Friday 6 April 2012

ధర్మ సూక్ష్మాలు ౫

నాగులచవితికి పుట్టలో పాలు పోస్తే సంతానం కలుగుతుందా?

కార్తీకశుద్ధ చవితినాడు, తర్వాత వచ్చే నాగపంచమి రోజు సంతానం కోసం నానబెట్టి మొలకెత్తిన ధాన్యములతోనూ, పాలతోనూ నాగపుట్టను పూజించి పాలు పోస్తారు. ఇలా చెయ్యటం భక్తితోపాటు, సంతానవంతులయ్యే విశేషం కూడా ఉంది. కొత్త ధాన్యముల ప్రసాదాన్ని స్వీకరించటము వల్లా, పుట్ట వద్ద పూజచేస్తూ స్పందించటంవల్ల, స్త్రీలలో నాడీమండలం ఉత్తేజం పొంది సంతానవంతులయ్యే అవకాశాలెక్కువ.

సుందరకాండాలో అరిష్టపర్వతమున్నదా?
...
పర్వతం పేరే అరిష్టం, దానిపై ఎక్కిన హనుమంతుడిని అదృష్టం వరించింది కదా మరి.

ఏ శివాలయంలో పూజ చేస్తే ఏ ఫలం?

శిధిలమవనున్న శివాలయంలో అభిషేకం చేస్తే మహామహిమాన్వితమైన జ్యోతిర్లింగంలో చేసిన అభిషేకానికి పదిరెట్లు ఫలం.
 
సంఖ్యాశాస్త్ర ప్రకారం పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలి?

ఆడపిల్లలకి బేసి సంఖ్యతో, మగపిల్లలకి సరి సంఖ్యతో వచ్చే పేర్లు పెట్టాలి.

ఏ సుగుణం ద్వారా ఏది సిద్ధిస్తుంది?
...
సామర్ధ్యం ద్వారా అధికారం, జ్ఞానం చేత వైరాగ్యం, దానం చేత కీర్తి, మర్యాద,వినయం ద్వారా సంపద లభిస్తాయి.
ప్రియమైన పలుకుల ద్వారా మంచి మిత్రులు, భక్తి ద్వారా భగవంతుని ఆశీర్వాదం అందుతాయి.

ఏ సంతానాన్ని దానమివ్వాలి?

పెద్ద కొడుకు తొలి సంతానం, దైవ సంతానం, చివరి కొడుకు జ్ఞాన సంతానం, కనుక మధ్య సంతానం కామసంతానం, కాన వాడిని దత్తత ఇవ్వాలి.

జననలోపాల నివారణకు మర్రి ఆకులలో భోజనం చేస్తే నయమవుతుబ్దా?

పుట్టుకతో వచ్చే జననలోపాలను సరిదిద్దే శక్తి ఒక్క మర్రి ఆకులలో ఉంది. గర్భిణీ స్త్రీలు ఈ ఆకులలో భోజనం చేయటం చాలా ఉత్తమం.

ఆత్మ ఎలాఉంటుంది?

తామర మొగ్గ ఆకారంలో ఉండే మన హృదయంలో వరికంకి గింజంత చిన్నదిగా, సన్నగా దివ్యకాంతితో, పసుపుపచ్చ వర్ణంతో అణువంతగా మహోజ్జ్వలంగా వెలిగిపోతుందని మంత్రపుష్పంలోని శ్లోకం ఆధారాంగా తెలుస్తోంది.

ఏ దేవాలయాలు ఏ దిశగా ఉంటాయి?
పరమేశ్వరుని ఆలయం ఈశాన్యదిశలో, శ్రీమహావిష్ణువు ఆలయం పశ్చిమ దిశలో, సకలజీవకోటికి అన్నప్రదాత సూర్య భగవానుడి ఆలయం తూర్పు దిశగా, దుర్గాదేవి అమ్మవారి ఆలయం ఉత్తరవైపుగా, అదే బ్రహ్మ ఆలయం నిర్మిస్తే నగరం మధ్యభాగంలో ఉంటుంది.