Friday 30 September 2011



* వాల్మీకి రామాయణంలో అహల్య తన పతి గౌతముడు వచ్చాడని భ్రమించి ఆ తరువాత చలించిందని చెప్పారు. ఆమె వయు చక్షకులాలని, శిలాకృతి దాల్చిందని చెప్తారు. దీనిలో రహస్యం ఏమిటి?

అహల్య విషయంలో వాల్మీకి రామాయణం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. అయితే అహల్య చరిత్ర వేదంలో కూడా వుంది. ఇతర పురాణాలలో అనేకచోట్ల ఆ ప్రసక్తి వచ్చింది. అహల్య చరిత్రయొక్క తత్వం సమగ్రంగా తెలియాలి అంటే కొన్ని సాంకేతిక అర్ధాల్లోకి కూడా వెళ్లాలి. మానవ జీవితాలు కేవలం వీళ్ల ఇచ్ఛల చేత కాకుండా గ్రహగతుల యొక్క ప్రభావంచేత కూడా నడుస్తుంటాయి. అయితే ఈ గ్రహగతులు ఎలా నడుస్తాయి అంటే గ్రహాలకంటే పైనున్న దివ్యలోక వాసులైన దేవతల ప్రవర్తన ద్వారా!గ్రహాలు ప్రభావితాలు కావడం అంటే గ్రహములయందు అధిష్టించినటువంటి దేవతలు ప్రభావితులై వాళ్ల ద్వారా వాళ్ల అంశలతోజన్మించిన వాళ్ల యొక్క ప్రభావంలో వున్న జీవుల మీద కూడా ప్రభావం చూపుతాయి. అలాంటి ప్రభావం మామూలుగా మనందరి మీదా పడుతూ వుంటుంది. కానీ మనం అందరమూ సామాన్య జీవులం కనుక చెప్పుకోదగ్గ కథ వుండదు. ఒకానొక సృష్టి క్రమంలో యుగ సంధి కాలంలో ఒక మహత్తరమైనటువంటి సృష్టి కార్యం చేయడంకోసం ఏ జీవులు అవతరిస్తారో, వాళ్ల జీవిత చరిత్రలు సామాన్యరీతికి భిన్నంగా ఉంటాయి. అహల్య అనేటువంటి జీవి స్ర్తి జీవిగా, బ్రహ్మ మానస పుత్రిగా జన్మించింది. ఆమెను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేసారు. మామూలుగా అందరి లాగా నడుచుకోవడం కోసం ఆ జీవి సృష్టించబడలేదు.
ఆ జీవివల్ల ప్రపంచానికి ఒక సందేశం అందాల్సి వుంది. అది ఉపాసనారీతి గురించిన సందేశం. ఆ ఉపాసనా రీతిలో మొదట ఆవిడ ఇంద్రుడ్ని ఉపాసన చేసింది. కానీ తండ్రి ఆమెను గౌతముడికి ఇచ్చి వివాహం చేసాడు. అప్పటినుంచీ ఆమె భర్తని ఉపాసన చేయాల్సి వచ్చింది. మొదట చేసిన ఉపాసన ఒకటి, తరువాత చేసిన ఉపాసన ఒకటి ఆవిడ భేద భావనలో మొదట్లో చేసిన ఉపాసనను వదిలేసింది. అది ఏమవుతుంది. దాని ఫలితం ఇస్తుంది. అటువంటప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి? అనే సాధక సందేహాన్ని నివారించదలుచుకున్నారు. ఉపాసనలో ఎక్కడా పొరపాటు పడకూడదు అనే విషయం స్పష్టంగా చెప్పడం కోసం వాల్మీకి ఆ విషయంలో అహల్యను నిందిస్తునే శ్లోకాలు రాసేసాడు. దానితో వాల్మీకి చెప్పదలచుకున్న విషయం పూర్తి అయింది.

* విశ్వనాధవారి కల్పవృక్షంలో అహల్యకు ఇంద్రుడిపైన వ్యామోహం అణువంతైనా లేదన్నారేమిటి?అహల్య కథ వేదాదుల్లో కూడా ఉంది. అందులో కొన్ని సాంకేతికార్ధ రహస్యాలున్నాయని చెప్పుకున్నాం గదా. విశ్వనాధ సత్యనారాయణగారు వేదాలవరకు, పురాణాలవరకు వెళ్లిపోయి అహల్యా పదానికి ‘దున్నడానికి వీలుపడని క్షేత్రం’ అని అర్ధం. ఇంద్రుడు అంటే వర్షం అని సంకేతం. ఈ అర్ధాలను మనసులో పెట్టుకుని, అహల్యకి మోహం లేకపోయినా ఆమె సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించింది అని చెప్పాడు. అయితే శిలారూపం దగ్గరికి వచ్చేటప్పటికి శిలా పదాన్ని కేలం రాయి అనే అర్ధంలో తీసుకున్నట్టయితే అర్ధం కుదరదు.
రామాయణంలో ఆ రాయికి ఆకలి దప్పులు వుంటాయి. ‘కేవలం వాయుభక్షణం చేస్తావు కాని కదలడానికి వీల్లేదు. అయినా ఆలోచనలు ఉంటాయి. అటువంటి నికృష్ట జీవితం నీకు కొన్ని వేల సంవత్సరాలు’’ అని గౌతముడు శిక్ష వేస్తాడు. అంటే ఏ సాధకుడు అయినా ఉపాసనలో పొరపాటుచేస్తే వాడికి ఇది శిక్ష. కాని నిజమైన ఉత్తమ తపస్వికి ఇది శిక్ష కాదు. ఇది సమాధికి అత్యంత అనుకూలం. వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. ఆకలి దప్పులను పరిత్యాగం చేస్తే మనుస్సును పరమాత్మతో అనసంధానం చేయవచ్చు అని అహల్య భావించింది కనుక విశ్వనాధ సత్యనారాయణ ఇలా చెప్పారు. కేవలం సాధన మార్గాన్ని మాత్రమే వాల్మీకి చెప్పారు. ఇవి రెండూ రెండు దృక్కోణాలు!

*మన మతంలో ధర్మశాస్త్రానికి మరీ అంత ప్రాముఖ్యం ఎందుకు?మనది మతం కాదు. మనది ధర్మం. వేద ధర్మం మతం అనేది ఆ తర్వాత చాలా లక్షల సంవత్సరాల తరువాత పుట్టింది. ప్రకృతిలో సహజ సిద్ధమైన ఏ లక్షణం వుంటుందో అది ప్రకృతి ధర్మం. వైదేసికంగా వికాసం చెందిన మానవుడు క్రమంగా ప్రకృతికి దూరంగా జరుగుతాడు. దానివల్ల కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలాంటి విపత్తుల నివారణ కోసం మహాత్ములు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు.ఈ నిబంధనలు గ్రంథంగా ఏర్పడ్డాయి. అవే ధర్మశాస్త్రాలు. అందుకే అవి ముఖ్యమైనవి.

* మన వివాహ సంప్రదాయం ప్రకారం స్ర్తిలు నల్లపూసలు ధరిస్తారు. ఇప్పుడు ఆర్భాటాలకు పోతున్నారు కదా! ఇవి ఎందుకు ధరించాలి?
స్ర్తి జీవి సంతానోత్పత్తికి అనుకూలంగా చేయబడిన శరీరం కలది. సంతానాన్ని పురుషుడు కూడా కొద్ది కాలం తన గర్భంలో మోస్తాడు. కాని స్ర్తి ఒక సంవత్సర కాలం తన గర్భంలో మోసి, వేరొక ప్రాణికి జన్మ నిస్తుంది. అందువల్ల స్ర్తి నాడులకు అనుకూలమైన పదార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు. వాటిల్లో ఒకటి నల్లపూసలు. దీన్నిబట్టి ఆర్భాటాలకుపోయి ఏవేవో పూసలు ధరిస్తే రావాల్సిన ప్రయోజనం రాదు.

Saturday 24 September 2011

ఏలినాటి శని

ఏలినాటి శని

జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా ఏలినాటి శని గురించి భయపడతారు. కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పారు జ్యోతిష్య నిపుణులు/
. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది. ప్రతిసారీ 7 -1/2 సంవత్సరాలు వుంటుంది. సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.

శనికి శనివారంనాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు వున్నచోటో, లేక ఎక్కడన్నా శనీశ్వరుడుకి దానితో దీపారాధన చేసి, శనివారంనాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. జన్మ నక్షత్రం రోజున శివునికి అభషేకం చేయించినా మంచిది


ఏలినాటి శని-నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..?

.

ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే..? శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని , ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయని పెద్దలు చెబుతున్నారు.

అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గానీ, శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

 ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..? ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :- ౧ మయూరి నీఎలం ధరించుట 2 శని జపం ప్రతి రోజు జపించుట 3 శని కి తిలభిషేకం చేఇంచుట 4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట 5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట 6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన 7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన 8 హనుమంతుని పూజ వలన 9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన 10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన 11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన 12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన 13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన 14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన 15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన 16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన 17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం 18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన 19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును

Friday 23 September 2011

http://www.andhrabhoomi.net/weakpoint/weak-point-538

Friday September 23, 2011 21:06 pm
Decrease text sizeIncrease text sizeమతాన్నిబట్టి న్యాయం

--సాక్షి


మాటవరసకు మీ వీధిలో ఓ కిరాణా దుకాణముంది. అక్కడ సరుకులు కల్తీ; తూకంలో మోసం! ఆ సంగతి మీరు కనిపెట్టారు. పదిమందికీ చెప్పారు. అందరూ అక్కడ కొనడం మానేశారు. మీ దెబ్బకు ఆ దుకాణం మూతపడింది.
మంచిపని చేశానని మీరు అనుకున్నారు. మంచిపనే. కాని - సరికొత్త మతహింస బిల్లు చట్టమయ్యాక మీరు ఇదే పని చేస్తే... ఆ షాపు నడిపేవాడు ఏ అబ్రహామో, అబ్దుల్లానో అయితే... మీకు మూడినట్టే! అతగాడు పితూరీ చేసిన మరుక్షణం పోలీసు ఇనె్స్పక్టరు రెక్కలు కట్టుకుని మీ ఇంటికొచ్చి-
‘‘మైనారిటీ వర్గానికి చెందినవాడి వ్యాపారాన్ని బహిష్కరించి, అతడి జీవనోపాధిని దెబ్బతీయుట ద్వారా మైనారిటీ వర్గానికి ప్రతికూల వాతావరణాన్ని కల్పించుట’’ అనే నేరం కింద మిమ్మల్ని ఉన్నపళాన అరెస్టుచేసి జైల్లోకి తోస్తాడు.
దాని వెనక ఎవరున్నదీ మీకు తెలుసు కాబట్టి మీరో, మీ వాళ్లో పరుగున పోయి వ్యాపారి కాళ్లు పట్టుకుని కేసు మాఫీ చేయించుకోగలరేమో! కాని కొన్ని సందర్భాల్లో అదీ కుదరదు.
యథేచ్ఛగా జరిగే మతాంతరీకరణలు అనర్థమనో, ఇస్లామిక్ టెర్రరిజానికి పాలుపోసే వారిని పట్టుకోవాలనో, ఏదో మైనారిటీ విద్యాసంస్థ అక్రమాల గురించో మీరు ఎప్పుడో, ఎవరి ముందో ఘాటుగా మాట్లాడి ఉండవచ్చు. మైనారిటీ మతస్థులతో ఏ లావాదేవీలోనో, వృత్తి, వ్యాపార పరంగానో గొడవపడి ఉండవచ్చు. లేదా ఏ వందేమాతరం క్లబ్బుకో, మైనారిటీలకు సరిపడని హిందూమత సంస్థకో విరాళం ఇచ్చి ఉండవచ్చు. కర్మంచాలకపోతే వీటిలో దేని గురించి ఫిర్యాదు అందినా పోలీసువాడు సంకెళ్లుపట్టుకుని మీ ఇంటికి రాగలడు. మైనారిటీ వర్గంపై ద్వేష ప్రచారం చేశావనో, మైనారిటీ వర్గానికి చెందిన కారణంతో ఒక వ్యక్తిపై దౌర్జన్యం చేశావనో, చేస్తానని బెదిరించావనో, మైనారిటీ వర్గానికి ప్రతికూల వాతావరణం కల్పించేందుకు సహకరించావనో ఫిర్యాదు అందింది కనుక మతహింస చట్టం కింద అర్జంటుగా నిన్ను అరెస్టు చేస్తున్నాననగలడు.
‘‘ఎవడో ఫిర్యాదు చేసినంత మాత్రాన నేను నేరం చేసినట్టేనా? చేశానో లేదో మీరు విచారించి నిర్ధారించుకోవద్దా?’’ అంటారు మీరు.
‘‘అదేమో నాకు తెల్వద్. నేరం రుజువయ్యేదాకా ప్రతోడూ నిర్దోషేనని నీలాంటోళ్లు చెప్పే కబుర్లు ఇక్కడ నడవవ్. మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా నేరం జరిగిందా లేదా అన్న ప్రశ్న వస్తే - జరిగిందనే భావించాలని కొత్త చట్టం 73వ సెక్షను చెబుతుంది. నేరం చెయ్యలేదని రుజువయ్యేదాకా నిందితుడు నేరంచేసి ఉంటాడనే అనుకోమని 74వ సెక్షను అంటుంది. నీ మీద ఫిర్యాదు వచ్చింది కాబట్టి నువ్వు నేరం చేసినట్టే! నిన్ను బొక్కలో తొయ్యాల్సిందే’’ అంటాడు పోలీసు.
అది విని మీ బుర్ర గిర్రున తిరుగుతుంది. ‘‘మా లాయరుతో మాట్లాడుతా. ఏం చేయాలో ఆలోచించి మీ దగ్గరికి వస్తా’’ అంటారు. ‘‘ఆ పప్పులక్కడ ఉడకవ్ తమీ. ఈ చట్టం కిందికి వచ్చే ఏ నేరమైనా కాగ్నిజబుల్ అఫెన్స్. నిన్ను వెంటనే అరెస్టు చెయ్యాల్సిందే. లాయరొచ్చి బెయిలు తెస్తాడనుకుంటున్నావేమో ఈ కేసుల్లో బెయిలు కూడా ఇవ్వరు. కదులు ముందు’’ అని తొందరపెడతాడు పోలీసు.
ఇక మీకు ఏడుపొచ్చేస్తుంది. ‘‘కనీసం నా మీద కంప్లయింటు చేసిందెవరో చెప్పండి. పోయి కాళ్లయినా పట్టుకుంటాను’’ అంటారా?
నో చాన్స్! ఆ ఆశాలేదు. బాధితుడు ఎవరన్నది ఎవరికీ తెలియనివ్వకూడదని 40వ సెక్షను ఆన!
పోనీ - మీ ఏడుపుకు దయతలిచో, మీ వాలకం గమనించో, వారినీ వీరినీ వాకబు చేసో, మీకు అంతటి నేరం చేసేంత సీను లేదని పోలీసు ఇన్స్ప్‌క్టరు ధ్రువపరచుకుని మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నాడనుకోండి. ఐనా మీ కష్టాలు తీరవు.
పసలేని ఫిర్యాదులెమ్మని పోలీసులు దేన్నీ బుట్టలో పడెయ్యటానికి వీల్లేదు. ఫిర్యాదుపై దర్యాఫ్తు ఎంతవరకు వచ్చిందీ, ఎవరిని అరెస్టు చేసిందీ, చార్జిషీటు ఎప్పుడు పెట్టేదీ ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుకు రాతపూర్వకంగా దాఖలు చేసుకోవలసిన బాధ్యత 69వ సెక్షను ప్రకారం దర్యాఫ్తు అధికారిపై ఉంటుంది! అరెస్టు చెయ్యలేదు, చార్జిషీటు పెట్టట్లేదు అని పోలీసులంటే ‘‘బాధితుడు’’ ఊరుకోడు. ఏకంగా సరికొత్త ‘‘నేషనల్ అథారిటీ’’కో, ‘‘స్టేట్ అథారిటీ’’కో పోతాడు. ఒక్కో అథారిటీలోనూ ఏడుగురు మెంబర్లుంటారు. వారిలో కనీసం నలుగురు కంపల్సరీగా మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే ఉంటారు. వాళ్ల చేతిలో ప్రభుత్వాలనే ఫుట్‌బాల్ ఆడగలిగేంతటి అధికారాలుంటాయి.
కట్ చేస్తే... ఏ మహాద్భుతమో జరిగితే తప్ప మీకు మూడేళ్ల నుంచి యావజ్జీవం వరకూ జైలుశిక్ష, భారీ జుల్మానా గ్యారంటీ!
దేశవిభజన కాలం నుంచి నేటిదాకా ఇండియాలో ఎన్నో మతకల్లోలాలు జరిగాయి. ఎన్నో వేలూ, లక్షల మందిని దారుణంగా బలిగొన్నాయి. వారిలో అన్ని మతాలకు చెందినవారూ ఉన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన పాపంలో మెజారిటీ మైనారిటీ అన్న తారతమ్యం లేదు. దేశం మొత్తంమీద చూస్తే మైనారిటీ అయిన వారిది కూడా ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, లేక ఒక నగరంలో మెజారిటీ అయిన దృష్టాంతాలు లెక్కలేనన్ని. మానవత్వానికి, సభ్య సమాజానికి సిగ్గుచేటు అయిన మత హింస ఉన్మాదానికి పాల్పడింది ఎవరైనా, ఏ మతస్థులైనాసరే అందరినీ ఒకే విధంగా పరిగణించి, కఠినాతి కఠినంగా శిక్షించాలనే ఎవరైనా కోరేది. మతంతో విశ్వాసాలతో నిమిత్తం లేకుండా భారత పౌరులందరికీ సమాన న్యాయం, సమాన హక్కు ఉండాలనే అందరమూ అడిగేది.
అదీ పేరాశేనని దయగల యు.పి.ఎ. సెక్యులర్ సర్కారువారు ఇప్పుడు బ్రహ్మాండంగా తేల్చి పారేశారు. పార్లమెంటు నెత్తిమీద సూపర్ పార్లమెంటులా అమాంబాపతు శాల్తీలతో కొలువుతీరిన నేషనల్ అడ్వయిజరీ కౌన్సిలు వండివార్చి, కేంద్ర కేబినెటు కళ్లు మూసుకుని ఓకే చేసి, ఇక పార్లమెంటు ఆమోదం తతంగమే తరువాయి అనుకుంటున్న Prevention of Communal and Targeted Violence Bill, 2011 లో ఫొందుపరిచిన ప్రకారం-
మైనారిటీలపై మెజారిటీ వర్గం జరిపేది మాత్రమే ‘మతహింస’గా పరిగణించబడును. ముస్లింలపై హిందువులలాగే, హిందువులపై ముస్లింలో, ఇంకో మతస్థులో మతహింసకు పాల్పడ్డ ఉదంతాలు ఇటీవలి చరిత్రలో ఎన్ని ఉన్నా సరే! ఈ తల తిక్క బిల్లు దృష్టిలో - మైనారిటీ వర్గాలు మాత్రమే మతహింసకు బాధితులు.
'Victim' means any person belonging to a "group"
(భాధితుడు అనగా ఒక గ్రూపునకు చెందిన వారెవరైనా.)
"Group" means a religious or linguistic minority...
(‘‘గ్రూఫు’’ అనగా మతపరమైన, లేక భాషాపరమైన మైనారిటీ...)
అని 3వ సెక్షనులో ఇచ్చిన అమోఘ నిర్వచనాలను బట్టే ‘గోధ్రా’ రైలు పెట్టెలో సజీవ దహనమైన అభాగ్యులూ, 1993 బొంబాయి అల్లర్లలో ఘోరంగా బలి అయిన వందలాది హిందువులూ, కాశ్మీర్ గడ్డ నుంచి గెంటివేయబడ్డ లక్షలాది పండిట్లూ ‘మత హింస’ బాధితుల లెక్కలోకి రారని స్పష్టం. కుల, మత, విశ్వాసాలకు అతీతంగా భారత పౌరులందరూ చట్టం దృష్టిలో సమానులన్న రాజ్యాంగ సూత్రాన్నీ, నేరం రుజువయ్యేదాకా ఎవరినైనా నిరపరాధిగా చూడాలన్న సాధారణ న్యాయాన్నీ గుంటపెట్టి గంట వాయించి... ‘మతాన్నిబట్టి న్యాయం’ అన్న అడ్డగోలు సిద్ధాంతాన్ని లేవదీసిన జాతీయ సలహామండలి మేధావుల తెలివికి జోహార్లు! మైనారిటీల ప్రయోజనాలను కాపాడటమంటే మెజారిటీ ప్రజలను కాలరాచి, తుంగలో తొక్కడమేనని కనిపెట్టిన వీర సెక్యులర్ సర్కారువారి బుర్రే బుర్ర!
అష్ట అంటే ఎనిమిది కదా! ‘అష్టకష్టాలు’ ఉన్నాయనిఅనుకోకండి. కాని అష్ట అంకెతో అష్టదిగ్గజాలు, అష్ట దిక్కులు, అష్ట గణపతులు, అష్టగురువులు ఇలా ఎన్నో ఉన్నాయ అవన్నీ శుభం కదా! చూడండి ఎన్ని విశేషాలో...
అష్ట గణపతులు: లక్ష్మీగణపతి, క్షిప్ర గణపతి, సిద్ధి గణపతి, చింతామణి గణపతి, శక్తి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఏకాక్షర గణపతి, కుమార గణపతి.
అష్టకష్టములు: దాస్యము, దారిద్య్రము, భార్యావియోగము, స్వయం కృషి, యాచనము, యాచకులకు లేదనుట, అప్పుపడుట, సంచారం.
అష్టగురువులు: అక్షరాభాస్యం చేసిన వారు, గాయత్రిని ఉపదేశించినవారు, వేదం అధ్యయనం చేసిన వారు, శాస్త్రం చెప్పినవారు, పురాణం చెప్పిన వారు, శైవ, వైష్ణవ ధర్మం ప్రవచనం చేసినవారు, ఇంద్రజాలాదులు చెప్పినవారు, బ్రహ్మోపదేశం చేసిన వారు.
అష్ట దిక్కులు: తూర్పు, ఆగ్రేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం.
అష్టదిక్పాలకులు: ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, నిఋతి, వరుణుడు, కుబేరుడు, ఈశాన్యుడు.
అష్ట్భార్యలు: శుచి, స్వాహా, శ్యామలా, దుర్గా, కాలికా, అంజనా, చిత్రరేఖ, పార్వతి.
అష్ట పట్నములు: అమరావతి, తేజోవతి, సంయమని, కృష్టాంగన, శ్రద్ధావతి, గంధవతి, అలక.
అష్టవాహనములు: ఐరావతము, తగరు, మసిషము, గుఱ్ఱము, మొసలి, లేడి, నరుడు, వృషభము.
అష్టదిగ్గజాలు: అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాచయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళ సూరన, తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడు
అష్టసిద్ధులు: అణిమ, మహిమ, గరిమ, లఘిలమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం.
అష్ట్భైరవులు: రురుడు, చండుడు, కుండుడు, ఉన్మత్తుడు, కాపాలి, భీషణుడు, కులుడు, ఆనందుడు
అష్ట్భోగములు: అన్నము, వస్తమ్రు, గంధము, పుష్పము, శయ్య, తాంబూలము, స్ర్తి, గానము.
అష్టమదములు: అన్నమదం, అర్థమదం, స్ర్తిమదం, విద్యామదం, కులమదం, రూపమదం, ఉద్యోగమదం, నవదం.
అష్టమహిషులు: రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్రనుదంతి, కాళింది, లక్షణ, వీరంతా కృష్ణుని భార్యలు.
అష్టవసువులు: అవుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు.
అష్ట గృహస్థ ధర్మములు: స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవతార్చన, అతిథి సత్కారం, వైశ్యదేవం.
అష్టవిధ భక్తులు: భాగవతవత్సల్యం, భగవత్పూజానుమోదం, భగవద్ధర్మ, భగవద్విషయ, అధంబము, భగవత్క్థాశ్రవణేచ్ఛ, సర్వనేత్రాంగ విచారము, సంతతభగవత్ స్మరణము, అమాంస భక్షణము.
అష్టవిధ వివాహాలు: బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రజా పత్యము, అసురము, గాందర్వము, రాక్షసము, పైశాచము.
అష్టవిధ శ్రాద్ధాలు: దైవము, ఆర్షము, దివ్యము, పిత్య్రము, మాతృకము, మానుషము, భౌతికము, ఆత్మశ్రాద్ధము.
అష్టాక్షరి: ‘ఓం నమో నారాయణాయ’

సిరులిచ్చే సుబ్రహ్మణ్యేశ్వరుడు

లయకారుడైన శివుని ఆభరణాలుగా సర్పాలను చూస్తాం. వినాయకుని యజ్ఞోపవీతంగాను, మహావిష్ణువు తల్పంగా గూడా నాగులే దర్శనమిస్తాయ. తారకాసుర సంహారానికి దేవతల కోరికపై శివ వీర్యం వలన జన్మించిన సుబ్రహ్మణ్యశే్వరుడే నాగదేవతగానే ఆరాధిస్తారు.
ఒక్క హైందవ సంప్రదాయంలోనే గాక బౌద్దజైన సంప్రదాయాల్లోనూ నాగారాధన కనిపిస్తుంది. సర్పాన్ని జాతీయ చిహ్నంగా గల ప్రాచీనులు కూడా ఉండేవారని చరిత్ర చెప్తోంది.
ఇలా సర్పపూజ ప్రపంచం మొత్తంమీద చాలాచోట్ల కనిపిస్తుంది. ఇలాంటి సర్పపూజ సింగరాయపాలెంలో ప్రత్యేకతను సంతరించుకొంది. 1954 సంవత్సరంలో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం, సింగరాయపాలెం, మరియు చేవూరు పాలెం, గుళ్ల సింగరాయపాలెంగా ప్రసిద్ధి చెందిన శింగరాయపాలెం గ్రామంలో ఒక దేవతా సర్పరాజము శ్రీ బాబాజీ మఠములోనుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తటాకంలోకి వచ్చి స్నానం చేసి తిరిగి వెళ్లు సందర్భంలో చేవూరుపాలెంకు చెందిన ఇద్దరు రైతు సోదరులు అయిన అనందాసు వెంకటేశ్వరరావు (వెంకన్న), కీ.శే. ఇసుకపల్లి సుబ్బారావులు ఆ దేవతా సర్పరాజంపై రాళ్లు విసిరారు. ఆ సర్పరాజం తల నేల బాదుకుని మరణించింది. ఆ సర్పమును గ్రామస్తులు చేవూరుపాలెం కాలువగట్టుపై పాతిపెట్టారు. అంతే ఆ రైతు సోదరులకు చూపు పోయింది, వారు తమ తప్పు తెలుసుకొన్నారు. తమ తప్పును క్షమించమని వేడుకొన్నారు. అపరాధాలు మన్నించమని పరిపరివిధాలా ప్రార్థించారు.
ఇలా ప్రార్ధించిన తర్వాత భక్త దయాళువైన సుబ్రహ్మణ్యేశ్వరుడు వారికి చూపును ప్రసాదించాడు. ఆ రైతు సోదరులు ఆనందానికి అవధి లేకుండా పోయంది.
ఆ రోజు రాత్రి గ్రామ పెద్దకు శ్రీ స్వామివారు కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించాల్సిందిగా ఆదేశించారు. పాతిపెట్టబడిన సర్పమును వెలుపలకు తీసి ఊరేగించి దహన సంస్కారములు చేయడానికి చూస్తున్నారు. పవిత్రమైన ప్రదేశము కోసం పెద్దలు పండితులు చేవూరు పాలెం శింగరాయపాలెం సమావేశమై చర్చిస్తున్న సమయంలో దారినపోయే ఆవుల మందలోనుండి ఒక కపిల గోవు (నల్లని ఆవు) అంబా అని అరుస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన తటాకంలో దిగి స్నానమాచరించి చెరువుగట్టుపైకి వచ్చి చుట్టూ ప్రదక్షిణం చేసి మలమూత్రాలు విసర్జించింది.
కాలి గిట్టలతో త్రవ్వుతూ అంబా అంబా అను అరుస్తున్న ఆవును చూసి పెద్దలకు, పండితులకు వారి కర్తవ్యం అర్థం అయంది. అపుడు సుబ్రహ్మణేశ్వరునకు పెద్దలు ఇక్కడనే గుడి కడతామన్న సంగతిని నివేదించారు. అంతే ఆ మాటలు విన్న వెంటనే అక్కడ్నుంచి ఆ ఆవు సంతోషంగా వెళ్లిపోయంది. దాన్ని చూసి ప్రదేశంలోనే గుడి నిర్మించాలన్నది స్వామి ఆదేశం అని పండితులు, గ్రామ పెద్దలునిర్ణయానికి వచ్చారు.
గుడి నిర్మాణము చేయుట ఆ దైవప్రేరకమని వారందరూ భావించారు. అప్పట్నుంచి ఇక్కడి సుబ్రహ్మణ్యేశ్వరునికి మొక్కిన మొక్కులు తృటిలో తీరేవి. కోరిన కోర్కెలు తీర్చేస్వామిగా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు వినితి కెక్కాడు. అపుత్రులకు పుత్రులను, సుమంగళులకు నిత్యసౌభాగ్యాలను ఇచ్చే థేవునిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు సారతులందుకుంటున్నాడు.
అపుడు శ్రీకారం చుట్టిన ఈ దేవాలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ప్రతిష్టచేసారు. ఈ దేవాలయాన్ని శిధిల మవుతున్నందని భావించిన భక్తులు 2001లో 20 లక్షల ఖర్చుతో పునన్మిరాణం చేయించారు. పునప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఆనాటినుండి ఈనాటి వరకు దినదినాభివృద్ధి చెందుతు శ్రీస్వామివారు భక్తుల కోర్కెలను నెరవేర్చుకున్న సంగతి లోకవిదితమే
ముఖం మీద పుట్టుమచ్చలుంటే, విబూతి, కుంకుమ పెట్టుకోనక్కరలేదా?

పుట్టుమచ్చలు జన్మసిద్ధాలు. ముఖంమీద తిలకధారణ (విభూతి, పుండ్రము, కుంకుమ వగైరాల ధారణ) శాస్త్ర సిద్ధము. శాస్త్ర విహితమైనవదానిని పుట్టుమచ్చల కారణంగా విడిచివేసే సదుపాయం ధర్మశాస్త్రంలో లేదు.


దీపారాధనకు నువ్వుల నూనె వాడాలా, కొబ్బరి నూనె వాడవచ్చా?

స్వచ్ఛమైన స్వదేశీ ఆవునెయ్యి నిత్య దీపారాధనకు ఉత్తమం. అది కుదరకపోతే నువ్వుల నూనె. అది కూడా దొరక్కపోతే కొబ్బరి నూనె. ఇదికాక ప్రత్యేక కామ్యకర్మలకు ఆయా తంత్ర గ్రంథాలలో చెప్పిన తైలాలు వేరు. అవి నిత్యపూజకు కాదు.

ఒక వ్యక్తికి కొన్ని దురభ్యాసాలు కలుగుతాయని జాతకంలో గట్టిగా కనిపిస్తే ఇక ఆ వ్యక్తి జాగర్తపడి ప్రయోజనమేమిటి?

అలా జాగర్తపడే వీలు లేకపోతే, జాతక శాస్తమ్రే వ్యర్థం. మానవజీవితం కొంతమేరకు దైవబలానికి, కొంతమేరకు మానవ ప్రయత్న బలానికీ లోబడి ఉంటుందని శాస్త్రాలు నిర్ద్వంద్వంగా నిర్ణయించాయి. రాబోయే దోషాన్ని జాతక చక్రం ద్వారా తెలుసుకుని విహిత శాంతుల ద్వారాను, వ్యక్తిగత కృషి ద్వారాను రాబోయే దోషాలను తొలగించుకోవడం సాధ్యమే. ఇందులో సందేహం లేదు.

తల్లిదండ్రుల ఆబ్ధికాలను అన్నదమ్ములు కలిసిపెట్టాలా? విడివిడిగా పెట్టాలా?
ప్రతినిత్యము కలిసి ఉంటూ, ఒకే భాండంలోని అన్నం తింటూ కలిసి జీవిస్తున్న సోదరులు కలిసి ఆబ్ధికాలను పెట్టాలని, విడి సంపాదనలతో, విడిగా కాపురాలు చేసేవారు దగ్గర దగ్గరే ఉన్నా సరే విడిగానే పెట్టాలనీ, గ్రంథాలలో స్పష్టంగా ఉంది ఐతే కొన్ని శిష్ట కుటుంబాలలో కూడా విడిపోయిన సోదరులు కలిసి ఆబ్ధికాలు పెట్టడం కనిపిస్తోంది. ఇలాంటి విషయాలలో కుటుంబాచారం ప్రకారం పోవటం సుఖం.

పూజారులు, పురోహితులు, భక్తుల చేత పాద నమస్కారం చేయించుకోవచ్చునా?
భారతీయ సంస్కృతిలో పెద్దలకు పాదనమస్కారం అనేది ఒక ప్రధానాంశం. మనకు, దైవానికి అనుసంధానం చేస్తూ వారధులుగా ఉన్న అర్చకులు, పురోహితులు, వేద పండితులు మొదలైన వారికి పాద నమస్కారాలుచేయడం వేదంపట్ల దైవంపట్ల మనకు గల ప్రేమకు సంకేతం. ఐతే దేవాలయాలలో దేవతా విగ్రహాలకు ఎదురుగా ఆ దేవతకు తప్ప వేరెవరికీ నమస్కరించరాదు. అర్చకాదులను పక్కకు తీసుకువెళ్లి నమస్కరించవచ్చు.

ఒకే నక్షత్రంలోజన్మించిన వారి జాతకాలన్నీ ఒకేరకంగా ఉంటాయా?

అది అసాధ్యం. జాతక శాస్త్రం చాలా సంక్లిష్టం. అది తొమ్మిది గ్రహాలమీద, 27 నక్షత్రాల మీద, 12 రాశులమీద, ఇవికాక కొన్ని వందల యోగాల (కాంబినేషన్స్)మీద ఆధారపడి సాగుతుంది. కేవలం నక్షత్రం మీద ఆధారపడి ఎవరో ఏదో చెపుతున్నారంటే అది వినేవారి బలహీనత
.
గ్రహదోషాలకు జపం స్వయంగా చేసుకోవాలా? పురోహితులతో చేయించుకోవాలా? ఎంత సంఖ్యలో చేయించాలి?

నిజానికి గ్రహ జపాలన్నీ ప్రాయశ్చిత రూపాలు. వీలైనంతవరకు ఎవరి అర్హతకు తగిన మంత్రాన్ని వారు పొంది వీలైనంతవరకు ఈ జపాదులు చేసుకోవడం మంచిది. దోషం తీవ్రంగా ఉన్నప్పుడు మనకు బొత్తిగా కుదరనప్పుడు పురోహితులతో చేయించుకోవచ్చును. ఒక్కొక్క గ్రహానికి గల దోష తీవ్రతనుబట్టి విశేష సంఖ్యలో జపాలు అవసరమవుతాయి. సామాన్య స్థితిలో గ్రహాల దశా సంవత్సరాలనుబట్టి గ్రహజప సంఖ్య నిర్ణయం జరిగింది.

అప్సరసలు

 

    
స్వర్గంలో దేవతలను నాట్యగానాలతో అలరించేందుకు నియనించబడీనవారు అప్సరసలు.
  1. రంభ
  2. ఊర్వశి
  3. మేనక
  4. తిలోత్తమ
  5. ఘృతాచి
It doesn't matters what you saying, it matters when you saying                  

Thursday 22 September 2011

గురువారానికి వుండే విశిష్టత ఏమిటి ?

గురువారానికి వుండే విశిష్టత ఏమిటి ?
సద్గురు సాయినాథుల వారికి పూర్వము గురువారానికి అధిష్టాన దైవము ఎవరు ?
ప్రత్యేకముగా సాయినాథులవారు గురువారమును ఎంచుకోవటంలో అంతరార్థము ఏమిటి ?
 
వార అధిష్టాన దేవతల గురించి శ్రీ మన్మహాదేవుల వారు ఈ క్రింది విధంగా చెప్పటం జరిగింది.

ఆదివారామునకు శ్రీ మన్మహాదేవులవారు అధిష్టానము. ఈ రోజున ప్రణవార్చన చాలా విశేషము. అంటే ఓంకార సంపుటీకరణతో చేసే అర్చన, అభిషేక, ఆరాధనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. సోమవారమునకు శివుని మాయ, మంగళవారమునకు స్కంద, బుధవారమునకు విష్ణు, గురువారమునకు బ్రహ్మ మరియు విఘ్నేశ్వర, శుక్రవారమునకు ఇంద్ర, శనివారమునకు యమధర్మరాజు అధిష్టాన దేవతలు. నవగ్రహములు ఆవిర్భవించిన తర్వాత ఆయా గ్రహములకు ఆధిపత్యము ఇవ్వటము జరిగింది.

సద్గురువుల ఆవిర్భావము అయ్యాక గురువారము శ్రీ సాయినాథ, అదే విధంగా వెంకటేశ్వర ఆవిర్భావం అయ్యాక శనివారము శ్రీ వెంకటేశ్వర అర్చన, ఆరాధనలు చేస్తున్నాము. ఏ నూతన కార్యం ప్రారంభించటానికి అయినా, గురువారము చాలా మంచిది. ఆ రోజు ప్రారంభం చేసిన కార్యం దిగ్విజయాన్ని చేకూరుస్తుంది. ఆ వారఫలము చేత కేవలము సాయినాథుల వారి అనుగ్రహమే కాకుండా, శ్రీ సరస్వతి సమేత బ్రహ్మదేవ, శ్రీ సిద్ది బుద్ది సమేత గణనాథుల వారి అనుగ్రహము కూడా కలుగుతుంది.

అన్ని వారాలలో సాయినాథులవారికి గురువారము ప్రత్యేకము. అంటే, కలియుగంలో ఎవరైతే సద్గురువులను ఆశ్రయించి, వారి అనుజ్ఞ తీసుకొని నూతన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటారో, వారికందరికీ బ్రహ్మదేవులవారి అనుగ్రహంతో మంచి బుద్ది, బ్రహ్మశక్తి అయిన సరస్వతి అనుగ్రహంతో మంచి ప్రవర్తన, గణనాథులవారి అనుగ్రహంతో మంచి వ్యక్తులతో స్నేహము అనే ఫలితములు కలుగుతాయి. తద్వారా ప్రారంభించిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

శ్రీ సద్గురు సాయినాథులవారు గురువారాన్ని ప్రత్యేకంగా ఎంచుకోవటానికి అనేక విషయాలు కారణములుగా వుంటాయి. వాటిలో పైన చెప్పినది కూడా ఒక కారణము. సద్గురువుల అనుగ్రహము వలన కలిపురుషుని ప్రభావము అధికంగా వుండే ఈ కలియుగంలో కూడా మన్యుష్యులందరికీ మంచి బుద్ది, మంచి ప్రవర్తన, మంచి వ్యక్తులతో స్నేహము అనే మూడు ముఖ్యమైన మంచి గుణములు చేకూరు గాక ! అదే విధంగా ఈ లోకంలో వుండే గురువులందరూ, సద్గురువుల లాగా భక్తులందరికీ శుభ ఫలితములు చేకూర్చెదరు గాక !

సంవత్సరముల సంఖ్య ఎంత ? వాటి పేర్లు ఏమిటి ?


సంవత్సరముల సంఖ్య ఎంత ? వాటి పేర్లు ఏమిటి ?
 
మొత్తము సంవత్సరముల సంఖ్య అరవై (౬౦).
వీటిని మనవాళ్ళు చాలామంది తెలుగు సంవత్సరములు అని అంటూ ఉంటూ వుంటారు.
కాని, తెలుగు వారికే కాకుండా హిందూ ధర్మమును పాటించే వారికందరికీ ఇవే సంవత్సరములు వర్తిస్తాయి.
షష్టి (అరవై) సంవత్సర నామములు
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6. అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్ధివ
20. వ్యయ
21. సర్వజిత్
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మధ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోధీ
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృతు
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాలయుక్తి
53. సిధార్థ
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ

ఉపనిషత్ సంఖ్య ఎంత ? వాటిని పారాయణ చేస్తే కలిగే ఫలితం ఏమిటి ?


ఉపనిషత్ సంఖ్య ఎంత ? వాటిని పారాయణ చేస్తే కలిగే ఫలితం ఏమిటి ?
 

ఉపనిషత్ సంఖ్య అష్టోత్తర శతం (౧౦౮).
ఈ నూటెనిమిది ఉపనిషత్తులను పారాయణ చేసినను లేక విన్నను చతుర్వేద పారాయణ చేసిన ఫలం లభిస్తుంది.

అష్టోత్తర శత ఉపనిషత్ నామములు
1. ఈశావాస్యోపనిషత్
2. కేనోపనిషత్
3. కఠోపనిషత్
4. ప్రశ్నోపనిషత్
5. ముండకోపనిషత్
6. మాండూక్యోపనిషత్
7. తైత్తిరీయోపనిషత్
8. ఐతరేయోపనిషత్
9. చాందోగ్యోపనిషత్
10. బృహదారణ్యకోపనిషత్
11. బ్రహ్మోపనిషత్
12. కైవల్యోపనిషత్
13. జాబాలోపనిషత్
14. శ్వేతాశ్వతరోపనిషత్
15. హంసోపనిషత్
16. అరుణికోపనిషత్
17. గర్భోపనిషత్
18. నారాయణోపనిషత్
19. పరమహంసోపనిషత్
20. అమృతబిందూపనిషత్
21. అమృతనాదోపనిషత్
22. అథర్వశిరోపనిషత్
23. అథర్వశిఖోపనిషత్
24. మైత్రాయణ్యుపనిషత్
25. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్
26. బృహజ్జాబాలోపనిషత్
27. నృసింహతా పిన్యుపనిషత్
28. కాలాగ్నిరుద్రోపనిషత్
29. మైత్రేయోపనిషత్
30. సుబాలోపనిషత్
31. క్షురికోపనిషత్
32. మంత్రికోపనిషత్
33. సర్వసారోపనిషత్
34. నిరాలంబోపనిషత్
35. శుకరహస్యోపనిషత్
36. వజ్రసూచ్యుపనిషత్
37. తేజోబిందూపనిషత్
38. నాదబిందూపనిషత్
39. ధ్యానబిందూపనిషత్
40. బ్రహ్మవిద్యోపనిషత్
41. యోగతత్వోపనిషత్
42. ఆత్మబోధోపనిషత్
43. నారదపరివ్రాజకోపనిషత్
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్
45. సీతోపనిషత్
46. యోగచూడామణ్యుపనిషత్
47. నిర్వాణోపనిషత్
48. మండల బ్రాహ్మణోఫనిషత్
49. దక్షిణామూర్త్యుపనిషత్
50. శరభోపనిషత్
51. స్కందోపనిషత్
52. మహానారాయణోపనిషత్
53. అద్వయతారకోపనిషత్
54. రామరహస్యొపనిషత్
55 రామతాపిన్యుపనిషత్
56. వాసుదేవోపనిషత్
57. ముద్గలోపనిషత్
58. శాండిల్యోపనిషత్
59. పైంగలోపనిషత్
60. భిక్షుకోపనిషత్
61. మహోపనిషత్
62. శారీరకోపనిసషత్
63. యోగశిఖోపనిషత్
64. తురీయాతీతోపనిషత్
65. సన్న్యాసోపనిషత్
66. పరమహంసపరివ్రాజకోపనిషత్
67. అక్షమాలికోపనిషత్
68. అవ్యక్తోపనిషత్
69. ఏకాక్షకోపనిషత్
70. అన్నపూర్ణోపనిషత్
71. సూర్యోపనిషత్
72. అక్ష్యుపనిషత్
73. ఆధ్యాత్మోపనిషత్
74. కుండికోపనిషత్
75. సావిత్ర్యుపనిషత్
76. ఆత్మోపనిషత్
77. పాశుపతబ్రహ్మోపనిషత్
78. పరబ్రహ్మోపనిషత్
79. అవధూతోపనిషత్
80. త్రిపురతాపిన్యుపనిషత్
81. శ్రీదేవ్యుపనిషత్
82. త్రిపురోపనిషత్
83. కఠరుద్రోపనిషత్
84. భావనోపనిషత్
85. రుద్రహృదయోపనిషత్
86. యోగకుండల్యుపనిషత్
87. భస్మ జాబాలోపనిషత్
88. రుద్రాక్ష జాబాలోపనిషత్
89. గణపత్యుపనిషత్
90. ధర్మనోపనిషత్
91. తారసారోపనిషత్
92. మహావాక్యోపనిషత్
93. పంచబ్రహ్మోపనిషత్
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్
95. గోపాలతాపిన్యుపనిషత్
96. కృష్ణోపనిషత్
97. యాజ్ఞ్వల్క్యోపనిషత్
98. వరాహోపనిషత్
99. శాట్యాయనీయోపనిషత్
100. హయగ్రీవోపనిషత్
101. దత్తాత్రేయోపనిషత్
102. గారుడోపనిషత్
103. కలిసంతారణోపనిషత్
104. బాల్యుపనిషత్
105. సౌభాగ్యలక్ష్ముపనిషత్
106. సరస్వతీ రహస్యోపనిషత్
107. బహ్వృచోపనిషత్
108. ముక్తికోపనిషత్

మొత్తం కౌరవుల సంఖ్య ఎంత ? వారి పేర్లు ఏమిటి ?

మొత్తం కౌరవుల సంఖ్య ఎంత ? వారి పేర్లు ఏమిటి ?
.

ధృతరాష్ట్రునకు నూటవొక్క (౧౦౧) మంది సంతానము.
ఇతని కుమారులు అయినటువంటి కౌరవుల సంఖ్య శతము (౧౦౦).
వీరికి ఒక సోదరి కూడా వున్నది. ఆమె పేరు దుస్సల.

కౌరవుల పేర్లు :
  1. దుర్యోధన
  2. దుశ్శాసన
  3. దుస్సహ
  4. దుశ్శల
  5. జలగంధ
  6. సామ
  7. సహ
  8. వింద
  9. అనువింద
  10. దుర్దర్శ
  11. సుబాహు
  12. దుష్ప్రదర్శన
  13. దుర్మర్శన
  14. దుర్ముఖ
  15. దుష్కర్ణ
  16. కర్ణ
  17. వికర్ణ
  18. శాల
  19. సత్వ
  20. సులోచన
  21. చిత్ర
  22. ఉపచిత్ర
  23. చిత్రాక్ష
  24. చారుచిత్ర
  25. శరాసన
  26. దుర్మద
  27. దుర్విగాహ
  28. వివిత్సు
  29. వికటాసన
  30. ఊర్ణనాభ
  31. సునాభ
  32. నంద
  33. ఉపనంద
  34. చిత్రభాను
  35. చిత్రవర్మ
  36. సువర్మ
  37. దుర్విమోచ
  38. అయోబాహు
  39. మహాబాహు
  40. చిత్రాంగ
  41. చిత్రకుండల
  42. భీమవేగ
  43. భీమబల
  44. బలాకి
  45. బలవర్ధన
  46. ఉగ్రాయుధ
  47. సుసేన
  48. కుండధార
  49. మహోదర
  50. చిత్రాయుధ
  51. నిశాంగి
  52. పాశి
  53. బృందారక
  54. దృఢవర్మ
  55. దృడక్షత్ర
  56. సోమకీర్తి
  57. అనుదార
  58. దృఢసంధ
  59. జరాసంధ
  60. సత్యసంధ
  61. సదాసువాక్
  62. ఉగ్రశ్రవస
  63. ఉగ్రసేన
  64. సేనాని
  65. దుష్పరాజయ
  66. అపరాజిత
  67. కుండశాయి
  68. విశాలాక్ష
  69. దురాధర
  70. దృఢహస్త
  71. సుహస్త
  72. వాతవేగ
  73. సువర్చస
  74. ఆదిత్యకేతు
  75. బహ్వాశి
  76. నాగదత్త
  77. అగ్రయాయి
  78. కవచి
  79. క్రధన
  80. భీమవిక్రమ
  81. ధనుర్ధర
  82. వీరబాహు
  83. ఆలోలుప
  84. అభయ
  85. దృఢకర్మణ
  86. దృఢరథాశ్రయ
  87. అనాధృష్య
  88. కుండాభేది
  89. విరావి
  90. చిత్రకుండల
  91. ప్రమథ
  92. అప్రమథ
  93. దీర్ఘరోమ
  94. వీర్యవంత
  95. దీర్ఘబాహు
  96. సువర్మ
  97. కనకధ్వజ
  98. కుండాశి
  99. విరజ
  100. యుయుత్సు

బ్రాహ్మణులకి ఉండవలసిన, ఉండకూడని లక్షణాలు ఏమిటి ?

ప్రస్తుత కాలంలో మంచి లక్షణాలు కలిగిన బ్రాహ్మణులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
బ్రాహ్మణులకి ఉండవలసిన, ఉండకూడని లక్షణాలు ఏమిటి ?
.

దైవాధీనం జగత్ సర్వం | మంత్రాధీనంతు దైవతం ||
తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||

ఈ జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది.
ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, ఆ మంత్రములకు అధీనులై వుంటారు.
ఆ మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది.
అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి.

పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన ఆ జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, ఈ జన్మలోనే ముందు ఆ దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. అవి పాటించటం కష్టం అనుకుంటే, వైదికవృత్తి వదిలేసి వేరే వృత్తి చూసుకోవటం మంచిది.

బ్రాహ్మణుడికి ఉండవలసిన కనీస లక్షణాలు :

యజ్ఞోపవీత (జంధ్యం) ధారణ :
కేవలం యజ్ఞోపవీతం ధారణ చేయటమే కాకుండా, దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.

నిత్య సంధ్యావందనం :
నిత్యం ఖచ్చితంగా సంధ్యావందనము, గాయత్రీ జపము చేస్తూ వుండాలి.

శిఖా సంస్కారం (పిలక), చెవి పోగులు :
బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శిఖ లేనివాడు బ్రాహ్మణుడే కాదు.

పవిత్రద్రవ్య ధారణ :
ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి.

ప్రశాంతంగా ఉండుట :
ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి తప్ప, కోపము, చికాకు, విసుకు, అయిష్టము, ద్వేషము వంటి గుణములు వుండకూడదు. నిగ్రహం లేనివ్యక్తి దేవతా అర్చానాదులకి అర్హుడు కాడు.

స్పష్టంగా మాట్లాడుట :
మాట్లాడే మాట స్పష్టంగా వుండాలి. మనస్సులో ఒకటి, బయటికి చెప్పేది వేరొకటి వుండకూడదు. సత్యమే మాట్లాడాలి. మాటలో వెకిలితనం, గర్వం, ఇతరులని నిందించటం వంటివి వుండకూడదు. అట్లాగే, ఇతరులకి చెడు కలిగే మాటలు మాట్లాడకూడదు.

చెడు వ్యసనములు లేకుండుట :
మాంసం, మద్యం, పొగ త్రాగటం, మత్తు పదార్థాలు నములుతూ వుండటం పనికిరాదు. పర స్త్రీ, పర ధనం గురించి వ్యామోహం వుండకూడదు.

సమ భావన :
ధనిక, బీద అనే తేడా లేకుండా అందరితో సమ భావన కలిగి వుండాలి.

కేవలం, పైన చెప్పిన లక్షణాలే కాకుండా ఇంకా అనేక అంశాలు వుంటాయి. కనీసం, పైన చెప్పిన లక్షణాలు వుంటే అతను మంచి బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు. వైదికాన్ని (అర్చకత్వ, పురోహిత లేక ఆగమం) ఒక డబ్బు సంపాదించే వృత్తిగా మాత్రమే భావిస్తూ, డబ్బుతో బాటు చెడు వ్యసనాలు కూడా కలిగినవారిని గౌరవించాల్సిన అవసరం లేదు.

కానీ, నిస్వార్థంగా లోకశ్రేయస్సు కోసం దేవతా అర్చన, ఆరాధనలు చేస్తున్న బ్రాహ్మణులకు ఏ కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత సమాజంలో ప్రతి వ్యక్తి పైనా వుంది. బ్రాహ్మణులు, గోవులు సుభిక్షంగా వున్నంత కాలం లోకం సుభిక్షంగా వున్నట్లే అని గ్రహించాలి

అష్టాదశ పురాణముల పేర్లు, వాటిలో వుండే ప్రధాన అంశాలు ఏమిటి ?

అష్టాదశ పురాణముల పేర్లు, వాటిలో వుండే ప్రధాన అంశాలు ఏమిటి ?

 
అష్టాదశ పురాణముల పేర్లు :మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వ చుతష్టయం |అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షత ||

మ ద్వయం - మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భ ద్వయం- భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్ర త్రయం- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వ చుతష్టయం- వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
అ - అగ్ని పురాణం,
నా - నారద పురాణం,
ప - పద్మ పురాణం,
లి - లింగ పురాణం,
గ - గరుడ పురాణం,
కూ - కూర్మ పురాణం
స్క - స్కంద పురాణం

అష్టాదశ పురాణములందలి కొన్ని ప్రధాన అంశములు :

౧. మత్స్య పురాణం (శ్లోక సంఖ్య - ౧౪౦౦౦)
మ త్స్య నారాయణునిచే మనువుకు ఉపదేశించబడినది.
కార్తికేయ, యయాతి, సవిత్ర చరిత్రలు. ధర్మాచరణ విషయములు,
ప్రయాగ, వారణాసి మొ || లగు పుణ్యక్షేత్ర మహత్మ్యములను కలిగి ఉండును.

౨. మార్కండేయ పురాణము (శ్లోక సంఖ్య - ౯౦౦౦)
మార్కండేయ మహర్షిచే ఉపదేశించబడినది.
శివ విష్ణు, ఇంద్ర, అగ్ని, సూర్య, మహత్మ్యములు మరియు
చండీ హోమమునకు ఆధారమైన సప్తశతి మాహాత్యమును ఈ పురాణము కలిగి ఉండును.

౩. భాగవత పురాణము (శ్లోక సంఖ్య - ౧౮,౦౦౦)
వేద వ్యాసుని ద్వారా శుకునకు ఉపదేశించబడినది.
మహావిష్ణు అవతారములు, ప్రత్యేకముగా శ్రీ కృష్ణ జనన, లీలా చరితములను కలిగి ఉండును.

౪. భవిష్య పురాణము (శ్లోక సంఖ్య - ౧౪,౫౦౦)
సూర్య భగవానునిచే మనువునకు ఉపదేశించబడినది.
సూర్యోపాసన, అగ్ని ఆరాధన, వర్ణాశ్రమ ధర్మములు, భవిష్యత్ విషయములను కలిగివుండును.

౫. బ్రహ్మ పురాణము (శ్లోక సంఖ్య - ౧౦,౦౦౦)
బ్రహ్మ దేవునిచే దక్షునకు ఉపదేశించబడినది.
శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యప చరిత్రలు, వర్ణ ధర్మములు,
ధర్మాచరణములు, స్వర్గ, నరక వివరణ మొ || లగు కలిగివుండును.
దీనినే ఆది పురాణం లేక సూర్య పురాణం అంటారు.

౬. బ్రహ్మాండ పురాణము (శ్లోక సంఖ్య - ౧౨,౦౦౦)
బ్రహ్మదేవునిచే మరీచికి ఉపదేశించబడినది.
శ్రీ కృష్ణ, రాధాదేవి, పరశురామ, శ్రీరామచంద్ర చరిత్రలు.
శ్రీ లలితా సహస్ర నామస్తోత్రము, శివ కృష్ణ సోత్రములు,
ఖగోళ శాస్త్ర, స్వర్గ, నరక వివరణ కలిగివుండును.

౭. బ్రహ్మవైవర్త పురాణము (శ్లోక సంఖ్య - ౧౮,౦౦౦)
సావర్ణునిచే నారదునకు ఉపదేశించబడినది.
స్కంద, గణేశ, రుద్ర శ్రీ కృష్ణ, బ్రహ్మ, ప్రకృతి, దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ
మొ || లగు దేవతా మహత్యములను కలిగివుండును.

౮. వరాహ పురాణము (శ్లోక సంఖ్య - ౨౪,౦౦౦)
వరాహ నారాయణునిచే భూదేవికి ఉపదేశించబడినది.
విష్ణు ఉపాసనా విధానము, పరమేశ్వరీ, పరమేశ్వర చరిత్రలు,
ధర్మశాస్త్రము, వ్రత కల్పములు, పుణ్య క్షేత్ర వర్ణనలు మొ || లగునవి కలిగివుండును.

౯. వామన పురాణము (శ్లోక సంఖ్య - ౧౦,౦౦౦)
పులస్త్య ౠషిచే నారదునకు ఉపదేశించబడినది.
శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణ వైభవము, శివ, గణేశ, కార్తికేయ చరిత్రలు,
భూగోళ, ఋతు వర్ణనలు మొ || లగునవి కలిగివుండును.

౧౦. వాయు పురాణము (శ్లోక సంఖ్య - ౨౪,౦౦౦)
వాయుదేవునిచే ఉపదేశించబడినది.
శివ మహాత్మ్యము, కాలమాన, భూగోళ, సౌరమండల వర్ణన
మొ || లగునవి కలిగివుండును.

౧౧. విష్ణు పురాణము (శ్లోక సంఖ్య - ౨౩,౦౦౦)
పరాశరునిచే మైత్రేయునికి ఉపదేశించబడినది.
విష్ణు మహాత్మ్యము, శ్రీ కృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరత చరిత్రలు
మొ ||లగునవి కలిగివుండును.

౧౨. అగ్ని పురాణము (శ్లోక సంఖ్య - ౧౫,౪౦౦)
అగ్ని భగవానునిచే వశిష్ణునకు ఉపదేశించబడినది.
శివ, గణేశ, దుర్గా ఉపాసన, వ్యాకరణము, చంధస్సు, వైద్యము,
లౌకిక - రాజకీయ ధర్మములు, భూగోళ, ఖగోళ, జ్యొతిష శాస్త్రములు
మొ || లగునవి కలిగివుండును.

౧౩. నారద పురాణము (౨౫,౦౦౦)
నారదునిచే సనక, సనందన, సనత్కుమార, సనాతన
అను నలుగురు బ్రహ్మా మానసపుత్రులకు ఉపదేశించబడినది.
వేదపాద స్తవము, వేదాంగములు, వ్రతములు, బదరీ - ప్రయాగ - వారణాశి క్షేత్ర వర్ణన
మొ || లగునవి కలిగివుండును.

౧౪. స్కంద పురాణము (శ్లోక సంఖ్య - ౮౧,౦౦౦)
స్కందునిచే ఉపదేశించబడినది.
శివ చరిత్ర వర్ణన, స్కంద మహాత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీ ఖండ, కేదార ఖండ,
రేవా ఖండ (సత్యనారాయణ వ్రతము), వైష్ణవ ఖండ (వేంకటాచల క్షేత్రము),
ఉత్కళ ఖండ (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండ (అరుణాచల క్షేత్రము),
బ్రహ్మ ఖండ (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండ (గోకర్ణ క్షేత్రము, ప్రదోష పూజ),
అవంతికా ఖండ (క్షీప్రా నదీ, మహాకాల మహాత్మ్యము)
మొ || లగునవి కలిగివుండును.

౧౫. లింగ పురాణము (శ్లోక సంఖ్య - ౧౧,౦౦౦)
శివునిచే నందీశ్వరునకు ఉపదేశించబడినది.
లింగ మహత్యము, శివ మహిమ, దేవాలయ ఆరాధన,
వ్రతములు, ఖగోళ - జ్యోతిష - భూగోళ శాస్త్రములు
మొ || లగునవి కలిగివుండును.

౧౬. గరుడ పురాణము (శ్లోక సంఖ్య - ౧౯,౦౦౦)
విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది.
మహావిష్ణు ఉపాసన, గరుత్మంత ఆవిర్భావము, జనన - మరణ విషయములు,
స్వర్గ – నరక ప్రయాణములు మొ ||లగునవి కలిగివుండును.

౧౭. కూర్మ పురాణము (శ్లోక సంఖ్య - ౧౭,౦౦౦)
కూర్మ నారాయణునిచే ఉపదేశించబడినది.
వరాహ, నృసింహ అవతారములు, లింగ రూప మహత్యము, శివారాధన,
ఖగోళ - భూగోళ, వారణాసి - ప్రయాగ క్షేత్ర వర్ణన
మొ || లగునవి కలిగివుండును.

౧౮. పద్మపురాణము (శ్లోక సంఖ్య - ౮౫,౦౦౦)
బ్రహ్మదేవునిచే ఉపదేశించబడినది.
జన్మాంతర పాప నివృత్తి, మదు కైటభ వధ, బ్రహ్మ సృష్టికార్యము, గీతార్థసారము,
గంగా, గాయత్రీ మహత్యములు, అశ్వత్థ వృక్ష మహిమ, విభూతి మహాత్మ్యము,
పూజా విధీ – విధానములు, సత్ప్రవర్తన, మొ || లగునవి కలిగివుండును.

వేదవ్యాస విరచితములైన, నైమిశారణ్య ప్రసిద్ధములైన
ఈ అష్టాదశ పురాణముల గురించి తెలుసుకొనుట పూర్వ జన్మ సుకృతము.
ఎవరైతే, ఈ అష్టాదశ పురాణములను పారాయణ చేస్తారో,
వారు మంచి బుద్ది కలిగినవారై చెడు మార్గాములకు దూరంగా వుంటారు.
అంతే కాకుండా, అందరి పట్ల సమ భావన కలిగి వుంటారు.
వేదవ్యాస స్వరూపములుగా అవతరిస్తూ, లోకమును రక్షిస్తున్న
సకల దేవతల అనుగ్రహము లోకమునకు చేకూరు గాక !

|| విశ్వస్య కళ్యాణమస్తు ||

తిధుల ప్రాధాన్యత ఏమిటి ? ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ?

తిధుల ప్రాధాన్యత ఏమిటి ? ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ?
తిధి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి ?
 
ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.
అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని
పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి :
అధిదేవత - అగ్ని. వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.
విదియ :
అధిదేవత - అశ్విని దేవతలు. వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.

తదియ :
అధిదేవత - గౌరీ దేవి. వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.

చవితి:
అధిదేవత - వినాయకుడు. వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.

పంచమి:
అధిదేవత - నాగ దేవత. వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.

షష్టి :
అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.

సప్తమి:
అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.

అష్టమి:
అధిదేవత - అష్టమాత్రుకలు. వ్రత ఫలం - దుర్గతి నాశనము.

నవమి:
అధిదేవత - దుర్గాదేవి. వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.

దశమి:
అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.

ఏకాదశి:
అధిదేవత - కుబేరుడు. వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.

ద్వాదశి:
అధిదేవత - విష్ణువు. వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.

త్రయోదశి:
అధిదేవత - ధర్ముడు. వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.

చతుర్దశి:
అధిదేవత - రుద్ర. వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.

అమావాస్య:
అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.

పౌర్ణమి:
అధిదేవత - చంద్రుడు. వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

శ్రావణ మాసం అన్ని దేవతలకు ప్రీతికరము అని అంటారు కదా !


శ్రావణ మాసం చాలా విశేషమైన మాసము. ఈ మాసం విష్ణుమూర్తులవారికి చాలా ప్రీతికరము. అట్లాగే వరలక్ష్మీ, గౌరీ, సంతోషీమాత, హయగ్రీవ, సదాశివ, సుబ్రహ్మణ్య, కృష్ణ, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా ప్రీతికరమగు మాసము. అందుకని శ్రావణ మాసాన్ని సకలదేవతా మాసము అని కూడా అనవచ్చును.

శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం
శ్రవణా నక్షత్రం విష్ణుమూర్తుల వారి జన్మ నక్షత్రం. కనుక, శ్రావణ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీ సత్యనారాయణ వ్రతం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

శ్రీ రుద్రాభిషేకం
ఉత్తరాదిన ఈ మాసంలో శివ ఆరాధనలు కూడా ఎక్కువగా జరుగుతూ వుంటాయి. సంవత్సరం మొత్తంలో శ్రావణ మాసంలో కాశీ క్షేత్రం భక్తులతో చాలా కోలాహలంగా వుంటుంది. ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం విశేషము.

శ్రీ మంగళ గౌరీ వ్రతం
కొత్తగా పెళ్లి అయిన మహిళలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళ వారం మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సుమంగళీ దేవి అనుగ్రహం కలుగుతుంది.

శ్రీ వరలక్ష్మీ వ్రతం
పెళ్ళైన స్త్రీలు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సకల సౌభాగ్యాలు చేకురుతాయి.

శ్రీ నాగుల చవితి
పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి, అనగా శుద్ధ చతుర్ధి రోజున సుబ్రహ్మణ్య లేక నాగ దేవత అభిషేకములు విశేషము. ఈ రోజున నాగ అభిషేకం చేసినవారికి సంతాన సంబంధ దోషములు కొంతవరకు నివృత్తి అవుతాయి.

శ్రీ పుత్రదా ఏకాదశీ వ్రతం
పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి, అనగా శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఈ రోజుని లలితా ఏకాదశీ అని కూడా అంటారు. పుత్ర సంతానం కలగటానికి ఈ రోజున పుత్రదా ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే మంచిది.

శ్రీ సంతోషీమాతా వ్రతం మరియు రక్షా బంధనం
శ్రావణ పూర్ణిమ శ్రీ సంతోషీమాతా జయంతి. ఈ రోజున శ్రీ సంతోషీమాతా వ్రతము చాలా విశేషము. శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. స్త్రీలు అన్నదమ్ములకు, సోదర సమానులకు రక్షను (రాఖీని) కట్టటం వలన శుభ ఫలితములు చేకూరుతాయి.

ఉపాకర్మ మరియు నూతన యజ్ఞోపవీత ధారణ
నూతనంగా ఉపనయనం అయిన వటువు ఈ రోజున కృష్ణాజిన విసర్జన చేసి యజ్ఞోపవీతము మార్చుకోవాలి. అట్లాగే విధిగా ఉపనయన సంస్కారం అయిన వారందరూ యజ్ఞోపవీతాన్ని (జంధ్యాన్ని) మార్చుకొని గాయత్రీ జపం చేసుకోవాలి.

శ్రీ లలితా సహస్రనామ పారాయణ
శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణ వచనము. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతములు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అట్లాగే, ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా ఉపదేశించబడిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టటం మంచిది. తద్వారా మనుషులలో వుండే ఆహాకారం తొలగిపోయి అందరితో సమ భావన కలిగి వుంటారు.

శ్రీ గురు రాఘవేంద్ర జయంతి
పూర్ణిమ తర్వాత వచ్చే విదియ, అనగా బహుళ విదియ రోజున శ్రీ గురు రాఘవేన్ద్రుల వారు సజీవంగా సమాధిలోకి వెళ్ళిన రోజు. ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన, అభిషేకములు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. గురునాధ పొంగళ్ళు వున్నవారు ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన ఖచ్చితంగా చేసుకోవాలి.

శ్రీ సంకట హరణ చతుర్ధి
బహుళ చతుర్ధి రోజున శ్రీ గణపతుల వారికి అభిషేక, అర్చన, వ్రతాదులు చేయటం వలన అన్ని కష్టములు తొలగి మంచి ఫలితములు కలుగుతాయి.

శ్రీ కృష్ణా అష్టమి
బహుళ అష్టమి రోజున శ్రీ కృష్ణ జయంతి కనుక, ఆ రోజున పిల్లలతో శ్రీ కృష్ణ పూజ చేయించి వెన్న, అటుకులు నైవేద్యం పెట్టించటం మంచిది. తద్వారా ఆ పిల్లలకి అన్ని విధాల కష్టాలను తేలికగా ఎదుర్కునే సామర్ధ్యం కలుగుతుంది. ఈ రోజునే జన్మాష్టమి అని కూడా అంటారు.

శ్రీ ఏకాదశీ వ్రతం
బహుళ ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించటం వల్ల మనస్సులో వుండే కోరికలు శీఘ్రంగా నెరవేరతాయి. ఈ రోజునవెన్న నైవేద్యం పెట్టటము మంచిది.

శ్రీ వృషభ అమావాస్య
శ్రావణ అమావాస్య రోజున వృషభ పూజా చాలా విశేషము. ఈ రోజున వృషభ పూజ చేయటం వలన అకాల మృత్యువు తొలగి పోయి దీర్ఘ ఆయుస్సు చేకూరుతుంది.

వేదములను కాపాడటానికి శ్రీ మహా విష్ణుమూర్తుల వారు శ్రావణ పూర్ణిమ రోజున శ్రీ హయగ్రీవుల వారిగా జన్మించటం జరిగింది. అందువలన, ప్రత్యేకముగా ఈ మాసంలో వేద గ్రంథముల ముద్రణకు సహకరించటం చాలా మంచిది. తద్వారా శ్రీ మహావిష్ణు కటాక్షం కలుగుతుంది