Thursday 29 May 2014

శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే

Bramhasri Samavedam Shanmukha Sarma


శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే
షధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః!!
ఆ శ్లోకం పూర్తి పాఠమిది. "కృశించిపోయే లక్షణం గల, వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగాజలం. వైద్యుడు నారాయణుడైన శ్రీహరి అని అర్థం.
శరీరం ధరించిన జీవుడు తనలోని జన్మాంతర పాప పంకిలాన్ని శుద్ధిచేసుకోవడం ముఖ్యకర్తవ్యం. అందుకు పవిత్ర గంగాజలపానం, శ్రీహరి స్మరణ ముఖ్యం. ఈ రెండే జీవన సార్థకతలు. జన్మకి సాఫల్యాలు అని చెప్పే బోధన ఇది.
అంతేకాక - గంగాస్మరణ, నారాయన స్మరణ శక్తిమంతమైనవి. ఈ శ్లోకం చదివినవారికి వైద్యునిలోనున్న ’ప్రతిభా’రూపమైన నారాయణ శక్తి అనుకూలిస్తుంది. సరియైన స్ఫురణతో శ్రీహరి వైద్యుని ప్రేరేపిస్తాడు. వైద్యునిలోని వైద్యశక్తి పరమేశ్వరుడైన శ్రీహరి రూపమే కదా! హరిస్మరణతో అది మనల్ని బాగు చేసేలా ప్రేరేపించబడుతుంది. అలాగే గంగాస్మరణతో ఔషధం పవిత్రమై, ప్రభావశాలి అవుతుంది.
పరానికీ, ఇహానికీ పనికివచ్చే ప్రయోజనాలను ఇచ్చే పరంపరాగత శ్లోకమిది.
 

పురాణములు


Bramhasri Samavedam Shanmukha Sarma



పురాణములు
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరాళ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.
వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును.
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.
వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.

Wednesday 28 May 2014

vande vandyam sadanandam vasudevam nirajanamh |

vande vandyam sadanandam vasudevam nirajanamh |
indirapatimadyadi varadesha varapradamh || 1||
namami nikhiladhisha kiritaghrishhtapithavath |
hrittamah shamanearkabham shripateh padapankajamh || 2||
jambunadambaradharam nitambam chintyamishituh |
svarnamaJnjirasamvitam arudham jagadambaya || 3||
udaram chintyam ishasya tanutveapi akhilambharam |
valitrayankitam nityam arudham shriyaikaya || 4||
smaraniyamuro vishhnoh indiravasamuttamaih |
anantam antavadiva bhujayorantarangatamh || 5||
shankhachakragadapadmadharashchintya harerbhujah |
pinavritta jagadraxa kevalodyoginoanishamh || 6||
santatam chintayetkantham bhasvatkaustubhabhasakamh |
vaikunthasyakhila veda udgiryanteanisham yatah || 7||
smareta yamininatha sahasramitakantimath |
bhavatapapanodidhyam shripateh mukhapankajamh || 8||
purnananyasukhodbhasim andasmitamadhishituh |
govindasya sada chintyam nityanandapadapradamh || 9||
smarami bhavasantapa hanidamritasagaramh |
purnanandasya ramasya sanuragavalokanamh || 10||
dhyayedajasramishasya padmajadipratixitamh |
bhrubhangam parameshhthhyadi padadayi vimuktidamh || 11||

santatam chintayeanantam antakale visheshhatah |
naivodapuh grinantoantam yadgunanam ajadayah || 12||

Nitya Sandhya Vandanam – Telugu

 http://www.vignanam.org/veda/nitya-sandhya-vandanam-telugu.html

Nitya Sandhya Vandanam – Telugu

రచన: విశ్వామిత్ర మహర్షి
శరీర శుద్ధిఅపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |
ఆచమనఃఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)
భూతోచ్చాటనఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)
ప్రాణాయామఃఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ || (తై. అర. 10-27)
సంకల్పఃమమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||
మార్జనఃఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతేనః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జిన్వ’థ | ఆపో’ నయ’థా చ నః | (తై. అర. 4-42)
(ఇతి శిరసి మార్జయేత్)
(హస్తేన జలం గృహీత్వా)
ప్రాతః కాల మంత్రాచమనఃసూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ స్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” || (తై. అర. 10. 24)
మధ్యాహ్న కాల మంత్రాచమనఃఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పుంతు బ్రహ్మ’స్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’‌உసతా ంచ’ ప్రతిగ్రగ్గ్ స్వాహా” || (తై. అర. పరిశిష్టః 10. 30)
సాయంకాల మంత్రాచమనఃఅగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)
(ఇతి మంత్రేణ జలం పిబేత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్వితీయ మార్జనఃధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కత్ప్ర ఆయూగ్‍మ్’షి తారిషత్ ||
(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతేనః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జిన్వ’థ | ఆపో’ నయ’థా చ నః || (తై. అర. 4. 42)
పునః మార్జనఃహిర’ణ్యవర్ణా శ్శుచ’యః పాకాః యా సు’జాతః శ్యపో యా స్వింద్రః’ | గ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’శ్యం జనా’నామ్ | ధు శ్చుశ్శుచ’యో యాః పా’కా స్తాశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ క్షం యా ంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ ను వోప’స్పృశ త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ గ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వోయిర్చో మోజో నిధ’త్త || (తై. సం. 5. 6. 1)
(మార్జనం కుర్యాత్)
అఘమర్షణ మంత్రః పాపవిమోచనం
(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుదా ది’వ ముంచతు | ద్రుదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః || (తై. బ్రా. 266)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య
లఘుసంకల్పఃపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ప్రాతః కాలార్ఘ్య మంత్రంఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||
మధ్యాహ్నార్ఘ్య మంత్రంఓం గ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోసత్ | నృష ద్వ’స దృ’స ద్వ్యో’బ్జా గోజా ఋ’జా అ’ద్రిజా తమ్-బృహత్ || (తై. అర. 10. 4)
సాయం కాలార్ఘ్య మంత్రంఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||
(ఇత్యంజలిత్రయం విసృజేత్)
కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం
ఆచమ్య…
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||
(ఇతి జలం విసృజేత్)
సజల ప్రదక్షిణంఓం ద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాన్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-ద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతివం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై. అర. 2. 2)
(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
సంధ్యాంగ తర్పణంప్రాతఃకాల తర్పణంసంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
మధ్యాహ్న తర్పణంసంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
సాయంకాల తర్పణంసంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
(పునరాచమనం కుర్యాత్)
గాయత్రీ అవాహనఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోమ్ || (తై. అర. 10. 33)
ఆయా’తు వర’దా దేవీ క్షరం’ బ్రహ్మసంమితమ్ | గాత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ ర్ణే మ’హాదేవి ంధ్యావి’ద్యే రస్వ’తి ||
ఓజో’‌உసి సహో’‌உసి బల’మసి భ్రాజో’‌உసి దేవానాం ధానామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి ర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ || (మహానారాయణ ఉపనిషత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
జపసంకల్పఃపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||
కరన్యాసఃఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |
అంగన్యాసఃఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భుస్సురోమితి దిగ్భంధః |
ధ్యానమ్ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||
చతుర్వింశతి ముద్రా ప్రదర్శనంసుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖో‌உథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||
యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||
గాయత్రీ మంత్రంఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
అష్టముద్రా ప్రదర్శనంసురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మో‌உథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |
ప్రాతఃకాల సూర్యోపస్థానంఓం మిత్రస్య’ ర్షణీ ధృ శ్రవో’ దేవస్య’ సా సిమ్ | త్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌உభి చ’ష్టే త్యాయ’ వ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనై మగ్ంహో’ అశ్నో త్యంతి’తోదూరాత్ || (తై. సం. 3.4.11)
మధ్యాహ్న సూర్యోపస్థానంఓం ఆ త్యే రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనా‌உదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||
ద్వయ ంతమ’ స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’త్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||
దుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ త్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ రద’శ్శతం జీవే’మ రద’శ్శతం నందా’మ రద’శ్శతం మోదా’మ రద’శ్శతం భవా’మ రద’శ్శతగ్‍మ్ శృణవా’మ రద’శ్శతం పబ్ర’వామ రద’శ్శతమజీ’తాస్యామ రద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిస్యధ్యాథ్సమా’ వృభో లో’హితాక్షసూర్యో’ విశ్చిన్మన’సా పునాతు ||
సాయంకాల సూర్యోపస్థానంఓం మమ్మే’ వరుణ శృధీ హవ’ ద్యా చ’ మృడయ | త్వా మ’స్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వంద’మా స్త దాశా”స్తే యజ’మానో విర్భిః’ | అహే’డమానో వరుణేబోధ్యురు’గ్ం సమా’యుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. 1.1.1)
దిగ్దేవతా నమస్కారః(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ముని నమస్కారఃనమో గంగా యమునయోర్-మధ్యే యే’ వంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||
సంధ్యాదేవతా నమస్కారఃసంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌உకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || (తై. అర. 2.18.52)
ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని రాణి’ స్థారాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’‌உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌உంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)త్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌உభ్య’ను ఙ్ఞాతా చ్చదే’వి థాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)
భగవన్నమస్కారఃనమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||
భూమ్యాకాశాభి వందనందం ద్యా’వా పృథివీ త్యమ’స్తు | పిర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||
శ్రీ వాసుదేవ నమో‌உస్తుతే ఓం నమ ఇతి |
అభివాదః (ప్రవర)చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||

ఈశ్వరార్పణంకాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యా‌உ‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |

http://www.vignanam.org/veda/nitya-sandhya-vandanam-telugu.html

http://www.vignanam.org/veda/nitya-sandhya-vandanam-telugu.html
ఓం జయ జగదీశ హరే
స్వామీ జయ జగదీశ హరే
భక్త జనోం కే సంకట,
దాస జనోం కే సంకట,
క్షణ మేం దూర కరే,
ఓం జయ జగదీశ హరే || 1 ||
జో ధ్యావే ఫల పావే,
దుఖ బినసే మన కా
స్వామీ దుఖ బినసే మన కా
సుఖ సమ్మతి ఘర ఆవే,
సుఖ సమ్మతి ఘర ఆవే,
కష్ట మిటే తన కా
ఓం జయ జగదీశ హరే || 2 ||
మాత పితా తుమ మేరే,
శరణ గహూం మైం కిసకీ
స్వామీ శరణ గహూం మైం కిసకీ .
తుమ బిన ఔర న దూజా,
తుమ బిన ఔర న దూజా,
ఆస కరూం మైం జిసకీ
ఓం జయ జగదీశ హరే || 3 ||
తుమ పూరణ పరమాత్మా,
తుమ అంతరయామీ
స్వామీ తుమ అంతరయామీ
పరాబ్రహ్మ పరమేశ్వర,
పరాబ్రహ్మ పరమేశ్వర,
తుమ సబ కే స్వామీ
ఓం జయ జగదీశ హరే || 4 ||
తుమ కరుణా కే సాగర,
తుమ పాలనకర్తా
స్వామీ తుమ పాలనకర్తా,
మైం మూరఖ ఖల కామీ
మైం సేవక తుమ స్వామీ,
కృపా కరో భర్తార
ఓం జయ జగదీశ హరే || 5 ||
తుమ హో ఏక అగోచర,
సబకే ప్రాణపతి,
స్వామీ సబకే ప్రాణపతి,
కిస విధ మిలూం దయామయ,
కిస విధ మిలూం దయామయ,
తుమకో మైం కుమతి
ఓం జయ జగదీశ హరే || 6 ||
దీనబంధు దుఖహర్తా,
ఠాకుర తుమ మేరే,
స్వామీ తుమ రమేరే
అపనే హాథ ఉఠావో,
అపనీ శరణ లగావో
ద్వార పడా తేరే
ఓం జయ జగదీశ హరే || 7 ||

విషయ వికార మిటావో,
పాప హరో దేవా,
స్వామీ పాప హరో దేవా,
శ్రద్ధా భక్తి బఢావో,
శ్రద్ధా భక్తి బఢావో,
సంతన కీ సేవా
ఓం జయ జగదీశ హరే || 8 ||

సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక.


Prasad Singaraju shared Hindu Jwala's album: సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక.
13 hrs · 
192 కిలోమీటర్ల పొడవు...
192 కిలోమీటర్ల వెడల్పు..
36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు..
వీధుల వెంట బారులు తీరిన చెట్లు..
రాయల్‌ ప్యాలెస్‌లు..
రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..
కమర్షియల్‌ మాల్స్‌..
కమ్యూనిటీ హాల్స్‌..
క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే
అపూర్వ మహానగరం..
రత్నస్తంభాలు..
వజ్ర తోరణాలు..
సాటిలేని ఆర్కిటెక్చర్‌..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..
జగన్నాథుడి జగదేక సృష్టి..
క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి
లెజెండ్‌ సిటీ...
ద్వారక..
ఇప్పుడు సాగర గర్భంలో..
మన నాగరికత..
మన సంస్కృతి..
మన ప్రతిభకు పట్టం కట్టిన
నాటి కాస్మోపాలిటన్‌ సిటీ..
ద్వారక
----------------------------
అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం.. వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్‌ నిజం.. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్‌ నిజం.. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా..
1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..
ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది..
మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్‌ ఏస్‌.ఆర్‌. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..
శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి... మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు.. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు..
శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది..
-------------------
ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్‌ నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్‌ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.
ఈ నిర్మాణం కూడా అలాంటిలాంటి సెユ్టల్‌ కాదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి..
పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..
నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్‌ యుటిలిటీస్‌, భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి..
బ్యూటీకే.. బ్యూటీ... అందమైన గార్డెన్‌లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు.
----------------------------
రామాయణ కాలంలో రావణుడి ఎయిర్‌పోర్ట్‌లను కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది.. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది..
న్యూయార్క్‌ సిటీ, వాషింగ్టన్‌ డిసి, లండన్‌, మాస్కో, బీజింగ్‌, టోక్యో, ముంబయి.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే మహానగరాలు.. మెట్రో పాలిటన్‌ సిటీలు.. కాస్మో పాలిటన్‌ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు..
ఈ మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల రెట్లు అడ్వాన్స్‌డ్‌ అభివృద్ధితో అపురూప నగర నిర్మాణం ఆనాడే జరిగింది. అదే ద్వారక.. ఇక్కడ కేవలం కమర్షియల్‌ జోన్లు ఏర్పాటు చేయటమే కాదు. సాగర తీరంలో గొప్ప హార్బర్‌ను కూడా యాదవ రాజులు సక్సెస్‌గా నిర్వహించారు. గ్రీకు, ఇతర దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.
ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ఎస్‌ఆర్‌ రావు పరిశోధనల్లో ద్వారక ఆరు ప్రధాన రంగాల్లో ద్వారక అభివృద్ధిని సాధించిందని ధృవీకరించారు. ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి గా పిలిచేవారని కూడా తేల్చారు..
క్రీస్తుపూర్వం 3138లో మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు.. ఆ తరువాత యాదవ రాజుల మధ్య పరస్పరం గొడవలతో ఒకరికొకరు చంపుకున్నారు.. ఆ తరువాత కొంతకాలానికే శ్రీకృష్ణుడు దేహ పరిత్యాగం చేసి భూమిని విడిచివెళ్లిపోయాడు..ఈ భూమిపై కృష్ణుడు నివసించింది 120 సంవత్సరాలు. కృష్ణ నిర్యాణానంతరం ద్వారకను సముద్రం ముంచివేసింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను ప్రత్యక్షంగా చూసినట్లు అర్జునుడు మహాభారతంలో చెప్తాడు..
సాగర గర్భంలో మునిగిపోయింది మునిగిపోగా.. తీరం వెంట కూడా ద్వారకకు సంబంధించిన, కృష్ణుడి రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం కనిపించే ద్వారకాధీశ్‌ ఆలయం కూడా కృష్ణుడి మనవడు వజ్రనాభుడే నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది...అసాధారణ భారతీయ ప్రతిభకు, నాగరికతకు, సంస్కృతికి ఎవరెస్ట్‌ శిఖరమంత కీర్తి -కృష్ణ ద్వారక.

Bramhasri Samavedam Shanmukha Sarma
2 hrs · 
శ్రీగణపతిని గురించి - రెండు పురాణాలు లక్ష్యభూతమై ఉన్నాయి. ౧. గణేశపురాణం ౨. మౌద్గల్య పురాణం
ముద్గల పురాణం: దక్షప్రజాపతి ముద్గల మహర్షుల సంభాషణాత్మకము. తొమ్మిది ఖండములు. 427 అధ్యాయములు. వీరభద్రునిచే పరాభూతుడైన దక్షునకు ముద్గలమహర్షి గణపతితత్త్వమునుద్బోధించి తత్సేవనమున విఘ్నశాంతిని ఫలముగా బొందినట్లీ పురాణమునందు చెప్పబడినది. వక్రతుండ గణపతి మత్సరాసురుని, ఏకదంత గణపతి మదాసురుని, మహోదర గణపతి మోహాసురుని, గజానన గణపతి లోభాసురుని, లంబోదర గణపతి క్రోధాసురుని, వికట గణపతి కామాసురుని, విఘ్నరాజ గణపతి మమతాసురుని, ధూమవర్ణ గణపతి అభిమానాసురుని, సంహరించి ఆత్మతత్త్వప్రకాశమును సంరక్షించినారు. అష్టవినాయక చరిత్రయు యోగష్టాంగములుగా వీరి ప్రసిద్ధియు తొమ్మిదవ ఖండమున వర్ణింపబడినది.
"న ముద్గల సమో భక్తో గణేశస్య ప్రదృశ్యతే!!" అని ప్రసిద్ధినందిన ముద్గలమహర్షి మౌద్గల్య గోత్ర ప్రవర్తకుడు. గాణాపత్య తత్వరహస్యముల నెరిగిన ప్రోఢ. సిద్ధపురుషుల ఆవిర్భావమునకు కాణాచి అయిన వంశములకు మూలపురుషుడు. ఏకాక్షర గణేశవిద్యను సాధిమ్చి బ్రహ్మతత్త్వమును సమాధి కౌశలమున గీటురాయి చేసుకొనిన వాడీ మహర్షి. తత్ప్రోక్తమైన పురాణమునూ పురాణములలో రాణకెక్కినది.

నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లైతే


Bramhasri Samavedam Shanmukha Sarma
Yesterday at 12:42pm · 


నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లైతే
ఆద్యః ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతి భుజః చతుర్థః పంచవక్త్రకః
పంచమో అష్టాదశ భుజః శరణ్యః సర్వదేహినాం
సువర్చలా పతిఃషష్ఠః సప్తమస్తు చతుర్భుజః
అష్టమః కథితశ్శ్రీమాన్ ద్వాత్రింశత్ భుజమండలః
నవమో వానరాకారః ఇత్యేవ నవరూప ధృత్
నవావతార హనూమాన్ పాతుమాం సర్వదస్సదా!!
ఈ తొమ్మిది రూపములు యేమిటంటే వివిధ ఉపాసకులకి దర్శనమిచ్చిన రూపములు. అలా దర్శనమిచ్చిన తొమ్మిది నామములు ఒక దగ్గర పెట్టుకొని ఎవరైతే మననం చేసుకుంటారో "నవావతార హనుమాన్ పాతుమాం సర్వదస్సదా! ఇక్కడ విశేషం యేమిటంటే నవావతార స్మరణ యెల్లవేళలా రక్షిస్తుంది. అవతారం అంటే భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటే దానిని అవతారం అంటారు. వివిధ ఉపాసకులు ధ్యానం చేసినప్పుడు ఉపాసనా ఫలంగా ప్రకటింపబడిన రూపమే ఈ నవావతార హనుమద్రూపము అని చెప్తున్నారు.

Thursday 15 May 2014

: సర్వగ్రహాలు నీ అనుగ్రహరూపాలే


Bramhasri Samavedam Shanmukha Sarma



పరగెన్ నేత్రములర్క చంద్రులుగ, రెప్పల్ రాహు కేత్వాకృతుల్
వరఫాలమ్మున మంగళుండు, మది సద్భావంబు సౌమ్యుండు, శ్రీ
గురుడే చిన్మయముద్ర, విశ్వరచనా కోశమ్మె కావ్యుండునౌ
స్థిరమై కంఠము దేజరిల్లు గ్రహమూర్తీ! నీలకంఠేశ్వరా!
తాత్పర్యం: సర్వగ్రహాలు నీ అనుగ్రహరూపాలే. నీ నేత్రాలు సూర్యచంద్రులు. రెప్పలు రాహు కేతువులు. నీ నుదుట అంగారకుడు (తపోనిష్ఠలోనున్న రుద్రుని నుదుటి స్వేదబిందువు, భూమిపై పడి మంగళగ్రహమయిందని శివపురాణ కథ). `చంద్రమా మనసో జాత:' మనస్సుకి అధిపతి చంద్రుడు. మనోజనిత భావం సౌమ్యం. స్వామి భావం సౌమ్యమైన వాత్సల్యం. అది ఙ్ఞానమయభావన. కనుక బుధుడు. (సోమపుత్రుడు=బుధుడు (సౌమ్యుడు) నీ చిన్ముద్రే బృహస్పతి (గురువు). విశ్వాన్ని రచించే నైపుణ్యమే కావ్యుడు (కవి, కావ్య-శుక్రుని పేర్లు). కంఠంలోని స్థిరమైన నీలిమ స్థిరుని స్ఫురింపజేస్తోంది. (స్థిర: = శని)

సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్


సత్యసాయి వైదిక స్మార్త నిగమము
సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్: 

మ౦త్రము అ౦దరూ చేయలేరు. బీజాక్షరాలు అ౦దరూ చేయలేరు అని మ౦త్రములలో ఉ౦డే సమస్త సారాన్ని స్తోత్రముల క్రి౦ద ఇచ్చారు మన పెద్దలు. సాధారణ౦గా ఋషులు, జగద్గురువులు చేసిన స్తోత్రములు శక్తి వ౦తములు అయి ఉ౦టాయి. ఈ స్తోత్ర౦ దేవతలు అ౦దరూ వైకు౦ఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి వారికి కనపడిన రూపాలలో చేసిన స్తోత్ర౦. ఇది చాలా అద్భుతమైన స్తోత్ర౦.ఇది చదవడ౦ వలన అపారమైన ఐశ్వర్య౦ కలుగుతు౦ది. భగవ౦తుని పట్ల అపారమైన భక్తి కలుగుతు౦ది. పెళ్ళికాని మగపిల్లలు చదువుకు౦టే మ౦చి భార్య వస్తు౦ది.
 బిడ్డలు లేని లేని వారు చదివితే బిడ్డలు పుడతారు. దీనిని స౦క్షిప్త కనకధారగా చెప్పవచ్చు

 క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
 శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే|| 
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే| 
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్| 
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ| 
రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః|| 
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా| 
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
 వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ| 
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకగా|| 
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్| 
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే|| 
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే| 
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ| 
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే|
 కుందదంతా కుందవనే సుశీలా కేతకీ వనే||
 కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ| 
రాజ్యలక్ష్మీ రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే|| 
ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా| 
రురుద్దుర్నమ్రవదనా శుష్క కంఠో తాలుకాః|| 

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్

యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్|| 
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
 సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
 పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్| 
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్|| 
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్| 
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
 హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్||
 కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
 సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్| 
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||


Tuesday 6 May 2014

వివాహ సంప్రదాయములు


Nerella Raja Sekhar

వివాహ సంప్రదాయములు......
సుముహూర్తం (జీలకర్ర, బెల్లం) : పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన పిదప వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టడం జరుగును. ఈ కార్యక్రమమునందు ఈ క్రింది మంత్రము చదువుతారు.
“ “అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే!ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!! “ ”
కన్యాదానం : దానము అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.
“ “కన్యాం కనక సంఫన్నాం'కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం'బ్రహ్మలోక జగీషియా!! “ ”
పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా."అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా" భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది."వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.
దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను.మొత్తము మీద వధువు (భార్య) పురుషార్ధాలైన ధర్మ,అర్ధ,కామ,మొక్షము లకు మూలమని కన్యాదానం చెబుతుంది.
మంగళసూత్రధారణ : వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
“ “మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!! “ ”
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు. వివాహిత స్త్రీ మెడలో మంగళ సూత్రం లేదంటే ఆమెను విధవరాలుగా భావించవచ్చును.
తలంబ్రాలు : మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. 'క్షత' అంటే విరుగునది- 'అక్షత' అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.
“ ప్రజాపతి స్త్రియాం యశః'ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం'తస్యాగ్నేభాజయేహమా!! ”

Thursday 1 May 2014

** Attributes of Shrī Parashūrām **

‘Agratah chaturovedah prushthatah sasharam dhanuh I

Idam braahmam idam kshatram shaapadapi sharaasdapi II’

- Knows four veds by heart, means has full knowledge of them. Has arrows and bow on the back, means has valour; which also means has both, radiance of Brahma and of Kshatriya. Shrī Parashūrām will defeat anyone that opposes him, either by a curse or by shooting an arrow.

• Passing on Divine radiance (tēj) to Shrī Ram : When Shrī Parashūrām came to know about Shrī Ram's glory, he decided to test Shrī Ram's bravery. He confronted Shrī Ram on His way, gave his bow to Him and asked Him to bend it. He also asked him for a target to shoot the arrow at. Shrī Ram obeyed him. Also as told by Shrī Parashūrām, Shrī Ram controlled Shrī Parashūrām's movement on this (Kashyapi) land. Shrī Parashūrām was pleased with this and presented his bow to Shrī Ram. In this way, Shrī Parashūrām passed on his Kshātra (fighting spirit) radiance to Shrī Ram.

• The best instructor / teacher of archery : After laying down his arms, Shrī Parashūrām gave up his animosity towards Kshatriyas and started teaching art of weaponry to both Brahmins and Kshatriyas all alike. The great warriors of Mahābhārat, Bhishmacharya, Dronacharya, Karna, etc. were disciples of Shrī Parashūrām.

• Munificent / extremely generous : Shrī Parashūrām undertook many campaigns for killing Kshatriyas, due to which he became the king of the entire Earth. He was then entitled to perform the Ashvamedh sacrificial fire (yadnya), which he performed. At the end of the yadnya, he donated the entire land to Kashyap, the presiding priest of the yadnya.

• Creating new land : Kashyap realised that as long as Shrī Parashūrām is living on this land, the Kshatriyas will not prosper here. So he told Shrī Parashūrām 'Now I have authority over this land. You have no right to even stay here.' Shrī Parashūrām then pushed and shifted the sea backwards and created his own place / terrain. The land between Vaitarana and Kanyakumari (coastal places in South India) is known as 'the land of Shrī Parashūrām' (Shrī Parashūrām-kshetra).

• Immortality : Shrī Parashūrām is one of the seven persons who are considered as immortal (sapta-chiranjeev).

Read more about Shrī Parashūrām at http://www.forumforhinduawakening.org/understanding/glory-hindu-dharma/parshuram-jayanti

#Hinduism #Spirituality #Sanatan #Dharma #Vedas #Kshatriya #ShriParashuram