Friday 3 January 2014

కాంచీపురం

కాంచీపురంలో ఆగ్నేయం వైపు ఉంటుంది విష్ణుకంచి. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి వరదరాజస్వామి ఆలయం. అంతేకాక కామాక్షీ మందిరంలో చోరవిష్ణువు అని ఉన్నాడు.ఆయన కూడ 108దివ్యక్షేత్రములలో ఒకడు. ఈ వరదరాజస్వామి ఆలయాన్ని విష్ణుకోటి, పుణ్యకోటి అని పిలుస్తారు. ఇంద్రుడు ఒకానొక శాపానికి గురై ఏనుగు రూపం ధరించి, తపస్సు చేసి శాపవిమోచనం పొందిన చోటు విష్ణుకంచి. ఏనుగు రూపాన్ని ఇక్కడ వదిలి దేవతగా మారి వెళ్ళి పోయిన ఆఏనుగు శరీరమే హస్తిగిరి అని కొండగా మారింది. ఆగిరిపై నారాయణుడు వెలిశాడు. నరసింహ మంత్ర ఉపాసన చేశాడు కనుక ఇంద్రుని గుండెల్లోనుంచి నరసింహస్వామి వెలికి వచ్చాడు. అందుకే హస్తిగిరి నరసింహస్వామి లోపల ఉంటాడు. పైన వరదరాజస్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడే బ్రహ్మ మహాయజ్ఞము చేశాడు. అక్కడ శుక్లుడు, హేముడు అనే వేదవేత్తలైన బ్రహ్మచారులుండేవారు. వీరిద్దరూ గౌతమ మహర్షి శిష్యులు. వారుభయులూ ఒకసారి గౌతమ మహర్షి ఆజ్ఞమేరకు సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళి అభిషేకం కోసం నదీ జలాలను కూడా తెచ్చుకున్నారు. తిరిగి వచ్చే సమయంలో ఒకచోట జలపాత్రను పెట్టి ఎండు కట్టెలు ఏరుతున్నారట. వారికి తెలియకుండా ఆచెట్టుమీద ఉన్న బల్లి ఈనీటిలో పడిందట. ఆనీటిని చూసి గౌతమమహర్షి మీరిద్దరూ బల్లులుగా పుట్టండి అని శపించారట. ఇంద్రుడు హస్తిరూపంలో తొండంతో వీరు ఉన్న కొమ్మని విరిచాడు. వీరిద్దరూ ఇంద్రునిపై పడ్డారు. ఇంద్రుని తపస్సు వల్ల వారిద్దరూ పవిత్రులై వారి దేహాన్ని విడిచిపెట్టి వారి వారి రూపాలకి వెళ్ళారు. అవే కాంచీపురంలో ఉన్న బల్లులు. మానవశరీరం హస్తిగిరి, ఇంద్రియాలు ఇంద్రుడు, బల్లులు ఇడ, పింగళ నాడులు. ఇక్కడ విష్ణ్వారాధన చేస్తే కోటి పుణ్యములు లభిస్తాయి.
కాంచీపురంలో ఆగ్నేయం వైపు ఉంటుంది విష్ణుకంచి. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి వరదరాజస్వామి ఆలయం. అంతేకాక కామాక్షీ మందిరంలో చోరవిష్ణువు అని ఉన్నాడు.ఆయన కూడ 108దివ్యక్షేత్రములలో ఒకడు. ఈ వరదరాజస్వామి ఆలయాన్ని విష్ణుకోటి, పుణ్యకోటి అని పిలుస్తారు. ఇంద్రుడు ఒకానొక శాపానికి గురై ఏనుగు రూపం ధరించి, తపస్సు చేసి శాపవిమోచనం పొందిన చోటు విష్ణుకంచి. ఏనుగు రూపాన్ని ఇక్కడ వదిలి దేవతగా మారి వెళ్ళి పోయిన ఆఏనుగు శరీరమే హస్తిగిరి అని కొండగా మారింది. ఆగిరిపై నారాయణుడు వెలిశాడు. నరసింహ మంత్ర ఉపాసన చేశాడు కనుక ఇంద్రుని గుండెల్లోనుంచి నరసింహస్వామి వెలికి వచ్చాడు. అందుకే హస్తిగిరి నరసింహస్వామి లోపల ఉంటాడు. పైన వరదరాజస్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడే బ్రహ్మ మహాయజ్ఞము చేశాడు. అక్కడ శుక్లుడు, హేముడు అనే వేదవేత్తలైన బ్రహ్మచారులుండేవారు. వీరిద్దరూ గౌతమ మహర్షి శిష్యులు. వారుభయులూ ఒకసారి గౌతమ మహర్షి ఆజ్ఞమేరకు సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళి అభిషేకం కోసం నదీ జలాలను కూడా తెచ్చుకున్నారు. తిరిగి వచ్చే సమయంలో ఒకచోట జలపాత్రను పెట్టి ఎండు కట్టెలు ఏరుతున్నారట. వారికి తెలియకుండా ఆచెట్టుమీద ఉన్న బల్లి ఈనీటిలో పడిందట. ఆనీటిని చూసి గౌతమమహర్షి మీరిద్దరూ బల్లులుగా పుట్టండి అని శపించారట. ఇంద్రుడు హస్తిరూపంలో తొండంతో వీరు ఉన్న కొమ్మని విరిచాడు. వీరిద్దరూ ఇంద్రునిపై పడ్డారు. ఇంద్రుని తపస్సు వల్ల వారిద్దరూ పవిత్రులై వారి దేహాన్ని విడిచిపెట్టి వారి వారి రూపాలకి వెళ్ళారు. అవే కాంచీపురంలో ఉన్న బల్లులు. మానవశరీరం హస్తిగిరి, ఇంద్రియాలు ఇంద్రుడు, బల్లులు ఇడ, పింగళ నాడులు. ఇక్కడ విష్ణ్వారాధన చేస్తే కోటి పుణ్యములు లభిస్తాయి.