Monday 5 October 2015

Narayani stuti - నారాయణి స్తుతి

Narayani stuti  - నారాయణి స్తుతి



సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే |
స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోzస్తు తే || ౧ ||
కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని |
విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోzస్తు తే || ౨ ||
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోzస్తు తే || ౩ ||
సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని |
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోzస్తు తే || ౪ ||
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోzస్తు తే || ౫ ||
హంసయుక్తవిమానస్థే బ్రహ్మాణీరూపధారిణి |
కౌశాంభఃక్షరికే దేవి నారాయణి నమోzస్తు తే || ౬ ||
త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని |
మాహేశ్వరీస్వరూపేణ నారాయణి నమోzస్తుతే || ౭ ||
మయూరకుక్కుటవృతే మహాశక్తిధరేzనఘే |
కౌమారీరూపసంస్థానే నారాయణి నమోzస్తు తే || ౮ ||
శంఖచక్రగదాశార్ఙ్గగృహీతపరమాయుధే |
ప్రసీద వైష్ణవీరూపే నారాయణి నమోzస్తు తే || ౯ ||
గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసుంధరే |
వరాహరూపిణి శివే నారాయణి నమోzస్తు తే || ౧౦ ||
నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే |
త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోzస్తు తే || ౧౧ ||
కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే |
వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోzస్తు తే || ౧౨ ||
శివదూతీస్వరూపేణ హతదైత్యమహాబలే |
ఘోరరూపే మహారావే నారాయణి నమోzస్తు తే || ౧౩ ||
దంష్ట్రాకరాలవదనే శిరోమాలావిభూషణే |
చాముండే ముండమథనే నారాయణి నమోzస్తు తే || ౧౪ ||
లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే |
మహారాత్రి మహామాయే నారాయణి నమోzస్తు తే || ౧౫ ||
మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి |
నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోzస్తుతే || ౧౬ ||
ఇతి శ్రీ దుర్గామాహాత్మ్యే నారాయణి స్తుతి |

another good telugu blog http://bugudursthothrasmantras.blogspot.in/2012/08/thyagaraja-keerthanalu.html

http://bugudursthothrasmantras.blogspot.in/2012/08/thyagaraja-keerthanalu.html

enno goppa mahimaanwitha keerthanalu andistunna mana telugu blogs ni aadarinchandi.

లక్ష్మీనృసింహ పంచరత్నం




లక్ష్మీనృసింహ పంచరత్నం

త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం
ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౧ ||
శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చే-
ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౨ ||
ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః
గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౩ ||
స్రక్చందనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే
గంధఫలీసదృశా నను తేమీ భోగానంతరదుఃఖకృతః స్యుః |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౪ ||
తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం
స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి|
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౫ ||

annamayya keertanalu http://bhavayami.blogspot.in/

http://bhavayami.blogspot.in/

Annamayya Keerthanalu - కట్టెదుర వైకుంఠము (Kattedura Vaikunthamu in Telugu)

Updated version is available at: http://www.vignanam.org/veda/annamayya-keerthanas-kattedura-vaikuntham-telugu.html.

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ

Annamayya Keerthanalu - మూసిన ముత్యాల కేలే (Moosina Mutyaalakele in Telugu)

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే సీమంతులు
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి

భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు

ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి

Annamayya Keerthanalu - తిరువీథుల మెఱసీ దేవదేవుడు (Tiruveedhula Merasee DevaDevudu in Telugu)

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను

తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును హుఱ్ఱ మెనిమిదోనాడు


కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్‍మంగతో
వనితల నడుమను వాహనాలమీదను

Tyagaraja Keerthanalu - బంటు రీతి కొలువీయ వయ్య రామ (Bantu Reeti Koluveeyavayya Rama in Telugu)

బంటు రీతి కొలువీయ వయ్య రామ

తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ

రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రామ నామమనే, వర ఖఢ్గమి
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

Tyagaraja Keerthanalu - సామజ వర గమన (Samaja Vara Gamana in Telugu)

సామజ వర గమన
సాధు హృత్ - సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత

సామని గమజ - సుధా
మయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల
మామ్ పాలయ

వేదశిరో మాతృజ - సప్త
స్వర నాదా చల దీప
స్వీకృత యాదవకుల
మురళీవాదన వినోద
మోహన కర, త్యాగరాజ వందనీయ

Tyagaraja Keerthanalu - బ్రోవ భారమా (Brova Bharama in Telugu)

బ్రోవ భారమా, రఘు రామ
భువనమెల్ల నేవై, నన్నొకని

శ్రీ వాసుదేవ! అండ కోట్ల
కుక్షిని ఉంచుకోలేదా, నన్ను

కలశాంబుధిలో దయతో
అమరులకై, అది గాక

గోపికలకై కొండలెత్త లేదా
కరుణాకర, త్యాగరాజుని

Tyagaraja Keerthanalu - మరుగేలరా ఓ రాఘవా (Marugelara O Raghava in Telugu)

Please find an updated version of this at http://www.vignanam.org/veda/tyagaraja-keerthanas-marugelara-o-raghava-telugu.html


మరుగేలరా ఓ రాఘవా!

మరుగేల - చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన

అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత

Tuesday, June 01, 2010

దుర్గా సూక్తం (Durga Suktam in Telugu)

జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః |
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా త్యగ్నిః ||

తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టా”మ్ |
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ||

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా” |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః ||

విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితా తిపర్ షి |
అగ్నే అత్రివన్మనసా గృణానో” స్మాకం బోధ్యవితా తనూనా”మ్ ||

పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమాథ్సధస్థా”త్ |
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితా త్యగ్నిః ||

ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి’ |
స్వాంచా” గ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ ||

గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవే”ంద్ర విష్ణోరనుసంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్ ||

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి |
తన్నో దుర్గిః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

శ్రీ సూక్తం (Sri Suktam, Sree Suktam)

హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం|
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీ''మ్ |
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్ |
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ ||

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ |
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||

ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః |
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే ||

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః ||

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||

ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణా”మ్ హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలా”మ్ పద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీ”మ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వా”న్, విందేయం పురుషానహమ్ ||

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Monday, May 31, 2010

Annamayya Keerthanalu - వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnu Katha in Telugu)

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ

ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ

వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ

Annamayya Keerthanalu - నారాయణతే నమో నమో (Narayanate Namo Namo in Telugu)

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో

Sunday, May 30, 2010

Annamayya Keerthanalu - అన్ని మంత్రములు (Anni Mantramulu in Telugu)

అన్ని మంత్రములు నిందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము

నారదుండు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము

రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపియించె
నంగ వింవె కృష్ణ మంత్ర మర్జునుండును
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరా నాధుండె
గురి పన్నిన దిదియె పర బ్రహ్మ మంత్రము
నన్నుగావ కలిగె బో నాకు గురు డియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము

Annamayya Keerthanalu - చందమామ రావో (Chandamama Ravo in Telugu)

చందమామ రావో జాబిల్లి రావో
మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో

నగుమోము చక్కని యయ్యకు
నలువ బుట్టించిన తండ్రికి
నిగమము లందుండే యప్పకు
మా నీల వర్ణునికి
జగమెల్ల నేలిన స్వామికి
ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి
మా ముద్దుల మురారి బాలునికి

తెలిదమ్మి కన్నుల మేటికి
మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకు
మా కతల కారి ఈ బిడ్డకు
కుల ముద్ధించిన పట్టెకు
మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి
నవ నిధుల చూపుల జూసే సుగుణునకు

సురల గాచిన దేవరకు
చుంచు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు
మా నీటు చేతల పట్టికి
విరుల వింటి వాని యయ్యకు
వేవేలు రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు
మా శ్రీ వేంకటేశ్వరునికి

Annamayya Keerthanalu - ఇందరికీ అభయంబు లిచ్చు చేయి (Indariki Abhayambu lichu Cheyi in Telugu)

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి

వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కల్కియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి
మొరసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి

పురసతుల మానముల పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరు వేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి

Annamayya Keerthanalu - అదివో అల్లదివో (Adivo Alladivo in Telugu)

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ

Annamayya Keerthanalu - తందనాన అహి (Tandanana ahi in Telulgu)

తందనాన అహి - తందనాన పురె
తందనాన భళా - తందనాన

బ్రహ్మ మొకటే పర - బ్రహ్మ మొకటే - పర
బ్రహ్మ మొకటే - పర బ్రహ్మ మొకటే

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర - అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే

అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే
దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే

Saturday, May 29, 2010

Annamayya Keerthanalu - మనుజుడై పుట్టి (Manujudai Putti)

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా

జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన

అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన

Annamayya Keerthanalu - ఎక్కువ కులజుడైన (Ekkuva Kulajudaina)

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు

వేదములు చదివియును విముఖుడై
హరిభక్తి యాదరించని సోమయాజి కంటె
ఏదియును లేని కుల హీనుడైనను
విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు

పరమ మగు వేదాంత పఠన దొరికియు
సదా హరి భక్తి లేని సన్యాసి కంటె
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు

వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు

Annamayya Keerthanalu - కొండలలో నెలకొన్న (Kondalalo Nelakonna)

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు

కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు

అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు

కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద
గరుణించి తన యెడకు రప్పించిన వాడు
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు

good blog for lyrics http://rashmi-sharmi.blogspot.in/2012/09/bantu-reethi-koluvusaamajavaragamanamar.html

http://rashmi-sharmi.blogspot.in/2012/09/bantu-reethi-koluvusaamajavaragamanamar.html

బంటు రీతి కొలువీయ వయ్య రామ

తుంట వింటి వాని మొదలైన

మదాదుల బట్టి నేల కూలజేయు నిజ
రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రామ నామమనే, వర ఖఢ్గమి
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే
           *******

సామజ వర గమన

సాధు హృత్-సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత
సామని గమజ – సుధా
మయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల
మామ్ పాలయ
వేదశిరో మాతృజ – సప్త
స్వర నాదా చల దీప
స్వీకృత యాదవకుల
మురళీవాదన వినోద
మోహన కర, త్యాగరాజ వందనీయ
            ********

మరుగేలరా ఓ రాఘవా!

మరుగేల – చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన

అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత
          *************

సాధించెనే ఓ మనసా

బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు
సాధించెనే ఓ మనసా

సమయానికి తగు మాటలాడెనే
దేవకీ వసుదేవుల నేగించినటు
సమయానికి తగు మాటలాడెనే

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు
సమయానికి తగు మాటలాడెనే

గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
సమయానికి తగు మాటలాడెనే

సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు
సమయానికి తగు మాటలాడెనే

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు
ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
సమయానికి తగు మాటలాడెనే

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి
కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ
సమయానికి తగు మాటలాడెనే

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన
పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన
సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను
సమయానికి తగు మాటలాడెనే

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన
కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు
సమయానికి తగు మాటలాడెనే

సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే
అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
సాధించెనే ఓ మనసా.. సాధించెనే
     ***************

జగదానంద కారకా

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
సదా సకల జగదానంద కారకా

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక
జగదానంద కారకా

నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ
జగదానంద కారకా

ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
జగదానంద కారకా

పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
జగదానంద కారకా

సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత
జగదానంద కారకా

సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత
జగదానంద కారకా

ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప
వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత
జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
జగదానంద కారకా

కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
జగదానంద కారకా

పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ
విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత
జగదానంద కారకా

అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ
నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
జగదానంద కారకా

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

Sunday 20 September 2015

http://vibhaataveechikalu.blogspot.in/

కార్తీక మాసము-

-తులసి పూజ కార్తీక మాసము--తులసి పూజ కార్తీక మాసమంతా పరమ పుణ్యప్రదము. ఇందులో అతి ముఖ్యమైనవి కార్తీక శుక్ల ద్వాదశి , పౌర్ణమి మరియూ అమావాస్య. కార్తీక సోమవారాలు శివప్రీతి కరమైనవి అయితే ఏకాదశి , ద్వాదశులు విష్ణువుకు ప్రీతి పాత్రమైనవి . బిల్వపత్రములు శివుడికైతే , తులసీ దళములు , ఉసరి ఫలములు విష్ణువుకు. ఇంక కార్తీక మాసములో విడువ వలసినవి , నల్లావాలు , కందులు , మినుములు ,పెసలు , నువ్వుల నూనె మరియూ బహుబీజకములైన వంకాయలు , మెంతులు , మొదలగునవి. కార్తీకమాసములో కేశకర్తనము [ క్షవరము ] చేసుకొనరాదు. పూజా ప్రతీకగా విష్ణు సంబంధమైన సాలగ్రామము అగ్రగణ్యమైతే , పూజాద్రవ్యములలో తులసిది అగ్ర స్థానము. సాలగ్రామము లేనిదే పుణ్య తీర్థము లేనట్టే , తులసి లేనిదే పూజ లేదు. జంతువులలో గోవు , మనుషులలో జ్ఞాని , సస్యములలో తులసి ప్రత్యేకమైనవి. దేవతలు లేని ప్రదేశమే లేదు , భగవంతుడు లేని చోటే లేదు. అయినా , సకల దేవతలు వెలసిన చోట్లు రెండే రెండు. ఒకటి గోవు , రెండు తులసి. తులసిలో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రములు , గంగాది సకల తీర్థములు కూడా ఉన్నాయని పురాణములలో వర్ణించబడినది. చరించు దేవాలయం గోవైతే , సస్యరూపమైన దేవాలయమే తులసి. తులసి అంటేనే ’ తులనము లేని సస్యము ’ అనగా , దేనితోనూ సమానము కాని సస్యము. తులసికి అధిదేవత సాక్షాత్తూ మహా లక్ష్మియే ! తులసి గురించి , " తులస్యుపనిషత్ " అను యొక ఉపనిషత్తే ఉన్నతర్వాత , తులసి మాహాత్మ్యము ఎంత గొప్పదో అర్థము చేసుకోవచ్చు. మహాలక్ష్మి సాన్నిధ్యము వల్లనే తులసి కూడా ఐశ్వర్యప్రదమైనది. పద్మ పురాణము , స్కంధ పురాణము , బ్రహ్మాండ పురాణము మొదలగువాటిలో తులసి మహిమ కీర్తించబడినది. యే దానము చేయవలెనన్నా తులసి ఉండవలెను. జపతపములు పూర్ణముగా ఫలించవలెనంటే తులసిమాల అత్యావశ్యకము. తులసి ఎక్కడుంటే అక్కడే విష్ణువు సన్నిధానముండును. తులసి మాలలేకున్నచో ఒక ఆకైనా చాలు. తులసీ కాష్టము కూడా శ్రేష్టమే. తులసి ఎండిపోయి ఉన్ననూ యే దోషమూ లేదు. అనివార్యమైనపుడు , నిర్మాల్య తులసిని కూడా మరలా కడిగి , పూజకు ఉపయోగించవచ్చును. అథమ పక్షము తులసీ నామమును జపించినా విశేష ఫలమే. ఈ తులసి , దర్శనమాత్రము చేతనే సకల పాపములనూ పరిహరించును. స్పర్శనము చేత శరీరమును పావనమొనరించును. నమస్కారము చేత రోగములను పోగొట్టును, తులసినీటిని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రమున మృత్యు భయమును పోగొట్టును , తులసి మొక్కను ఇంటిలో పెంచుకొనుట వలన కృష్ణ భక్తిని పెంపొందించును. శ్రీహరి పాదార్పణము చేసినంతనే ముక్తి ఫలము దొరకును. ఈ తులసి , రాక్షస శక్తులను కూడా నశింపజేయగల పరిణామకారి. ఆ కారణమువల్లనే పురాణములన్నీ , ’ సదా తులసి ఇంటియందు ఉంచుకోతగినది ’ యని ఘోషిస్తాయి. ఈ తులసికి పురాణములలో అనేక నామములు గలవు. తులసిని బృందావనములో పెంచి పూజించుటవలన విశేష పుణ్యము దొరకును. కార్తీక పౌర్ణమినాడు తులసి ప్రాదుర్భవించినది కాబట్టి ఆ దినమే తులసీ జయంతి. ఆ దినము తులసిని భక్తితో పూజించువారు సకల పాపములనుండీ ముక్తిని పొంది విష్ణులోకాన్ని చేరగలరని బ్రహ్మ వైవర్తస పురాణము తెలుపుతుంది. కార్తీకమాసము తులసి జన్మ మాసము కాబట్టే ఆ మాసములో తులసి పూజకు అంత ప్రాముఖ్యము. ఉత్థాన ద్వాదశి నాడే తులసీ వివాహమైన పుణ్యతిథి. ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసీదళాన్ని సమర్పించవలెను. సాయంత్రము , తులసి సాన్నిధ్యములో ధ్వజపతాక రంగవల్లుల అలంకారము గావించి , దామోదర రూపుడైన ఆ శ్రీహరిని పూజించాలి. తోరణములతో శోభించే మంటపమునేర్పరచి , ముత్యాల మాలలతో అలంకృతమైన సింహాసనములో దామోదర మూర్తిని పంచరాత్ర విధానముతో భక్తితో పూజించవలెను. మనోహరములైన రకరకాల పూలమాలలతోను , అనేక విధములైన రత్నములతోను , అసంఖ్యాకమైన నేతిదీపాలతోను శ్రీహరిని ఆరాధించవలెను. పాలు , వెన్న , పెరుగు , నేయిలను , వాటితో చేసిన పంచ భక్ష్యాలను , సుగంధ ద్రవ్య పూరితమైన జలములను , లవంగ సహితమైన తాంబూలమును , దక్షిణతో పాటు సమర్పించవలెను. పరిమళభరితములైన వివిధ పుష్పాలతో సమర్చించవలెను. తులసీ దళములచేతను , ఉసరిక ఫలముల చేతను , పూజింపవలెను. ఉసరికలు మహా విష్ణువుకు ప్రీతి పాత్రమే కాదు , సర్వ పాపములనూ పరిహరించగలదు. అందుకే , ఉసరి చెట్టు నీడలో పిండదానమాచరించినవాని పితరులు మాధవుని అనుగ్రహము వలన ముక్తి పొందుతారు. కార్తీకమాసములో శరీరం నిండా ఉసరిఫలాల గుజ్జును పూసుకొని , ఉసరికాయలతో అలంకరించుకొని , ఎండిన ఉసరి ఫలాలను ఆహారముగా స్వీకరించిన నరులు నారాయణులే అవుతారు. ఉసరి చెట్టు నీడలో విష్ణువును అర్చిస్తే వారు అర్పించిన ప్రతి పుష్పం వల్లనూ అశ్వమేధ ఫలం లభిస్తుంది. కార్తీక మాసములో ధాత్రీ వృక్షములు[ ఉసరి చెట్లు ] గల వనములో విష్ణువును చిత్రాన్నములతో సంతోషపరచి , బ్రాహ్మణులను భుజింపజేసి , తాము భుజించాలి. కార్తీక మాసములో రోజు విడచి రోజు మూడు రాత్రులు ఉపవాసము చేసిన కానీ , ఆరు , పన్నెండు , లేదా పక్షము రోజులు లేదా నెలరోజులూ , ఒంటిపూట భోజనము చేసి గడపినవారు పరమపదాన్ని చేరుకుంటారు. ప్రతి సాయంకాలమూ ఇంటి బయట నువ్వులనూనెతో ఆకాశదీపమును పెట్టవలెను. చతుర్దశి , అమావాస్యలలో ప్రదోషకాలపు దీపము పెట్టటం వలన యమ మార్గాధికారులనుండీ విముక్తుడౌతాడు. కృష్ణ చతుర్దశి యందు గోపూజ చేయాలి. కార్తీక పౌర్ణమిలో దేవాలయములలో దీపాలు పెట్టాలి. పురుగులు , పక్షులు , దోమలు , వృక్షములు, మరియూ నీటిలోను , భూమియందు తిరుగుతున్న జీవులూ-- ఈ దీపాలను చూస్తే తిరిగి జన్మను పొందవు. చండాలులు , విప్రులూ కూడా ఈ దీపాలను చూస్తే మరుజన్మను పొందరు. కార్తీకమాసమందు కృత్తికా నక్షత్రము రోజున కార్తికేయుని దర్శనము చేసుకున్నవారు ఏడు జన్మలు విప్రులౌతారు. ధనవంతులూ , వేదపారగులూ అవుతారు. [ ఈ నెల ఎనిమిదవ తేదీ నాడు కృత్తికా నక్షత్రము.. మధ్యాహ్నము వరకూ ] కార్తీకమాస నియమాలను పాటించి సర్వులూ శుభములను , సుఖములను పొందెదరు గాక. || శుభం భూయాత్ ||
 
http://vibhaataveechikalu.blogspot.in/

రజస్వలా ధర్మాలు.
 రజస్వలా ధర్మాలు.
            ఈ కాలములో అంటు , ముట్టు అనేవి ఎవరికీ అర్థము కావు. అర్థమయినవారు , తెలిసిన వారు అనేకులు వాటిని పాటించడము లేదు. అదంతా ఒక మూఢ నమ్మకమనీ , అశాస్త్రీయమనీ , ఇంకా రకరకాలుగా హేళన చేసేవారు పుట్టుకొచ్చారు.. మతమార్పిడులకు ఇది కూడా ఒక కారణమట ! అనాదిగా అన్ని మతాలవారూ దీన్ని పాటిస్తున్నారు, అయితే సనాతన ధర్మములో మాత్రము ఇంకా కొద్దో గొప్పో ఇది మిగిలి ఉంది. అంటు , ముట్టు లను గురించిన నేటి శాస్త్రీయమైన / అశాస్త్రీయమైన అవగాహన ఏమిటి అన్నది అటుంచితే , అసలు మన సనాతన ధర్మము దీన్ని గురించి యేమంటున్నది అని తెలుసుకోవడము ముఖ్యము. సనాతన ధర్మములో అంటు , ముట్టు అనేవే లేవని మిడిమిడి జ్ఞానముతో వాదించే పండిత పుంగవులు కూడా పుట్టుకొచ్చారు. కృష్ణ యజుర్వేదము రెండో కాండలో ఐదో ప్రశ్న చాలాభాగము దీనిగురించే వివరిస్తుంది. అందులో ఈ ఉదంతము ఉంది, దీనికన్నా ముందు , ఋగ్వేదపు ( 1-20-6 ) సూక్తము నొకదాన్ని చూద్దాము, ద్వాదశాదిత్యులలో ఒకడైన " త్వష్ట " ను ’ విశ్వ కర్మ ’ అని కూడా అంటారు. ఇతడే దేవ శిల్పి. ఇతడు కశ్యప ప్రజాపతి ( మానస ) పుత్రుడు .ఋగ్వేదము ఇతడిని బ్రాహ్మణుడు అంటే , యజుర్వేదము ఇతడిని ప్రజాపతి యనీ , అథర్వణ వేదము పశుపతి యనీ , శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకారము రుద్రశివుడనీ వర్ణిస్తాయి. ప్రహ్లాదుడి కుమార్తె , ’ రచన ’ ఇతడి భార్య. వీరి పుత్రుడు " విశ్వరూపుడు " ఇతడికి మూడు తలలుండుట చేత , " త్రిశీర్షుడు " అంటారు. ఈ విశ్వరూపుడు , ప్రహ్లాదుడి దౌహిత్రుడు కాబట్టి , రాక్షస పక్షపాతి అని పేరు, అయితే కొంతకాలము దేవతల పురోహితుడుగా ఉన్నాడు. అతడి మూడు తలలలో ఒకతలతో సోమపానము చేసేవాడు , ఇంకొక తలతో సురాపానమూ , మూడో తలతో అన్న భక్షణమూ చేసేవాడు. పురోహితుడిగా యాగములు చేయించేటప్పుడు , దేవతలకు హవ్యభాగాన్ని ప్రత్యక్షంగా ఇప్పించేవాడు , అయితే , రహస్యంగా రాక్షసులకు కూడా హవ్యభాగాన్ని ఇప్పించేవాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు , ’ ఇతడు దేవలోకాన్ని రాక్షసుల పరం చేయవచ్చు’ నని బెదరినాడు. కాబట్టి , స్వామిద్రోహి , దేవ ద్రోహి యైన విశ్వరూపుడి మూడు తలలూ తన వజ్రాయుధముతో నరికివేస్తాడు. ( సోమపానము చేయు తల ’ కపింజలము’ అను పక్షిగాను , సురాపానము చేయు తల గుడ్లగూబ గాను , అన్నము తిను తల , ’ తిత్తిరి పక్షి ’ గాను రూపాంతరము చెందుతాయి ) ఆత్మ జ్ఞాని యైన ఇంద్రుడికి దుష్ట శిక్షణ చేసినందువల్ల , బ్రాహ్మణ హత్య పాపము కాదని తెలుసు. అయినా సామాన్యులకు జనాపవాద నివృత్తి చేయుట ఎలాగ అన్న విషయము తెలుపుట కోసము , ఇలా చేస్తాడు. ధర్మ దేవతల ఎదురుగా తన అంజలితో బ్రహ్మ హత్యా పాపాన్ని స్వీకరిస్తాడు. తాను తప్పుచేయలేదన్న భావనతో ఆ పాపాన్ని ఒక సంవత్సరము భరిస్తాడు. అయితే సృష్టిలోని ప్రాణులన్నీ , ఇంద్రుడిని " బ్రహ్మ హత్య చేసినవాడు " అని ఆక్షేపిస్తాయి. కాబట్టి , సామాన్యుల దృష్టిలోకూడా దాని నివృత్తి కోసము బ్రహ్మ హత్యా పాపాన్ని ఇతరులకిచ్చి , తీసుకున్నందుకు ప్రతిగా వారికి వరాలను ఇవ్వాలనుకుంటాడు. మొదట , భూదేవిని ప్రార్థించి , తన పాపములో మూడో భాగాన్ని తీసుకోమని కోరుతాడు. భూమి , వరాన్ని ఇలా అడుగుతుంది , " జనులు నన్ను త్రవ్వేటప్పుడు నేను పీడను అనుభవిస్తాను , దానివలన నాకు హింస కలుగుతుంది. కాబట్టి , నాకు వ్యథ తెలియకుండా , హింస కలుగకుండా చూడు " . ఇంద్రుడు దానికి సమ్మతించి , జనులు భూమిని త్రవ్వేటప్పుడు భూమికి నొప్పి కాకుండానూ , అంతేకాక, ఆ త్రవ్విన చోట ఒక సంవత్సరములోపల దానికదే పూడుకొనే లాగానూ వరమిచ్చి , పాపపు మూడో భాగాన్ని వదిలించుకుంటాడు. బ్రహ్మ హత్యా పాపం తో కూడుకొన్నది కావున తనకుతానుగా పూడుకొన్న అటువంటి బంజరు భూమిని ఎవరూ నివాసము కోసమూ , యాగముల కోసము ఉపయోగించరాదు. తర్వాత ఇంద్రుడు, వృక్షములను , సస్యములనూ ప్రార్థించి , బ్రహ్మ హత్యా పాపంలో ఇంకో భాగాన్ని తీసుకొమ్మని కోరుతాడు. అప్పుడా సస్యజాలము , "జనులు మమ్మల్ని కత్తరించుటవలన మేము నశిస్తుంటాము, కాబట్టి మేము నాశనము కాకుండా వరమియ్యి " అని అడుగుతాయి. ఇంద్రుడు ఒప్పుకుని , " నరికినచోట అనేక చిగుళ్ళు మొలవనీ " అని వరమిచ్చి , పాపపు రెండో భాగం వదిలించుకుంటాడు. అందుకే , చెట్లను కొట్టివేస్తే అక్కడే అనేక చిగుళ్ళు పుట్టుకొస్తాయి. అయితే , అది బ్రహ్మ హత్యా పాపంతో కూడుకున్నది కాబట్టి , ఆ కొట్టివేసిన చోట , గట్టియైన రసము ( బంకపాలు లేదా జిగురు) కారుతుంది. కాబట్టి ఆ రసమును తాగరాదు. ( కల్లు వచ్చేది ఇలాగే , అందుకే కల్లుతాగుట నిషేధము. ) కాబట్టి , ఎరుపు రంగుతో ఏదైతే కారుతుందో , లేక , కొట్టివేసిన చోటే బయటికి కారుతుందో , అది తినుటకు యోగ్యము కాదు. అయితే , కొట్టివేయకుండానే కారే రసాలకు ఈ నిషేధము లేదు. ఆ తర్వాత , మిగిలిన బ్రహ్మ హత్యా పాపంలోని మూడోభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు , స్త్రీ సమూహాలను కోరుతాడు. అప్పుడు స్త్రీలు , " నిషిద్ధ దినములలో పురుష సంయోగము వల్ల కలిగే దోషము లేకుండా , దానివలన గర్భమునకు హాని కలుగకుండా వరమునియ్యి " అని అడుగుతారు. ( పురుష సంయోగము కేవలము సంతాన ప్రాప్తికే అయిననూ , ప్రసవము వరకూ , ఇచ్చానుసారముగా పురుష సంయోగమును యే దోషమూ లేకుండా పొందుటకు యోగ్యతను పొందుతారు ) ఆ వరము వలన , ప్రథమ రజోదర్శనముతో మొదలు పెట్టి , ఋతుకాల సంబంధమైన వీర్య సంయోగము వలన సంతానము పొందుతారు , ప్రసవము అయ్యేవరకూ , ఇచ్చానుసారము పురుష సంయోగము పొందే శక్తిని పొందుతారు. అయితే , అది బ్రహ్మహత్యా సంబంధమయినది కాబట్టి , ఆ పాపము స్త్రీల రజోరూపమైనది. అనగా రజస్సును అంటిపెట్టుకొని ఉండును.           
రజస్వల అయిన స్త్రీ మలిన వస్త్రములను ధరించినదానితో సమానము. అట్టి రజస్వలతో ఎవరూ సంవాదములు చేయరాదు. పక్కన కూర్చొనరాదు. ఆమె ముట్టిన అన్నమును తినరాదు. బ్రహ్మ హత్యారూపాన్ని శరీరం లో ధరించినది కావున , స్త్రీలకు ప్రియమైన అభ్యంగనాది తైలములను రజస్వలలు తీసుకోకూడదు. సౌందర్య సాధనములను వాడరాదు. ( ఇతర వస్తువులను తీసుకొన వచ్చును ) ముఖ్య నియమములు :- ఎవడైతే రజస్వలతో సంయోగిస్తాడో , ఎవడైతే ఆ సంయోగము వలన పుట్టునో , వాడు నీలాపనిందల పాలై కష్టములనుభవిస్తాడు. అడవిలో రజస్వలతో సంయోగఫలముగా పుట్టినవాడు , దొంగ అవుతాడు. సిగ్గుతోగానీ , భయం తోగానీ , నిరాకరించిన స్త్రీని ఎవరైనా కూడితే , ఆమెకు పుట్టువాడు , సభలలో మాట్లాడుటకు సిగ్గుపడి , తలవంచుకొనెడు పుత్రుడు అవుతాడు యే రజస్వల అయితే స్నానము చేస్తుందో , ఆమెకు , నీటిలో మునిగి చనిపోగల సంతానము కలుగును ( రజస్వలలు ఆ మూడు రోజులూ స్నానము చేయరాదు) యే రజస్వల అభ్యంగన స్నానము చేస్తుందో , ఆమెకు కుష్టు రోగము , చర్మ రోగములు కల సంతానము కలుగును. యే స్త్రీ అయితే గోడలమీద బొమ్మలు వేస్తుందో , ఆమెకు కేశములు లేని , బట్టతల కలుగువారునూ , దుర్మరణము / అకాల మరణమునకు పాలగువారు పుడతారు. ఎవతె కంటికి కాటుక పెట్టుకొనునో , ఆమెకు , కళ్ళులేనివారు , నేత్రరోగులు పుడతారు. ఎవతె , దంతధావనము చేయునో ( వేపపుల్లతో ) ఆమెకు పాచి పళ్ళు , పుచ్చుపళ్ళు కలవారై పుడతారు. యేస్త్రీ గోళ్ళను కత్తరించుకొనునో , ఆమెకు వికృత గోళ్ళు కలవారు పుడతారు. యేస్త్రీ గడ్డి కోస్తుందో , చాపలల్లుతుందో , ఆమెకు నపుంసకులు పుడతారు. ఎవరైతే పగ్గములను ( తాళ్ళను ) పేని తయారు చేస్తారో , ఆ స్త్రీలకు ఉరిపోసుకొని చచ్చువారు పుడతారు. యేస్త్రీ ఆకులతో నీరు తాగునో , ఆకులలో భోజనము చేయునో , ఆమెకు ఉన్మాదులు / పిచ్చివారు పుడతారు. ఎవరైతే అగ్నిలో కాల్చిన మట్టికుండలలో నీరు తాగుతారో , ఆమెకు మరుగుజ్జులు ( పొట్టివారు ) పుడతారు. ఈ నియమాలు మూడురాత్రుల కాలము ముగియువరకూ పాటించవలెను. పచ్చికుండలలో , పచ్చి మూకుడులలో నీళ్ళు తాగడము , భోజనము చేయడము చేయవచ్చును. ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ సంతానము కలుగును. ఇతరులకు కామోద్రేకము కలుగులాగ ప్రవర్తించరాదు. ఈ నిషిద్ధ కార్యములకు ఫలము అరిష్టమే కాబట్టి , అరిష్టము తెచ్చు యే పనినీ చేయరాదు. శ్రద్ధాళువులు సనాతన ధర్మపు సాంప్రదాయములను , ఆచారములను పాటించి శుభమును పొందెదరు గాక . 

 సంప్రదించిన గ్రంధములు : కృష్ణ యజుర్వేద భాష్యము , Encyclopedia of Hinduism , బోధివృక్ష --కన్నడ వార్తా పత్రిక , పురాణ భారత కోశము Posted by Janardhana

 http://vibhaataveechikalu.blogspot.in/

పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత

  పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత పంచగవ్యము అంటే గోవు నుండీ లభించే అయిదు పదార్థాలతో చేసిన ఒక లేహ్యము వంటిది. అవి , ఆవుపాలు , ఆవుపాలు తోడుపెట్టిన పెరుగు , ఆవు వెన్నతో చేసిన నెయ్యి , గోమూత్రము మరియు గోమయము. ఈ అయిదింటినీ ఒక ప్రత్యేక నిష్పత్తిలో ఆయా మంత్రాలతో అభిమంత్రించి కలిపి , చేసిన ద్రవమునే పంచగవ్యము అంటారు. సనాతన ధర్మములో గోవుకున్న ప్రాముఖ్యత , గౌరవము , విలువా అంతాఇంతా కాదు. వేదములో అనేకచోట్ల , ’ గోబ్రాహ్మణ ’ అన్న పదము తరచూ వస్తుంది. బ్రాహ్మణుల , గోవుల హితము కొరకు పనిచేయుట చాలా పవిత్రమైన కార్యము. గోవులను పూజించుట వేలయేళ్ళ నుండీ వాడుకలో ఉంది.. అనేకులు ఋషులతో పాటు , భగవంతుని అవతారాలయిన శ్రీ కృష్ణుడు , శ్రీ రాముడు వంటి వారు కూడా గోపూజను చేసినవారే.. అట్టి గోవునుండీ లభించు పదార్థాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మానవుడు చేసే అనేక పాపాలలో , పొరపాట్లలో ఎన్నింటికో , సనాతన ధర్మశాస్త్రములలో అనేక ప్రాయశ్చిత్తాలు విధింపబడినవి. పంచ గవ్యము యొక్క ప్రాశన ( తాగుట ) వాటిలో ఒకటి. దీనిని బట్టే గోవులకు గల ప్రాశస్త్యము ఎట్టిదో తెలుస్తున్నది. ఒక కపిల గోవు ( ఎర్రావు )పాల నుండీ చేసిన పంచగవ్యము ఇంకా ఫలవంతమైనది.

 

 పంచగవ్య పదార్థాలను కలపవలసిన నిష్పత్తి ఈ క్రింది విధముగా ఉండాలి.

:: గోక్షీరము ఎంత తీసుకుంటే , అంతే పెరుగు కూడా తీసుకోవాలి.. గోక్షీరములో సగము గోఘృతము ( ఆవు నెయ్యి ) , గోఘృతము లో సగము గోమూత్రము , గోమూత్రములో సగము గోమయము ( ఆవుపేడ ) ఈ పంచగవ్యాన్ని అనేక ప్రయోజనాలకోసము వాడతారు... * పాపనివృత్తియై , దేహము శుద్ధముగా ఉండుట కోసము పంచగవ్యమును స్వీకరిస్తారు.

 

, * యజ్ఞోపవీత ధారణ సమయములో శరీర శుద్ధి కోసము పంచగవ్యమును మొదట ప్రాశన చేస్తారు. * కొన్ని పూజలముందరకూడా పంచగవ్య ప్రాశన చేస్తారు...,

 * ఏదైనా ఒక శివలింగముకానీ , సాలిగ్రామము కానీ , రుద్రాక్షకానీ , లేక చిన్న విగ్రహముకానీ పూజగదిలో ఉంచి పూజించుటకు ముందు , వాటిని పంచగవ్యముతో మంత్ర సహితముగా అభిషేకము చేసి , ఆ తర్వాతనే పూజించాలి. పంచగవ్యమును

ఉపయోగించు విధము యే ప్రయోజనము కోసము పంచగవ్యమును వాడుతున్నామో , ఆ సంకల్పాన్ని మొదట చెప్పాలి,

 

ఉదాహరణకు , యజ్ఞోపవీత ధారణ సమయములో శరీర శుద్ధి కోసము చేస్తుంటే , మొదట ఆచమనము , ప్రాణాయామము చేసి , దేశకాల సంకీర్తనానంతరము , 1. "|| మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిధ్యర్థం , శరీర శుద్ధ్యర్థం , పంచగవ్య ప్రాశన -యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే || తదంగ పంచగవ్య మేళనం యజ్ఞోపవీత సంస్కారమహం కరిష్యే ||| అని చెప్పాలి. తర్వాత , పంచగవ్యము కలుపవలసిన పద్దతి :- ఒక అరిటాకులోగాని , పళ్ళెం లో గానీ శుభ్రమైన బియ్యం పోసి , దానిపైన స్వస్తిక గుర్తు వేలితో రాయాలి. ఆ గుర్తుపైన ఒక మట్టి పాత్రగానీ , ఇత్తడి లేక కంచు లేక వెండి పాత్రగానీ పెట్టి , దానికి తూర్పు దిక్కున అటువంటిదే ఒక చిన్న పాత్రలో గోమూత్రాన్ని ఉంచాలి. దక్షిణాన ఒక పాత్రలో గోమయమునుంచాలి. పశ్చిమాన వేరొక పాత్రలో ఆవుపాలను పోయాలి. ఉత్తరాన అటువంటిదే ఇంకో పాత్రలో ఆవుపెరుగు పోయాలి . మధ్యలోని పాత్రలో ఆవునెయ్యి పోయాలి. ఇవికాక , వాయవ్యములో ఒక పాత్రలో కుశోదకం పోయాలి ( దర్భలు ఉంచిన నీరు ) . ఇప్పుడు అన్ని పాత్రలలోనూ , ఆయా పదార్థాల అధిదేవతలను ఆవాహన కింది విధంగా చేయాలి తూర్పు పాత్రలో , || గోమూత్రే ఆదిత్యాయ నమః ఆదిత్యమావాహయామి || ( అని పలకాలి ) దక్షిణ పాత్రలో , || గోమయే వాయవే నమః వాయుమావాహయామి || పశ్చిమ పాత్రలో , || గోక్షీరే సోమాయ నమః సోమమావాహయామి || ఉత్తర పాత్రలో , || గోదధ్ని శుక్రాయ నమః శుక్రమావాహయామి || ( గో దధి అంటే ఆవుపెరుగు ) మధ్య పాత్రలో , || ఆజ్యే వహ్నయే నమః వహ్నిమావాహయామి || ( వహ్ని అంటే అగ్ని ) వాయవ్య పాత్రలో , || కుశోదకే గంధర్వాయ నమః గంధర్వమావాహయామి || ఇలాగ ఆవాహన చేసి , కుంకుమ , గంధము , పూలతో పూజించాలి, తర్వాత మధ్యలో ఉంచిన పాత్రలో , ఒక్కొక్క పదార్థాన్నీ కింది మంత్రాలతో కలపాలి ( మంత్రము పూర్తిగా ఇవ్వడము లేదు , వాటిని స్వరముతో పలుకవలెను. మంత్రము రానివారు , ఆయా దేవతలకు ఆయా పదార్థాలతో అభిషేకం చేసినట్లు భావించుకుంటూ ) మధ్యలోని పాత్రలోకి , గాయత్రీ మంత్రం పలుకుతూ గోమూత్రాన్ని , " || గంధ ద్వారే ...|| " అను మంత్రముతో గోమయాన్ని , "|| ఆప్యాయస్వ ...|| " అనే మంత్రంతో గోక్షీరాన్ని , "|| దధిక్రావ్‌ణ్ణో....|| " అనే మంత్రముతో పెరుగునూ , " || శుక్రమసి జ్యోతిరసి.... || " అనే మంత్రముతో నేతినీ , " || దేవస్యత్వా సవితుః .....|| " అనే మంత్రముతో కుశోదకాన్నీ కలపాలి. దర్భలు తీసుకొని , " || ఆపోహిష్ఠా ... || " అనే మంత్రముతో మధ్యపాత్రలో కలయబెట్టాలి " || మానస్తోకే తనయే ....|| " అను మంత్రముతో అభిమంత్రించి , అందులోకి మరలా గాయత్రీ మంత్రము చెబుతూ సూర్యుడిని ఆవాహన చేయాలి. తర్వాత పంచగవ్యానికి పంచమానసపూజలు చేయాలి ( లం పృథివ్యాత్మనే నమః .... ఇత్యాది ) మరలా వ్యాహృతులతో గాయత్రీ మంత్రం జపించి ,

 

  || యత్త్వగస్థి గతమ్ పాపమ్ దేహే తిష్ఠతి మామకే ( ఇతరులకోసం చేస్తుంటే , ’ తావకే ’ ) || ప్రాసనం పంచగవ్యస్య దహత్వగ్నిరివేంధనం ||

 

  అని పలికి , ఓంకారము పలికి , పంచగవ్యాన్ని ప్రాశనము చేయవలెను ( త్రాగ వలెను ) శరీర శుద్ధికోసము అయితే ఇంతవరకే.

 2. యజ్ఞోపవీత ధారణ కోసమయితే పైదంతా చేసి , తర్వాత రెండుసార్లు ఆచమించి , కొత్త యజ్ఞోపవీతాన్ని ఎడమ చేతిలో ఉంచుకొని , " || ఆపోహిష్ఠా ..|| . మంత్రముతో మొదలుపెట్టి సంధ్యావందనములోని మార్జన మంత్రాలన్నీ చెప్పవలెను. తర్వాత , ఉదకశాంతి మంత్ర పాఠము అయినవారు , "|| పవమానః సువర్జనః .... నుండీ మొదలుపెట్టి , "

|| జాతవేదా మోర్జయంత్యా పునాతు ...||. " వరకూ చెప్పి , యజ్ఞోపవీతాన్ని నీటితో అభ్యుక్షణము చేసి ( మూసిన పిడికిలితో నీళ్ళను ప్రోక్షించి ) మూడు తంతువులలోకి వ్యాహృతులను , దేవతలను ఆవాహన చేయాలి. ప్రథమ తంతౌ ఓం భూః ఓంకారమావాహయామి , ఓం భువః ఓంకారమావాహయామి , ఓం సువః ఓంకారమావాహయామి , ఓం భూర్భువస్సువః ఓంకారమావాహయామి ,అని వ్యాహృతులను ఆవాహన చేయాలి. తర్వాత , ద్వితీయ తంతి లోకూడా ‘అలాగే వ్యాహృతులను ఆవాహన చేయాలి తృతీయ తంతౌ అగ్నిమావాహయామి , నాగమావాహయామి , సోమమావాహయామి , పితౄనావాహయామి , ప్రజాపతిమావాహయామి , వాయుమావాహయామి , సూర్యమావాహయామి , విశ్వాన్దేవానాహయామి... అని పలికి , మూడు సూత్రములలోనూ , బ్రహ్మాణమావాహయామి, విష్ణుమావాహయామి , రుద్రమావాహయామి , అని ఆవాహన చేసి అక్షతలు వేసి పూజించాలి. తర్వాత , "|| స్యోనా పృథివి...... సప్రథా || " అని పలికి , యజ్ఞోపవీతా(ల)న్ని కింద భూమిపైన గానీ ఒక పళ్ళెములోగానీ పెట్టవలెను. "|| ఓం దేవస్యత్వా సవితుః ....హస్తాభ్యామాదదే || " అనే మంత్రముచెప్పి చేతిలోకి తీసుకొని , "|| ఉద్వయం తమసస్పరి....... జ్యోతిరుత్తమం || " అనే మంత్రాలను పలికి యజ్ఞోపవీతాన్ని ఆదిత్యుడికి చూపించవలెను. తర్వాత హృదయాది న్యాసములు చేసి , " ముక్తా విద్రుమ ... " ధ్యాన శ్లోకము చెప్పి , ఒక్కొక్క యజ్ఞోపవీతాన్నీ పది సార్లు గాయత్రీ మంత్రముతో అభిమంత్రించి , " || యజ్ఞోపవీతమిత్యస్య పరబ్రహ్మ పరమాత్మా త్రిష్టుప్ ఛందః | శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థే యజ్ఞోపవీత ధారణే వినియోగః || " || యజ్ఞోపవీతం పరమం ... తేజః ||" అని పలికి యజ్ఞోపవీతాన్ని ధరించవలెను. మరలా ఆచమించి , || అజినం బ్రహ్మ సూత్రం

చ జీర్ణం కశ్మల దూషితం | విసృజామి సదా బ్రహ్మవర్చో దీర్ఘాయ్తురస్తు మే || అని పాత యజ్ఞోపవీతాన్ని తీసివేయవలెను. || అనేన మయాకృత పంచగవ్య ప్రాశన- యజ్ఞోపవీత ధారణ విధి కర్మణా శ్రీ పరమేశ్వరః ప్రీయతాం || మళ్ళీ ఆచమనము చేయాలి. 3. కొత్త శివలింగము , సాలిగ్రామము , విగ్రహము , రుద్రాక్ష మొదలగునవి మొదటిసారి ధరించుటకు ముందు , పైన చెప్పినట్లే పంచగవ్య మిశ్రణము చేసి , ఆ మిశ్రణముతో " పవమానస్సువర్జనః ..." అనే మంత్రములతోను , మలాపకర్షణ మంత్రములతోను , అభిషేకము చేయవలెను. తర్వాతనే వాటిని ఉపయోగించవలెను. 4. పంచగవ్యపు ప్రయోజనాలు ఇంకా చాలానే కలవు. వాటిలో ముఖ్యమైనది , ఇంట్లో అంటు , ముట్టు పాటించుటకు వీలు కాకపోతేనో , అంటు కలసిపోతేనో , ప్రతిరోజూ కానీ , నాలుగవ రోజుకానీ ఈ పంచగవ్య ప్రాసనము చేయాలి. చివరిగా , పంచగవ్యముతో క్రిమి నివారకాలను కూడా తయారు చేస్తారు || శుభం భూయాత్ ||

 http://vibhaataveechikalu.blogspot.in/



   ఉపాకర్మ ఉపాకర్మ అనగా ,

 " ఉపక్రమణ కర్మ " ( ఆరంభించుట ) ప్రాచీన కాలములో , వేదాధ్యయనము చేయు బ్రహ్మచారులు గురుకులం లో నివశిస్తూ ఉండేవారు. వేదాధ్యయనము సంవత్సరము పొడగునా ఉన్నా , మధ్య మధ్యలో కొంత వ్యవధి ఉండేది.. ఆ వ్యవధిలో వారు తమ ఇళ్ళకు వెళ్ళిరావడమో , లేక ఆచార్యుని ఇంటనే ఇతరపనులు చూసుకోవడమో చేసేవారు. వేదాధ్యయనమును తాత్కాలికముగా నిలిపివేయడము , తర్వాత మళ్ళీ మొదలుపెట్టడము అన్నవి గొప్ప ఉత్సవాలు. ఈ రెంటినీ మంత్రపూర్వకముగా , సంస్కారపూర్వకముగా , గృహ్యసూత్రానుసారము ఆచరిస్తారు. వేదాధ్యయనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని " ఉత్సర్జనము " అనీ , నిలిపిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టడాన్ని " ఉపాకర్మ " అని అంటారు. రెంటినీ కలిపి ఉత్సర్జనోపాకర్మ అంటారు. ఈ ఉపాకర్మను ఆచార్యుడు శిష్యులతో పాటూ ఏదైనా నదీతీరములో ఆచరించుట శ్రేష్ఠమని చెప్పబడినది. కొన్ని సమయాల్లో నదులకు దోషాలుంటాయి.. అప్పుడు ఆ సమయాల్లో నదీస్నానము వంటివి చేయరు. కానీ ఉపాకర్మ నాడు నదులలో ఎట్టి దోషమున్ననూ అది దోషము కాదు అని గార్గ్యోక్తి. విద్యార్థులు ఆనాడే వపనము చేయించుకొనవలెను. వారికి కూడా వపనము నకు చూడవలసిన తిథివార దోషములు ఆనాడు వర్తించవు. ఉత్సర్జనము ఉత్సర్జనములో భాగముగా , దర్భలతో చేసిన కూర్చలలో కాండఋషులను ఆవాహన చేసి , షోడశోపచార పూజచేసి , తర్పణము ఇచ్చి , ప్రతిష్టిత అగ్నిలో షట్పాత్ర ప్రయోగపూర్వకముగా నవకాండ ఋషులకు , చతుర్వేదాలకు హోమము చేసి హవ్యమునర్పిస్తారు. ఉపాకర్మ ఉపాకరణము ( ఉపాకర్మ ) అనేది కూడా రెండు రకాలు. ఒకటి అధ్యాయోపాకరణం , రెండోది కాండోపాకరణం. ఉపనయనము అయిన తర్వాత , వేదాధ్యయన ప్రారంభాన్ని అధ్యాయోపాకరణము అంటారు. అధ్యాయోపాకరణానికి ముందర , వేదములోని కాండఋషులకు హోమములు చేసి, ఆ తర్వాతనే అధ్యయనము చేయవలెను. కాండఋషులకు చేయు హోమాలనే కాండోపాకరణం అంటారు. యజుర్వేదులకు , కాండోపాకరణము అంటే , ప్రాజాపత్య , సౌమ్య , ఆగ్నేయ , వైశ్వ దేవ , మొదలుగాగల తొమ్మిది కాండముల ఋషులకు ( నవకాండ ఋషులు ) హోమము చేయుట. తర్వాత ఆయా కాండములను అధ్యయనము చేయవలెను. కాని , యజుర్వేదములో మంత్రాలు , ( సంహిత , బ్రాహ్మణము , ఆరణ్యకములలోని మంత్రాలు ) ప్రత్యేకముగా ఉండక అన్నీ కలగలసి ఉంటాయి. ఇలా కలగలసి ఉన్న మంత్రాల పాఠమును సారస్వత పాఠము అంటారు. కాండ పాఠానికి అనుగుణముగా , అదే క్రమములో సారస్వత పాఠము ఉండదు. ( అంటే , ఒక కాండ ఋషి కనుగొన్న మంత్రాలు అన్నీ ఆ కాండములోనే ఉండవు. మిగిలినవాటిలో కలగలసి ఉంటాయి ) కాబట్టి , కాండోపాకరణము ఎప్పటికప్పుడు కాక, అధ్యయనోపాకరణము తర్వాత , సర్వ కాండఋషి హోమము ( కాండోపాకరణము ) చేయుట రూఢియై ఉన్నది. కాబట్టి యజుర్వేద ఉపాకర్మలో భాగముగా , మొదట గణపతి పూజ , పుణ్యాహవాచనము చేసి , తర్వాత ఉత్సర్జనలో వలెనే , కాండఋషులను ప్రతిష్టించి, షోడశోపచార పూజ చేసి , తర్పణమునిచ్చి , షట్పాత్ర ప్రయోగము ద్వారా హోమము చేసి , బ్రహ్మముడిని విప్పిన యజ్ఞోపవీతమును హోమములో అర్పిస్తారు. అంతేకాక , నూతన యజ్ఞోపవీతాలకు పూజచేసి , దక్షిణలతో పాటు పెద్దలకు దానము చేసి , ఆశీర్వాదముపొంది , తర్వాత , తాముకూడా " శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధి " కోసము నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి , జయాది హోమములను , ( ప్రతి ముఖ్యమైన హోమములలోనూ ఈ జయాది హోమములు చేయుట తప్పని సరి ) , తర్వాత , హోమకాలములో సంభవించు అనేక లోపదోషములకు ప్రాయశ్చిత్తముగా ’ ప్రాయశ్చిత్త హోమము ’ చేసి , ప్రత్యేక మంత్రాలతో పూర్ణాహుతి చేసిన ఉపాకర్మ సమృద్ధి అవుతుంది. అనంతరము , గడచిన సంవత్సరంలో వేదాధ్యయనములోను , సంధ్యావందనాది అనుష్ఠానములలోను ,మరియు ఇతర వైదిక కర్మల దోషములు , లోపముల పరిహారము కోసము నువ్వులు , బియ్యపు పిండి , మరియూ నెయ్యి కలిపిన పురోడాశము ( హవిస్సు ) తో రెండుచేతులతోనూ " విరజా హోమము " ఆయా మంత్రములతో చేయవలెను. తర్వాత ’ బ్రహ్మ యజ్ఞము ’ చేసి , అగ్ని మరియు ఋషులకు నమస్కారములు చేయవలెను. బ్రహ్మచారులు " ఆయుర్వర్చో యశోబలాభివృధ్యర్థం " అని చెప్పుకొని ప్రాతరగ్ని కార్యము చేయవలెను. ఆచార్యుడిని , దక్షిణ , తాంబూల , నూతన వస్త్రములతో సత్కరించవలెను. నవకాండఋషులను విసర్జించి , పర్జన్య సూక్తముతో నదీనీటిలో విడువవలెను. మరునాడు , గాయత్రీ హోమమును కానీ , సహస్ర గాయత్రిజపము కానీ చేసి , పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించవలెను. ఇక , ఉత్సర్జనం ఎప్పుడు చేయాలి , ఉపాకరణం ఎప్పుడు చేయాలి ? గృహ్య సూత్రాల ప్రకారము , యజుర్వేదీయులు ఉత్సర్జనమును పుష్యమాసపు పౌర్ణమియందు చేయవలెను. ఋగ్వేదులైతే ఈ ఉత్సర్జనమును మాఘ పౌర్ణమి నాడు చేస్తారు. యజుర్వేదీయులు ఈ ఉపాకర్మను శ్రావణమాసపు పౌర్ణమి యందు , ఋగ్వేదీయులు శ్రావణ మాసములో శ్రవణ నక్షత్రము వచ్చిన దినమందు , సామవేదులు భాద్రపద మాసపు హస్తా నక్షత్రపు దినమందు ఆచరించుట వాడుకలో ఉంది. అయితే , ఉత్సర్జనమును పుష్యమాసములో ఒకసారి , తర్వాత ఉపాకర్మను శ్రావణములో ఒకసారి చేయుట అనుకూలము లేనివారు , ఉత్సర్జనమును కూడా ఉపాకర్మ నాడే , ఉపాకర్మకన్నా ముందుగా చేయుట ఆచారములో ఉంది. అయితే ఇలా చేస్తే ఉత్సర్జనము చేయుటకు కాలాతీతము అగును కాబట్టి , దానికి పరిహారముగా , మొదట పాహిత్రయోదశ హోమమును చతుష్పాత్ర ప్రయోగముతో ఆచరించవలెను. వేదాధ్యయనమును ద్విజులు అందరూ , వీరు వారు అనుభేదములేక చేయవలెను. ఈ కాలము , పౌరోహితులు మాత్రమే వేదాధ్యయనము చేయవలెను / చేస్తారు అన్న ఒక అపోహ చాలామందిలో ఉంది. అది సర్వథా అసత్యము. ప్రతి ఒక్క ద్విజుడూ వేదాధ్యయనము చేసి , క్రమం తప్పకుండా ఈ ఉత్సర్జన ఉపాకర్మలను ఆచరిస్తే , వారి జీవితాలు అద్భుతంగా అభ్యుదయ మార్గంలో పయనించి ధన్యులవుతారు. ప్రథమోపాకర్మ నూతనముగా ఉపనయనము అయిన వటువులు , ఉపాకర్మను ప్రథమముగా జరుపుకొనేటప్పుడు మొదట నాందీ పూజ చేయవలెను. బ్రహ్మచారులు యజ్ఞోపవీతానికి ఒక చిన్న కృష్ణ జింక చర్మపు ముక్కను తగిలించుకోవడము ఆనవాయితీ . దీనికి రెండు కారణాలు. ఒకటి , యజ్ఞాలలోను , బలులలోను కృష్ణాజినమును కప్పుకొనుట , కృష్ణాజినముపై కూర్చొనుట విహితమని చెప్పబడినది. అది ధరించిన వటువు , " ఈ దినము నుండీ నా జీవితము ఒక యజ్ఞము లేక త్యాగము వంటిది. నా జీవితాన్ని లోకకల్యాణమునకై అర్పించవలెను " అని భావించవలెను. రెండోది , కృష్ణాజినము వలన , చిత్తము నిర్మలమై , సాత్త్వికమైన ఆలోచనలు కలుగుతాయి. ఈ కాలము ఇవన్నీ కేవలము సూత్రప్రాయముగా మిగిలిపోతున్నాయి. కొందరు కేవలము యజ్ఞోపవీతము మార్చుకొనుటే దీని పరమార్థముగా భావిస్తున్నారు. ఉపాకర్మ ఎందుకు చేయవలెను , అందులోని ముఖ్యాంశాలేమిటి అన్నది మాత్రమే ఇక్కడ చర్చించడమైనది. ఉపాకర్మ పద్దతి , వివరాలతో , ఇంకోసారి. యజ్ఞోపవీత ధారణ విధి ఈ మధ్య విరివిగా పుస్తకాలలోనూ , అంతర్జాలములోనూ దొరకుతున్నందున ప్రత్యేకించి రాయలేదు. యజ్ఞోపవీతాన్ని , సూతకము తర్వాతా , ఉపాకర్మ సమయములోనూ , అలాగే ప్రతి నాలుగు నెలలకొకసారీ మార్చుకోవలెను.

Tuesday 24 February 2015

http://vibhaataveechikalu.blogspot.in/2015/02/blog-post.html
విభాత వీచికలు

 ఈ బ్లాగులో , సనాతన ధర్మము నకు సంబంధించిన వివిధ ఆచరణలు , ఇతర విశేషాలు , వివరణలు మాత్రమే ఉంటాయి.

                   Sunday, February 1, 2015 జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి గారి అనుగ్రహ భాషణము

                                     || శ్రీః || ముప్పై యేడవ శ్రీ శారదా పీఠపు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి గారు సన్యాసాశ్రమము తీసుకున్న తరువాత తమ మొట్ట మొదటి అనుగ్రహ భాషణమునిచ్చినారు. [ కన్నడ భాషణమునకు తెలుగు అనువాదము- పూర్తి పాఠము ] || శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే | సర్వదా సర్వదాఽస్మాకం సన్నిధిం సన్నిధిం కుర్యాత్ || || శ్రుతిః స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం | నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || || అజ్ఞానాంజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం | సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే || ఈ జగత్తులోనున్న సర్వ ప్రాణులకన్నా మనుష్యుడు అత్యంత శ్రేష్ఠమైనవాడు అని శాస్త్రములు చెపుతాయి. అయితే మనుషులమై పుట్టినంత మాత్రమునకే మనము కృతార్థులము కాలేము. దానిని, అంటే ఆ మనుష్య జన్మను మనము సార్థకము చేసుకోవలెను. మన జీవితానికి సార్థకత అనేది ఎప్పుడు కలుగునంటే , మోక్షమును పొందినపుడు మాత్రమే. మనుషుడై పుట్టినదానికి ఫలమేమిటి అంటే , మోక్షమును పొందుటే ఫలము . కానీ ఆ మోక్షమనేది అంత సులభముగా దొరికేది కాదు. దానికి మహాపురుషుల అనుగ్రహము అనేదొకటుండ వలెను. భగవంతుని కృప అనేది కూడా ఉండవలెను. ఎన్నో జన్మలలో చేసినట్టి పుణ్యము , పుణ్య విశేషమూ ఉండవలెను. అయితే ఈ మహాపురుషుల అనుగ్రహము అనేది అత్యంత దుర్లభమైనది. దీనినే శంకరాచార్యులు అంటారు , || దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం | మనుష్యత్వం , ముముక్షుత్వం , మహాపురుష సంశ్రయః || అని. మనుష్య జన్మ పొందుట , అలాగే , మోక్షమును పొందవలెనన్న తీవ్రమైన ఇఛ్చ ఉండుట , అట్లే , మహాపురుషుల సాన్నిధ్యము-ఇవన్నీ కావలెనంటే , భగవంతుని కృప అనేది మనకు ఉండే తీరవలెను. ఆ కృప ఉండుట వల్లనే మనకు ఈ మూడూ దొరకుతాయి. నాకు , ఆ మహాపురుషుల సంశ్రయము... అంటే సాన్నిధ్యము అనేది ఆ శారదామాత కృప వల్ల దొరికింది. అందులోనూ , మహాపురుషులు అనగా , సాక్షాత్తూ ఆది శంకరుల పరంపరలో వచ్చినట్టి , అలాగే ఆ ఆదిశంకరుల స్వరూపులైనట్టి జగద్గురువుల సాన్నిధ్యము అనేది నాకు లభించింది. వారి అనుగ్రహము నాకు దొరికింది. మొదటినుండీ కూడా నాకు ఆధ్యాత్మిక మార్గములో జీవనము గడపవలెను, నా జీవితాన్ని సార్థకము చేసుకోవలెను అనే ఇఛ్చ ఉండింది. అలాగే , శృంగేరీ జగద్గురువుల వద్దనే శాస్త్రాధ్యయనము చేయవలెను అన్న కోరిక కూడా ఉండేది. దానికై జగద్గురువులను ప్రార్థించినపుడు , వారు నామీద పరమానుగ్రహమును చూపి, న్యాయాది సర్వ శాస్త్రములనూ నాకు నేర్పించినారు. నామీద అపారముగా వారి కృప ఉండింది. వారు ప్రతీ క్షణమూ నా ఉన్నతినే కోరుచుండెడి వారు. ఈ దినము నాకు కలిగిన ఈ గొప్ప భాగ్యములో మాకు సొంతముగా యేదీ రాలేదు , అంతా కూడా ఆ జగద్గురు మహాస్వాముల అనుగ్రహము వల్లనే మాకు దొరికింది. నేనైతే ఇక్కడికి.. ఈ శృంగేరికి వచ్చినది, శాస్త్రాధ్యయనము కోసము మాత్రమే. అట్లే , ఆధ్యాత్మికముగనూ , శాస్త్రోక్తముగానూ జీవితము గడపవలెను అన్న కోరితోనూ వచ్చినాను. అయితే జగద్గురు మహాస్వాములవారు నన్ను పరిపూర్ణముగా అనుగ్రహించి వారి కరకమలములతోనే నాకు సన్యాసాశ్రమమును అనుగ్రహించినారు. తమ ఉత్తరాధికారిగా నన్ను స్వీకరిస్తాను అని వారు చెప్పినపుడు నాకు అవధులులేని ఆనందము కలిగింది. ఎందుకంటే సాక్షాత్తూ ఆ ఆది శంకరుల పరంపరలో వచ్చిన వారు , ఆ ఆదిశంకరుల స్వరూపులే యైనట్టి ఆ జగద్గురువుల అనుగ్రహము నాకు ఇంతగా దొరకడము , ఈ దినము నా జీవితము ధన్యమైనట్లే అని భావిస్తున్నాను. నన్ను తమ ఉత్తరాధికారిగా స్వీకరిస్తున్నామని వారు చెప్పినపుడు నేను అడిగినాను , " తమరు ఇంతటి బాధ్యతను నాపైనుంచినారే , దీనిని వహించుటకు నాకు సాధ్యమవుతుందా ? " అని. దానికి వారు మందహాసముతో అన్నారు , " దాని గురించి నువ్వేమీ ఆలోచించవద్దు , ఆ శారదామాత ప్రేరణతో నీ మీద నా అనుగ్రహము సంపూర్ణముగా ఉంది. అదొక్క దాని వల్లనే సర్వమూ సాధింపబడును " అని అన్నారు. అంటే , గురువుల అనుగ్రహము ఒక్కటీ ఉంటే చాలు , మనము దేనినైనా సాధించవచ్చును , అందులో యే సంశయమూ లేదు అన్నది నాకు బోధ పడింది. వారు నాపై ఇంతటి నమ్మకము , విశ్వాసమూ చూపుట కేవలము వారి అనుగ్రహ కటాక్షమే తప్ప నా గొప్పదనము ఏమీ లేదు. ఇదంతా కూడా ఆ జగద్గురు మహా స్వాములు నాకు అనుగ్రహించి ఇచ్చినదే. అట్లే , నా మీద ఉంచిన ఈ బాధ్యతను కూడా , వారి అనుగ్రహము చేతనే సమంజసముగా నిర్వర్తిస్తాను అని చెప్పతగినది. అలాగే, ఈ మఠపు ఉత్తరోత్తర అభివృద్ధికై కూడా , వారి అనుగ్రహ బలముతోనే నేను పరిశ్రమ చేయగలవాడను. ఇంతటి మహత్కార్యమునకు మీ అందరి సహకారము కూడా అవశ్యముగా కావలెను. మీరందరూ ఇంత సంఖ్యలో ఇక్కడికి వచ్చినారు , ఈ మఠము మీద , గురువుల మీద మీకందరికీ అపారమైన శ్రద్ధ ఉంది, ఈ శ్రద్ధా భక్తులను ఎల్లపుడూ ఇదేరీతిలో కొనసాగిచవలెనని ఈ శుభ సందర్భములో మీకందరికీ నా అభ్యర్థన. ఆ గురుభక్తే మనలను అత్యున్నతమైన స్థితికి తీసుకువెళ్ళగలదు అని చెప్పి , ఆ జగద్గురు చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములను అర్పిస్తూ , నా ఈ భాషణమును ముక్తాయిస్తున్నాను. [ కింది భాషణము వారు ముందటి దినము కొన్ని వార్తా పత్రికలకు ఇచ్చినది] || శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || భగవత్పాద శంకరాచార్యులు , " జంతూనాం నర జన్మ దుర్లభం " అన్నారు. అటువంటి నరజన్మను పొందిన తరువాత , మోక్షమును పొందుటే ముఖ్యమైన ధ్యేయముగా ఉండవలెను. ఆధ్యాత్మ సాధన యొక్క ముఖ్య ఉద్దేశము కూడా అదే అయి ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మ సాధనే ప్రతి యొక్కరికీ మొదటినుండీ చివరి వరకూ లక్ష్యముగా ఉండవలెను. మోక్ష మార్గమునకు సన్యాసాశ్రమమే శ్రేష్ఠమైన మార్గము. ఎందుకంటే సన్యాసికి ఎటువంటి బంధనాలూ ఉండవు. ఎట్టి అంతరాయములూ లేక పరమాత్ముని గురించి నిరంతరమూ ధ్యానము చేయుటకు అవకాశముంటుంది. అందువలన , సన్యాసమే ఉత్తమ మార్గమని నా భావన. గృహస్థాశ్రమములో ఆ అవకాశము లేదు. గృహస్థులకు కుటుంబ నిర్వహణా బాధ్యతలుంటాయి కాబట్టి సంపూర్ణముగా ఆధ్యాత్మ సాధనలో నిమగ్నమగుట సులభము కాదు. సన్యాసాశ్రమము తీసుకున్ననూ మోక్షమును పొందాలంటే గురువు యొక్క అనుగ్రహము అత్యంత అవసరమైనది. శంకరాచార్యులే వారి శిష్యులకు మహా వాక్యమును ఉపదేశము చేసినారు. ఇది పరంపరానుగతముగా వస్తున్నది. అటువంటి పరంపరలో వచ్చిన గురువులే నాకు సాక్షాత్తూ ఉపదేశము అనుగ్రహించుట , నా జీవితములో నేను పొందిన అతిపెద్ద సౌభాగ్యము . శ్రీ జగద్గురువులు నన్ను అనుగ్రహించుటలో నా గొప్పతనమేదీ లేదు. అది కేవలము వారి దయ. అట్టి గురువుల వద్ద శిష్యరికము చేయుట నా భాగ్యము. ఇది నేనేనాడూ ఊహించనిది. ఆరు సంవత్సరాల క్రిందట , శృంగేరికి వచ్చినపుడు , శాస్త్రాధ్యయనము చేయుట మాత్రమే నా ఉద్దేశము. అపుడు ఇంతపెద్ద బాధ్యత నాకు వస్తుందనీ , దానిని నేను తీసుకోవాలనీ అనుకోలేదు , కోరుకోలేదు. అయితే గురువుల సాన్నిధ్యము , వారి విశేషమైన అనుగ్రహము మరియూ వారు చూపిన మార్గ దర్శనము నన్ను మూక విస్మితుడిని చేసింది. వారు నాపై ఉంచిన నమ్మకము , బాధ్యతలను దైవానుగ్రహముగాను , దైవాదేశముగానూ తీసుకుంటాను. వారి అనుజ్ఞను పాలించుతున్నాను అన్న ఆత్మతృప్తి , సంతోషమూ నాకున్నాయి. గురుపాదుకాభ్యో నమః


 
http://www.iskcondesiretree.com/forum/topics/names-of-18-purans-and-upa-purans

The 18 puranas are--
  1. Vishnu Purana
  2. Naradiya Purana
  3. Padma Purana
  4. Garuda Purana
  5. Varaha Purana
  6. Bhagavata Purana
  7. Matsya Purana
  8. Kurma Purana
  9. Linga Purana
  10. Shiva Purana
  11. Skanda Purana
  12. Agni Purana
  13. Brahmanda Purana
  14. Brahmavaivarta Purana
  15. Markandeya Purana
  16. Bhavishya Purana
  17. Vamana Purana
  18. Brahma Purana
The upapuranas are--
1. Sanatkumara Purana
2. Narasimha Purana
3.Brihannaradiya Purana
4.Sivarahasya Purana
5.Durvasa Purana
6.Kapila Purana
7.Vamana Purana
8.Bhargava Purana
9.Varuna Purana
10.Kalika Purana
11.Samba Purana
12.Nandi Purana
13.Surya Purana
14.Parasara Purana
15.Vashishtha Purana
16.Devi Bhagavatam
17.Ganesha Purana
18.Hamsa Purana