Thursday 16 May 2013


Suvarna Radhaakrishna
ఘనాపాఠి అని ఎవరిని అంటారు ? దేనిలో ప్రావిణ్యం ఉన్నవారికి ఈ బిరుదు లభిస్తుంది ?

కృష్ణ యజుర్వేదంలో వరుసగా...సంహిత మంత్రాలు( 42 పన్నాలు లేక ప్రశ్నలు ), అరణ్యకం ( బ్రహ్మ విచారం ) (12 ప్రశ్నలు ), బ్రాహ్మణం ( మంత్రం యొక్క తంతు భాగం )(28 ప్రశ్నలు ) ... ఈ మొత్తం 82 ప్రశ్నలను "ఆశీతిద్వయం " అందురు. మొత్తం 82 ప్రశ్నలను ఆవర్తనం చేసిన పిదప ... సంహిత మంత్రాలకు (42 ప్రశ్నలకు ) పదపాటం , క్రమ , జట , ఘనాపాఠం చేసి " ఘనాపాఠి " అగుదురు .

ఘనం అంటే అదొక వేద పఠనములో ఉచ్చారణ ప్రక్రియ. ఉదాహరణకు 12-21-123-321-123-23-32 ఇలా వరుసలో చదువుతారు. (ఇక్కడ అంకెలు శబ్దాలు) ... ఉదా : గణాణాం / త్వా / గణపతిగుం ( Contd )....అనే దానిలో ఒక్కో పదాన్ని 1,2,3 లాగా తీసికొని పైన చెప్పిన 12-21-123-321-123-23-32 వరుస క్రమములో గబగబా చదవగలగాలి .