుండి పాశ్చాత్యులు గ్రహించ్నట్లు తేట తెల్లమగుచున్నది. ఈ విధంగా సృష్ట్యాది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టి చే పరీక్షించి పరిశీలించి పరిశోధించిన మన మహర్షులు శాస్త్రజ్ఞులు ఐన పూర్వీకులు పాశ్చాత్యులు చెప్పినట్లు ఆటవికులా! అనాగారికులా! పాశ్చాత్యుల ప్రకారము సృష్ట్యాది క్రీస్తుకుపూర్వము 2000 సంవత్సరముల క్రితం జరిగినది. కానీ మన ఖగోళ శాస్త్ర ప్రకారము సృష్టి జరిగి 195,58,85,115 సంవత్సరములు (2013 వరకు) ఐనవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగములలో ప్రతివర్షము తెలియజేస్తారు. “మిస్టీరియస్ యూనివర్స్” గ్రంధ కర్త మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త యైన ‘సర్ జేమ్స్ జీన్స్’ పై పుస్తకములో చేసిన అంచనా (ఇంచుమించు 200 కోట్లు). మన పూర్వీకుల ప్రమాణమునకు చేరువలోనున్నది. ఇప్పటి కలి యుగము వచ్చి 5115 సంవత్సరములైనది. ఇంత నిర్డుస్టముగా లెక్కలు కట్టి వ్రాయబడినదే “పంచాంగము”.

పంచ + అంగము = పంచాంగము. ఐదు అంగములు కల్గినది. అవి ఏవన: 1.తిధి 2.వారము 3.నక్షత్రము 4.యోగము 5.కరణము.

1. తిధి: ప్రతి రోజు సూర్యుడు 1అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. అంటే వారిరువురి భ్రమణములోగల అంతరము 12డిగ్రీలు. (సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి తిరిగేది భూమి. కాని మనము భూమిపై నిలబడి ఖగోళమును గమనించెదము కావున సూర్యునిది సాపేక్ష భ్రమణము.) ఈ 12 డిగ్రీల అంతరమును తిధి అంటారు.

మొదటి రోజు 12 డిగ్రీలు ఐతే రెండవ రోజు 24 డిగ్రీలు ఇట్లు 180 డిగ్రీలు చంద్రుడు సుర్యునినుండి జరిగినపుడు పౌర్ణమి, తిరిగి సూర్యుని చేరినపుడు (360 డిగ్రీలు లేక ౦ డిగ్రీ) వరకు కృష్ణ పక్షమని ఈ చంద్రయానమునంటారు. ఒక సౌర దినము = 0.9483 చంద్ర తిధి. ఈ విధంగా ఒక చంద్రమానమునకు 29.53 రోజులుంటాయి.

2. వారము: “అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ కుజః పుమాన్ స్వార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యే తత్ హోర లక్షణం”
అన్నది జ్యోతిష శాస్త్రము. 2½ ఘడియల కాలము = 1హోర(hour). మొదటి హోర అర్క అంటే సూర్యుడు అంటే ఆదిత్యుడు. మొదటి హోరతో మొదలయ్యే రోజు కావున మొదటి వారము ఆదివారమైనది. ఒక రోజుకు 24 హోరలు. అర్క తో మొదలుపెట్టి ఎంచితే 24 హోరల తో ఆ దినము పుర్తియౌతుంది. 25 వ హోర చంద్ర హోర అంటే సోమవారము. ఈ ప్రకారముగా వరుసగా 7 వారాలు వస్తాయి. మన హోర నే పాశ్చాత్యులు hour గ ఉచ్చరించినారు. ఈ వారముల క్రమము ఈ విధముగా ఏర్పడినదని పాశ్చాత్యుల కెరుకలేదు. కాని ఈ వారముల క్రమమును యధా తధముగా తమ భాషలోనికి పేర్లను గూడా తర్జుమా చేసుకొని వాడుకొనుచున్నారు.

౩. నక్షత్రము: సాపేక్ష సౌర గమనమునకు ఒక ఏడాది కాలము పడితే, ఆ పథంలో ఆయనకు 12 మజితీలను గుర్తించి(ఈ

మజితీలను రాశులు అంటారు) ఆయన ప్రయాణాన్ని 27ప్రాంతాలు (నక్షత్రాలు) చుట్టునట్లు విభజించినారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు. 4+4+1 పాదము కలిస్తే ఒక రాశి. ౩వ నక్షత్రములోని మిగిలిన ౩ పాదములు నాల్గవ నక్షత్రములోని 4 పాదములు 5 వ నక్షత్రములోని 2 పాదములు కలిస్తే 2 వ రాశి. అంటే (౩+4+2=9) ఇది రెండవ రాశి. ఇట్లు 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. to be written some matter to be wirtten some matter to be written some matter 12*9=108 అంటే 27 నక్షత్రములలోని 4+4 .. .. .. పాదములను కలిపితే 27*4=108 పాదములగును. మానవుని పేర్లు ఈ 108 పాదములలో (ఆడ గాని, మగ గాని) ఏదో ఒక దానికి చెందును గాన అందరు సుఖంగా ఉండాలనే అష్ట్తోతర శత నామార్చన (108 పేర్లు) దేవునికి చేస్తారు. నక్షత్రముల పేర్లు రాశుల పేర్లు ఈ క్రింద పొందు పరచబడినవి
1.అశ్వని, 2.భరణి, ౩.కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర, 6.ఆర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ, 11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త, 14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనురాధ, 18.జేష్ఠ, 19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ఠ, 24.శతభిషం, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి.

12 రాశుల పేర్లు : 1.మేషం(Aries), 2.వృషభం(Taurus), 3.మిథునం(Jamini), 4.కర్కాటకం(Cancer), 5.సింహం(Leo), 6.కన్య(Virgo), 7.తుల(Libra), 8.వృశ్చికం(Scorpio), 9.ధనుస్సు(Sagitarius), 10.మకరం(Capricorn), 11.కుంభం(Acquarious), 12.మీనం(Pisces). ఈ సంస్కృత రాశుల పేర్లకు లాటిన్ ప్రతి నామాలు బ్రాకెట్లో ఇవ్వబడినవి. గ్రీకు, బాబిలోనియన్ ఇత్యాది భాషలలో కుడా రాశులకు వారు వారుపయోగించిన పేర్లు ఇంచుమించుగా ఇవే సంస్కృతార్ధములు కలిగియున్నవి.

4.యోగము: యోగమంటే కలయిక. దైనిక చంద్ర గతి, సాపేక్ష సూర్య గతి కలిపితే (13.20’) యోగమంటారు. ఈ యోగములు 27. అవి: 1.విష్కంభము, 2.ప్రీతి, 3.ఆయుష్మాన్, 4.సౌభాగ్య, 5.శోభన, 6.అతిగండ, 7.సుకర్మ , 8.ధృతి, 9.శూల, 10.గంధ, 11.వృద్ధి,12.ధృవ, 13.వ్యాఘాత, 14.హర్షణ, 15.వజ, 16.సిద్ధి, 17.వ్యతిపాత, 18వరియన్ (వరిష్ట), 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య, 23.శుభ, 24.శుక్ల, 25.బ్రహ్మ, 26.ఇంద్ర, 27.నైద్రుతి. ఈ యోగము ప్రభావము మానవ శరీరము ఆరోగ్యముపైనుం టంది.

5.కరణము: చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సుర్యునినుండి దూరమౌతూ వస్తాడు. పాడ్యమికి 12 దిగ్రీలయితే విదియకు 24 డిగ్రీలు ఆ ప్రకారంగా 180 డిగ్రీలకు పున్నమి, 360(౦) డిగ్రీలకు అమావాస్య అని తెలుసుకొన్నాము. అర్ధ తిధిని కరణము అంటారు (అంటే 12/2=6) అంటే ఏ అర్ధ తిధియైన 6 చేత నిశ్శేషముగా భాగింపబడుతుంది. ఈ కరణములు 11 అవి: 1.భవ, 2.బాలవ, 3.కౌలవ, 4.తైతుల, 5.ఖర జి, 6.వణిజి,7.విష్టి, 8.చతుష్పద, 93శకుని, 10.నగ, 11.కింస్తుఘ్నము. మొదటి 7 ఒక చంద్ర మాసములో 8 మార్లు వస్తాయి. అంటే 28 రోజులు. చివరి 4 కరణములు వరుసగాను స్థిరముగాను వస్తాయి. సూర్య చంద్ర భూ చలనములను ఇంత నిశితముగా పరిశీలించి గ్రహచారములనధ్యయనముచేసి భూమి పై వాని ప్రభావమును గూర్చి తెలిపినదీప్రపంచములో ఈ దేశము తప్ప వేరు దేశము లేదంటే అతిశయోక్తి కాదు.

పంచ అంగముల తరువాత మాసములను గూర్చి ముచ్చటిద్దాము. చంద్రుడు తన గమనమున పౌర్ణమి రోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నాడో ఆ నక్షత్రము పేరుతో ఆ మాసము ఏర్పడింది. అంటే పున్నమి రోజున చిత్ర నక్షత్రము వద్దకొస్తే చైత్ర మాసము, విశాఖ నక్షత్రము వద్దకొస్తే వైశాఖ మాసము ఆ ప్రకారంగా 12 మాసములు ఏర్పడినవి కాని నిరర్ధకమైన పేర్లను ఉపయోగించలేదు. ఈ 12 మాసముల పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి

1.చైత్రము, 2.వైశాఖము, 3.జ్యేష్టము, 4.ఆషాఢము, 5.శ్రావణము, 6.భాద్రపదము, 7.ఆశ్వయుజము, 8.కార్తీకము, 9.మార్గశిరము, 10.పుష్యము, 11.మాఘము, 12.పాల్గుణము

ప్రతి నేలలోను సూర్యుడు 12 రాశులలోని ఒక రాశి లో ప్రవేశిస్తే అది నిజ మాసమౌతుంది. లేకుంటే శూన్య/అధిక మాసమౌతుంది. అదే ఒక నెలలో రెండు సంక్రమణములొస్తే అది క్షయ మాసమౌతుంది. ఇది 141 సంవత్సరములకొకసారి వస్తుంది. ఒక సారి వచ్చిన తరువాత తిరిగీ 19 సంవత్సరములకే వచ్చే అవకాశమున్నది. ఈ విధంగా కాల గణన ఎక్కడికక్కడ సవరించుకొంటూ దోష రహితంగాను నిరాఘాటంగానూ సాగిపోతూంటుంది.

ఇక సంవత్సరముల విషయానికొస్తే సాపేక్ష సూర్య భ్రమణమును వర్తులాకారముగా తీసుకొన్నాము కావున ఆ భ్రమణము 360 డిగ్రీలు కలిగి వుంటుంది. సూర్యుడు రోజుకు ఒక అంశ (డిగ్రీ) ముందుకు జరుగుతాడని ఇదివరకే చెప్పుకొన్నాము. కావున ఒక సౌర సంవత్సరానికి 360 రోజులు. ఈ విధమైన సంవత్సరములు ప్రభవ విభవ మొదలు 60 పేర్లతో గడచిన తరువాత తిరిగి ప్రభవతో పునరావృత్తమౌతాయి. ఈ 60 పేర్లు ఈ క్రింది విధముగా వున్నాయి:

1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోదూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భవ, 9.యువ, 10.ధాతు, 11.ఈశ్వర,12.బహుధాన్య, 13.ప్రమాది, 14.విక్రమ, 15.విషు, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ, 19.పార్ధివ, 20.వ్యయ , 21.సర్వజిత్తు, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, ౩౦.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, ౩౩.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృతు, 37.శోభకృతు, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృతు, 46.పరీధావి, 47. ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నళ, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్ధి, 54.రౌద్ర, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.

ఈ సంవత్సర సమూహమును ‘60’గా ఎందుకు ఏర్పరచినారు అన్నది తెలుసుకొనుటకు ముందు మన వాళ్ళు గ్రహములకాయా పేర్లు ఎందుకు పెట్టినారో చూస్తాము. సాపేక్షముగా భూమిపై నిలబడి గ్రహ గతిని పరిశీలించితే, దూరమునుండి చేరువరకు గ్రహ భ్రమణమీవిధంగా వుంటుంది.

“మంద అమరేధ్య భూపుత్ర అర్క శుక్ర బుధ ఇందవః”

శని బృహస్పతి అంగారక సూర్య శుక్ర బుధ చంద్ర

మంద అన్నా శని అన్నా అత్యంత నెమ్మదిగా నడిచేది. అన్ని గ్రహములకన్నా ఈ గ్రహము ఒక భ్రమణమునకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. ఇది ఒక భ్రమణమునకు 30 సంవత్సరములు తీసుకొంటుంది. బృహత్ అంటే పెద్దది. బృహత్ + పతి =బృహస్పతి. అతి పెద్ద గ్రహములకు రాజు అంటే మన సౌర మండలములో అత్యంత పెద్ద గ్రహము. అంగారము అంటే అగ్ని. ఈ గ్రహము ఆరంగులో మనకు కనిపిస్తుంది కావున అది అంగారకమైనది.

ఇక సూర్యుని గూర్చి ఒక్క సారి మన దేవాలయాలలోని నవగ్రహ మంటపం గమనించితే సూర్యుని గ్రహమండలంలోని నట్ట నడుమన ప్రతిష్టించివుంటారు అంటే సూర్యుని కేంద్రముగా గొని మిగతా గ్రహములన్నియు భూమితోకుడా వర్తులాకారములో చుట్టుచున్నవనియే కదా! వరాహమిహురుడు, ఆర్యభట్టు, భట్టోత్పలుడు, భాస్కరుడు ఆదిగాగల భారతీయ ఖగోళ వైజ్ఞానికులు కోపర్నికస్ వంటి పాశ్చాత్య వైజ్ఞానికులకన్నా ఎన్నో శతాబ్దాల పూర్వమే తమ వేద విజ్ఞానముతో భూమి గుండ్రముగానున్నదని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నదని, గ్రహ భ్రమణమునకు సూర్యుడు కేంద్రమని, తమ గ్రంధములలో రచించియున్నారు. కాణాదుని వంటి మహర్షులు సూర్యకిరణములు వక్రగతిన ప్రయాణము చేయుననియు సూర్య కిరణములో 7 రంగులున్నవనియు కుడా చెప్పినారు. మన పూర్వులు సూర్యుని గూర్చి తెల్పుచూ అయన రథానికి ఒకటే చక్రమనియు (కాల చక్రము) అయన రథ సారధికి నడుము మాత్రమే వుంది తొడలు లేవని (ఆయన పేరు అణూరుడు) అంటే రథము లో కదలకుండా ఎప్పుడూ నదుపుతూనే వుంటాడనియు, రథమునకు పూన్చిన గుఱ్ఱములు 7 అనియు (7 రంగులు) పగ్గములు పాములనియు (సూర్య కిరణములు వంకరటింకరగా వుంటాయి నిగూఢముగా తెల్పినారు.

ఇక శుక్ర గ్రహము: శుక్రము అంటే తెలుపు, కాంతివంతము అని అర్ధం సాయం సమయమున ఆకాశం పరిశీలించితే ఈ వాస్తవం తెలుస్తుంది.

బుధగ్రహము: బుధుని సౌమ్యుడు అని అంటారు. అంటే చూడ ముచటైన చందన వర్ణములో ఉంటాడని అర్థం.

చంద్ర గ్రహము: చంద్రము అంటే బంగారము. చంద్రుడు ఆ వర్ణములో వుంటూ చల్లని కిరణాలను ప్రసరింప చేస్తాడు కావున ఆయనను చంద్రుడని శీత కిరణుడని అన్నారు.

ఈ విధంగా పేర్లుంచుట యందు కూడా ఎంతో యోచించి అర్ధవంతంగా పెట్టినారు కాని, స్వోత్కర్షతో తమ పేర్లను ఎక్కడా ఉపయోగించుకోలేదు.

ఇక 60 సంవత్సరములెందుకు అన్న అసలు విషయనికి వస్తాము; భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణకాలము 12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్నా శని గ్రహము ౩౦ సంవత్సరములు తీసుకొంటుంది. అంటే బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈగ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 = 60) రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం మొదలౌతుందన్నమాట.

ఇక కాలగణన విషయానికొస్తే, సూర్య సిద్ధాంతము ప్రకారము

తృటి – వాడి సూది మొన తామరాకును తాకేకాలం (1/33750 Sec.,) నుండి మొదలు పెట్టినా ప్రాణము అన్న కొలమానము నుండి ఎవరైననూ సాధారణ కాలగణన చేయవచ్చును.

జీవి ఇన్ని ప్రాణముల కాలము బ్రతకవలెనని నిర్ణయించ, బ్రహ్మ ఆ జీవిలో అన్ని ప్రాణములనూది భూమి పైకి పంపుతాడన్నది పెద్దలమాట. ఆరోగ్యవంతుడు శ్వాస తీసుకొని వదులుటకు పట్టు కాలము ప్రాణము. ఇంచుమించు 4 Sec., = 1 ప్రాణము

6 ప్రాణములు = 1 వినాడి ( విఘడియ)

60 వినాడు లు = 1 నాడి (ఘడియ)

60 నాడులు = 1 అహో రాత్రము (1 రోజు)

360 రోజులు (24 హోరలు) = 1 సౌర వర్షము

(దేవతలకు ) 1 దివ్య వర్షము = 360 సౌర వర్షములు

కృతయుగము = 4800 దివ్య వర్షములు = 17,28,౦౦౦ (4 పాదములు)

త్రేతాయుగము = 3600 దివ్య వర్షములు = 12,96,000 (౩ పాదములు)

ద్వాపరయుగము = 2400 దివ్య వర్షములు = 8,64,000 (2 పాదములు)

కలియుగము = 1200 దివ్య వర్షములు = 4,32,000 (1పాదము)

మహాయుగము = 12000 దివ్య వర్షములు = 42,20,000 (10 పాదములు)

ఒక మన్వంతరము = 71 మహాయుగములు

ఈ మనువులు 14గురు. ఇపుడు జరిగేది వైవస్వతమన్వంతరము

కల్పము = 14 మన్వంతరములు + 15 సంధులు = (71 x 14) + 6 (మహాయుగములు)=994+6=1000మహాయుగములు

15 సందులెట్లంటే ఒక మన్వంతరము ముగిసి వేరొక మన్వంతరము వచ్చుటకు మధ్య కాలము సంధి. అంటే పగటికి రాత్రికి, రాత్రికి పగటికి మధ్య సంధి వున్నట్లు. ఆవిధంగా 14 సంధులు గడిచిన తరువాత ఒక మహామన్వంతరమునకు(14 మన్వంతరముల కాలము మరొక మహామన్వంతరమునకు మధ్య కాలము 1 సంధి. వెరసి 15 మన్వంతరములు.

1 సంధి కాలము = 4800 దివ్యవర్షములు. 15 సంధులు = 4800 x 15=7200 ది.వ. = 6 మహాయుగములు

2 కల్పములు : బ్రహ్మకు ఓకే అహోరాత్రము = 1 రోజు

ఇట్టి 360 రోజులు ఒక బ్రహ్మవర్షము.

బ్రహ్మ ఆయుర్దాయము : 100 బ్రహ్మ వర్షములు

ఇది సూక్ష్మముగా మన కాల చరిత్ర. ఇంతటి సునిశిత శాస్త్ర జ్ఞానము కల్గిన ప్రపంచములోని ఏకైక దేశమైన ఈ భారతదేశంలో జన్మించినందుకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని గర్విద్దాం.
ఓం తత్సత్

https://www.facebook.com/cheruku.ramamohanrao