Tuesday 15 November 2011

*చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతునొప్పి పోవాలంటే పావుస్పూను మిరియాలపొడిని తేనెతో కలిపి వారం రోజులు తీసుకోవాలి.
*వేడి నీటిలో పసుపుపొడి వేసుకుని ఆవిరిపడితే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.
*శరీరంలో వేడి చేయడం వల్ల వచ్చే జలుబు పోవాలంటే కొబ్బరి నీరు తాగాలి.

*అలాగే పెరుగన్నంలో పచ్చి ఉల్లిపాయ వేసుకుని తినడం వల్ల దగ్గు తగ్గుతుంది.
*తేనెలో అల్లం కలుపుకుని రోజుకు మూడు, నాలుగు సార్లు తింటే దగ్గు మాయమవుతుంది.
*వేడి నీటిలో అల్లం ముక్కలు ఉడకపెట్టి కొద్దిగా చక్కెర వేసుకుని వడకట్టుకుని వేడిగా తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది