Thursday 3 October 2013

స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి

Bramhasri Samavedam Shanmukha Sarma

నవరాత్రులు రేపటి నుండి ప్రారంభమూ...అందరికి నవరాత్రుల శుభాకంక్షలు ....

విజయవాడలో దుర్గ అమ్మ మొదటి రోజున మనకి దర్శనం ఇచ్చే అలంకారం...

స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి

మనము విజయవాడ కనక దుర్గమ్మ స్వరూపములను ప్రమాణముగా తీసుకుంటు...
.....ఈ తొమ్మిది రోజులలో ఒకోక్క రోజు ఒక్క రూపములో మనము అమ్మని పూజిస్తాము..ఒకోక్క స్వరూపములో అమ్మ మనకి దర్శనము ఇస్తుంది...
విజయవాడలో దుర్గమ్మకి మొదటి రోజున స్వర్ణ కవచ అలంకౄత రూపముగా పూజిస్తాము...ఆ రూపము వెనుక ఉన్న కధ ను తెల్సుకుందాము...ఈ కధ ను నవరాత్రుల ప్రధమ రోజున ఎవరైన చదువుతునప్పుడు విన్నా, లేక చదివినా........అనంతమైన ఫలితాలు కలుగుతాయి...

దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు...ఆయన గొప్ప తపస్సు చేసాడు బ్రహ్మ గారి కోసము...బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యి..." ఎమి కావాలి నీకు అని అడిగారు..."నాకు వేదములు అన్ని కుడా వశము కావాలి " అని అడిగాడు..."దేవతలను నేను జయించాలి " అని అన్నాడు...అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు "తధాస్తు" అనగా వేదములు అన్నీ కుడా దుర్గముడు లోకి ప్రవేసించాయి...బ్రాహ్మణులుఅందరు వేదాలు మర్చిపొయారు...సంధ్యవందనాలు లేవు...హవ్విసులు లేవు..యగ్నాలు లేవు...యాగాలు లేవు.....దేవతలకి హవిస్సులు లేక ఆకలితో విలవిల లాడి పొయారు....నీటి చుక్క లేదు...తల్లి అనుగ్రహం లోపించి పోయింది...భూమండలం మీద అంతా వాతావరణం క్షీణి ంచిపోయింది...అందరు నాశనము అవుతుంటె ఆ దుర్గముడు చాలా సంతొషించాడు...హవిశ్శులు లేక దెవతల అందరు వ్రుద్ధులు లాగ మారిపోయి.....నీరస పడిపోతు...డీలా పడిపొయారు..

అప్పుడు...దేవతలు అందరు కలిసి అమ్మని ప్రార్థన చేసారు....అప్పుడు అమ్మ ప్రత్యక్షమైనది..అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మ స్వరూపమునకు " " శతాక్షి " అని పేరు..

అమ్మ దర్శనము ఇచ్చిన తీరు ఎలా ఉంది అంటే....ఒంటి నిండా కన్నులతో దర్శనం ఇచ్చింది...దేవతల ఆవేదన చూసి....అమ్మ అంది " మిమ్మల్ని చుడటానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను, మీకు ఎందుకు భయం" అని అభయం ఇచ్చింది....
బ్రతకాడినికి అన్నము, నీరు లెవూ అని దేవతలుచెప్పగా...అప్పుడు అమ్మ తన ఒంటి మీద ఉన్న నేత్రాలలో నుండి నీరు కరుణ రసముగా మొత్తం బ్రహ్మాండము అంతా నింపేసింది........అంతే మళ్ళి భూమండలం అంతా...అమ్మ కరుణకటక్షములతో నిండ్పోయింది........నూతులు, చెరువులు, నదులు అన్ని యధావిధిగా ప్రవహించసాగాయి...

అన్నములేక ఆకలిగా ఉంది అమ్మ , నిన్ను స్తుతి చెయ్యడానికి కుడా మాకు ఒపిక లేక ఉన్నాము అని దేవతలు అమ్మని ప్రాధేయపడగా.....అమ్మ అప్పుడు అందరికి " శాఖాంబరి దేవిగ " కనిపించింది..అనంత హస్తాలతో...
అసలు పృథ్వి శాకాంబరి దేవి కాదా....అలా అమ్మ ఆ రూపము దాల్చి అందరికి...పళ్ళు, కాయగూరలు...అన్ని ఇచ్చింది.....మళ్ళి హోమాలు, యగ్నాలు, యాగాలు మొదలు అయ్యాయి....

ఎంటి నీరసపడిపొయిన బ్రహ్మాండం అంతా మళ్ళి చిగురించుకుంది అని దుర్గముడు ఆలోచన చెయ్యగా.....అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది...అప్పుడు అమ్మ ఆ రాక్షసుడితో యుద్ధం చెయ్యలెదు..ముందు అందరికి రక్షణ చక్రం వేసి... .అప్పుడు పదకొండు రోజులు యుద్ధం చేసి...దుర్గముడి కన్నులు తీసి...అందరిని కాపాడుతు .....వేదములు తన లోనుండి...మళ్ళి ఆవిర్భావం అయ్యేటట్లు చేసి......దేవతలకు వాటి రక్షణ కార్యము అప్ప చెప్పింది ...అందుకే ఆ రక్షణ కవచం తో అమ్మ అందరిని కాపాడింది కనుక .....నవరాత్రుల్లో...అమ్మనిమొదటి రోజున..." స్వర్ణకవచ అలంకృత" రూపములో పూజిస్తాము.......

"ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతో రణే |
విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః || ”